Political News

మండ‌లిని ఏం చేద్దాం.. కూట‌మి స‌ర్కారు ఎత్తు ఏంటంటే!

ఏపీలో శాస‌న మండ‌లి ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. వ‌చ్చ‌నెల 27 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పాటే మండ‌లి స‌మావేశాలు కూడా.. మొద‌లు కావాలి. అయితే.. అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న కూట‌మికి.. మండ‌లిలో మాత్రం పేల‌వ‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అసెంబ్లీలో 164 స్థానాలు ద‌క్కించుకున్న కూట‌మి పార్టీల వ్య‌వ‌హారం బాగానే ఉంది. ఏ బిల్లు తీసుకువ‌చ్చినా.. క్ష‌ణాల్లోనే ఓకే అయిపోతుంది. కానీ, మండ‌లిలో మాత్రం ద‌బిడిదిబిడే! ఈ ప‌రిస్థితి కొన‌సాగితే.. దీనికి కార‌ణం.. మండ‌లి చైర్మ‌న్ నుంచి స‌భ్యుల వ‌ర‌కు వైసీపీదే పైచేయి.

అందుకే.. ముందుగానే జ‌గ‌న్ మండ‌లి స‌భ్యుల‌ను హెచ్చ‌రించారు. అసెంబ్లీలో మ‌నం లేకున్నా.. మండ‌లిలో మ‌నోళ్లే ఉంటార‌ని.. వారే చూసుకుంటార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అంటే.. అసెంబ్లీలో ద‌క్క‌ని అధికారాన్ని ప‌రోక్షంగా మండ‌లిలో వినియోగించుకునేందుకు వైసీపీప్ర‌య‌త్నించ‌నుంది. ఇది అధికార పార్టీకి కంట్లో న‌లుసుగా మారే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శాస‌న మండ‌లిని కొన్నాళ్ల‌పాటు సుప్త చేత‌నావ‌స్థ‌లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మండ‌లిని ర‌ద్దు చేయ‌కుండా.. దీనిని వ‌చ్చే మూడేళ్ల‌పాటు అచేత‌నంగా ఉంచేందుకు అవ‌కాశం ఉందా? అని స‌ర్కారు యోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం జోరుమీదున్న చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే కీల‌క బిల్లుల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌ధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు, అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించిన మ‌రికొన్ని బిల్లుల‌తోపాటు.. ఆర్‌-5 జోన్ లో పేద‌లకు ఇచ్చిన‌ ఇళ్ల‌ను కూడా ర‌ద్దు చేయ‌నుంది. తద్వారా అమ‌రావ‌తిని ప‌టిష్టం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. అసెంబ్లీలో 164 స్థానాలు ఉన్నందున‌.. కూట‌మి స‌ర్కారుకు స‌భ‌లో ఏ బిల్లు తీసుకువ‌చ్చినా.. ఓకే అవుతుంది. కానీ, మండ‌లి విష‌యానికి వ‌స్తే బ్రేకులు ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చే ప్ర‌తి బిల్లును ఇక్క‌డ అడ్డుకునేందుకు అవ‌కాశం మెండుగా ఉంది.

ఈ క్ర‌మంలో మండ‌లిని ర‌ద్దు చేస్తే.. బెట‌ర్ అని కూట‌మిలో చ‌ర్చ సాగుతోంది. కానీ, వ‌చ్చే మూడేళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ మండ‌లిలో టీడీపీ స‌హా జ‌న‌సేన‌, బీజేపీలు పుంజుకుంటాయి. వారి వారి బ‌లం కూడా పెరుగుతుంది. దీంతో మండ‌లిని ర‌ద్దు చేయ‌డం కాకుండా.. మండ‌లిని సుప్త చేత‌నావ‌స్థ‌లో ఉంచేందుకు చూడాల‌ని భావిస్తోంది. దీనిపై న్యాయ నిపుణుల స‌ల‌హాలు కోరుతున్నారు. త‌ద్వారా.. వ‌చ్చే మూడేళ్ల‌పాటు.. వైసీపీ ఎదురు దాడి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 29, 2024 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

15 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

1 hour ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

1 hour ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

3 hours ago