Political News

మండ‌లిని ఏం చేద్దాం.. కూట‌మి స‌ర్కారు ఎత్తు ఏంటంటే!

ఏపీలో శాస‌న మండ‌లి ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. వ‌చ్చ‌నెల 27 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పాటే మండ‌లి స‌మావేశాలు కూడా.. మొద‌లు కావాలి. అయితే.. అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న కూట‌మికి.. మండ‌లిలో మాత్రం పేల‌వ‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అసెంబ్లీలో 164 స్థానాలు ద‌క్కించుకున్న కూట‌మి పార్టీల వ్య‌వ‌హారం బాగానే ఉంది. ఏ బిల్లు తీసుకువ‌చ్చినా.. క్ష‌ణాల్లోనే ఓకే అయిపోతుంది. కానీ, మండ‌లిలో మాత్రం ద‌బిడిదిబిడే! ఈ ప‌రిస్థితి కొన‌సాగితే.. దీనికి కార‌ణం.. మండ‌లి చైర్మ‌న్ నుంచి స‌భ్యుల వ‌ర‌కు వైసీపీదే పైచేయి.

అందుకే.. ముందుగానే జ‌గ‌న్ మండ‌లి స‌భ్యుల‌ను హెచ్చ‌రించారు. అసెంబ్లీలో మ‌నం లేకున్నా.. మండ‌లిలో మ‌నోళ్లే ఉంటార‌ని.. వారే చూసుకుంటార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అంటే.. అసెంబ్లీలో ద‌క్క‌ని అధికారాన్ని ప‌రోక్షంగా మండ‌లిలో వినియోగించుకునేందుకు వైసీపీప్ర‌య‌త్నించ‌నుంది. ఇది అధికార పార్టీకి కంట్లో న‌లుసుగా మారే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శాస‌న మండ‌లిని కొన్నాళ్ల‌పాటు సుప్త చేత‌నావ‌స్థ‌లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మండ‌లిని ర‌ద్దు చేయ‌కుండా.. దీనిని వ‌చ్చే మూడేళ్ల‌పాటు అచేత‌నంగా ఉంచేందుకు అవ‌కాశం ఉందా? అని స‌ర్కారు యోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం జోరుమీదున్న చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే కీల‌క బిల్లుల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌ధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు, అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించిన మ‌రికొన్ని బిల్లుల‌తోపాటు.. ఆర్‌-5 జోన్ లో పేద‌లకు ఇచ్చిన‌ ఇళ్ల‌ను కూడా ర‌ద్దు చేయ‌నుంది. తద్వారా అమ‌రావ‌తిని ప‌టిష్టం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. అసెంబ్లీలో 164 స్థానాలు ఉన్నందున‌.. కూట‌మి స‌ర్కారుకు స‌భ‌లో ఏ బిల్లు తీసుకువ‌చ్చినా.. ఓకే అవుతుంది. కానీ, మండ‌లి విష‌యానికి వ‌స్తే బ్రేకులు ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చే ప్ర‌తి బిల్లును ఇక్క‌డ అడ్డుకునేందుకు అవ‌కాశం మెండుగా ఉంది.

ఈ క్ర‌మంలో మండ‌లిని ర‌ద్దు చేస్తే.. బెట‌ర్ అని కూట‌మిలో చ‌ర్చ సాగుతోంది. కానీ, వ‌చ్చే మూడేళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ మండ‌లిలో టీడీపీ స‌హా జ‌న‌సేన‌, బీజేపీలు పుంజుకుంటాయి. వారి వారి బ‌లం కూడా పెరుగుతుంది. దీంతో మండ‌లిని ర‌ద్దు చేయ‌డం కాకుండా.. మండ‌లిని సుప్త చేత‌నావ‌స్థ‌లో ఉంచేందుకు చూడాల‌ని భావిస్తోంది. దీనిపై న్యాయ నిపుణుల స‌ల‌హాలు కోరుతున్నారు. త‌ద్వారా.. వ‌చ్చే మూడేళ్ల‌పాటు.. వైసీపీ ఎదురు దాడి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 29, 2024 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

29 minutes ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

2 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

2 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

2 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

2 hours ago

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

5 hours ago