మరో రెండు రోజుల్లో ఏపీలో పంపిణీ చేయనున్న సామాజిక భద్రతా పింఛన్ల విషయంపై సీఎం చంద్రబాబు తాజాగా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీని పండుగలా చేపట్టాలన్నారు. జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని ఆదేశించారు. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్చార్జ్లు, ఇతర పదవుల్లో ఉన్న టీడీపీ నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు.
అదేవిదంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ ఇన్చార్జ్, టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా కనీసం 10 మంది లబ్ధిదారులకు పైగా పెన్షన్లను పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాలన్నారు. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపైనే ఉండాలని ఆదేశించారు. అలానే తన మంత్రివర్గంలోని ముఖ్య నాయకులను కూడా.. చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు సైతం జిల్లాల స్థాయిలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.
ఎందుకీ హడావుడి!
పింఛన్ల పంపిణీ సాధారణంగా ప్రతినెలా 1వ తేదీనే జరుగుతోంది. అయితే.. చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఇంతగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు? ఎందుకు ఇంతమంది నాయకులను కూడా రంగంలోకి దింపుతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీలో కొలువుదీరి 20 రోజులు మాత్రమే అయింది.
ఇంత తక్కువ సమయంలోనే సర్కారు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రూ.3000 నుంచి రూ.4000లకు పెంచి ఇస్తోంది. ఇలా .. ఒకే విడతలో రూ.1000 చొప్పున పెంచిన ప్రభుత్వం లేదు. ఇక, దివ్యాంగులకు ఇప్పటి వరకు రూ.3000 గా ఉన్న పించనును 6000లకు అంటే డబుల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పింఛన్ల పంపిణీని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఎవరెవరికి ఎంతెంత?
This post was last modified on June 28, 2024 9:05 pm
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…