కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూశారు. హైదరాబాద్లో ఉంటున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వీల్ చైర్కే పరిమితయ్యారు.
డీఎస్గా పేరుగాంచిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004, 2009 కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఈ క్రమంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగానూ కొంత కాలం పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన ఆయన బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
డీఎస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశాడు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ తండ్రి ఉన్న కాంగ్రెస్ కాకుండా అనూహ్యంగా బీజేపీ పార్టీలో చేరాడు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన అరవింద్, తాజా ఎన్నికల్లో తిరిగి రెండో సారి నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యాడు.
This post was last modified on June 29, 2024 9:47 am
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…