ఒకే వేదిక‌పైకి రేవంత్‌-చంద్ర‌బాబు.. రీజ‌నేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఒక‌రికొక‌రు ఎదురు ప‌డే స‌మ‌యం వ‌చ్చేసింది. ఒక‌రిప‌క్క‌న ఒక‌రు ముఖ్య‌మంత్రుల హోదాలో కూర్చునే ప‌రిస్థితి కూడా వ‌చ్చేసింది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు వారిద్ద‌రు ఎప్పుడెప్పుడు ఎదురు ప‌డ‌తారా? అని చాలా మంది ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇబ్బందులు ఉండ‌డం.. విభ‌జ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల్సి ఉండ‌డం.. ప్ర‌ధానంగా జ‌ల స‌మ‌స్య ఇరు రాష్ట్రాల‌ను ఇరుకున పెట్ట‌డం వంటి కార‌ణంగా ఆయాన స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఏపీ సీఎం, తెలంగాణ సీఎంలు గ‌తంలో అన్యోన్యులే కాబ‌ట్టి.. వారు ఎప్పుడు ఎదురు ప‌డ‌తారా? ఆయా స‌మ‌స్య‌లు ఎప్పుడు ప‌రిష్కారం అవుతాయా? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. అయితే.. ఇది రాజ‌కీయ స‌మావేశం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక సామాజిక వ‌ర్గం పెట్టుకునే స‌మావేశం. దీనిలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌కు ఆహ్వానాలు అందాయి. వారిని పాల్గొనాలని కోరుతూ.. స‌ద‌రు సామాజిక వ‌ర్గం కోరింది. దీంతో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూడా ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

ఇక‌, విష‌యానికి వ‌స్తే.. ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిర‌ప‌డుతున్న క‌మ్మ సామాజిక వ‌ర్గం.. జూలై 20, 21 తేదీల్లో మ‌హాస‌భ పేరుతో హైద‌రాబాద్‌లో పెద్ద స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది. ‘కమ్మ గ్లోబల్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో నిర్వ‌హించ‌నున్న ఈ స‌భ‌.. ‘తొలి ప్రపంచ కమ్మ మహాసభ’గా నిర్వాహ‌కులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు. ఇలా.. ఏపీ సీఎం, తెలంగాణ సీఎంలు ప‌క్క‌న ప‌క్క‌న కూర్చొని ఒకే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు.

This post was last modified on June 29, 2024 9:52 am

Share
Show comments

Recent Posts

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

13 minutes ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

42 minutes ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

2 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

2 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

4 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

4 hours ago