కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూశారు. హైదరాబాద్లో ఉంటున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వీల్ చైర్కే పరిమితయ్యారు.
డీఎస్గా పేరుగాంచిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004, 2009 కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఈ క్రమంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగానూ కొంత కాలం పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన ఆయన బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
డీఎస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశాడు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ తండ్రి ఉన్న కాంగ్రెస్ కాకుండా అనూహ్యంగా బీజేపీ పార్టీలో చేరాడు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన అరవింద్, తాజా ఎన్నికల్లో తిరిగి రెండో సారి నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యాడు.
This post was last modified on June 29, 2024 9:47 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…