కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూశారు. హైదరాబాద్లో ఉంటున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వీల్ చైర్కే పరిమితయ్యారు.
డీఎస్గా పేరుగాంచిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004, 2009 కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఈ క్రమంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగానూ కొంత కాలం పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన ఆయన బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
డీఎస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశాడు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ తండ్రి ఉన్న కాంగ్రెస్ కాకుండా అనూహ్యంగా బీజేపీ పార్టీలో చేరాడు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన అరవింద్, తాజా ఎన్నికల్లో తిరిగి రెండో సారి నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యాడు.
This post was last modified on June 29, 2024 9:47 am
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…