Political News

పండుగ‌లా పింఛ‌న్లు.. చంద్ర‌బాబు తాజా ఆదేశం!

మ‌రో రెండు రోజుల్లో ఏపీలో పంపిణీ చేయ‌నున్న సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల విష‌యంపై సీఎం చంద్ర‌బాబు తాజాగా టీడీపీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. పింఛ‌న్ల పంపిణీని పండుగ‌లా చేప‌ట్టాల‌న్నారు. జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని ఆదేశించారు. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, ఇతర పదవుల్లో ఉన్న టీడీపీ నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు.

అదేవిదంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ ఇన్‌చార్జ్‌, టీడీపీ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా కనీసం 10 మంది లబ్ధిదారులకు పైగా పెన్షన్లను పంపిణీ చేయాల‌ని చంద్ర‌బాబు ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాల‌న్నారు. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపైనే ఉండాలని ఆదేశించారు. అలానే త‌న మంత్రివ‌ర్గంలోని ముఖ్య నాయ‌కుల‌ను కూడా.. చంద్ర‌బాబు ఆదేశించారు. మంత్రులు సైతం జిల్లాల స్థాయిలో జ‌రిగే పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని అన్నారు.

ఎందుకీ హ‌డావుడి!

పింఛ‌న్ల పంపిణీ సాధార‌ణంగా ప్ర‌తినెలా 1వ తేదీనే జ‌రుగుతోంది. అయితే.. చంద్ర‌బాబు ఇప్పుడు ఎందుకు ఇంత‌గా ప్ర‌చారం చేయాల‌ని కోరుకుంటున్నారు? ఎందుకు ఇంత‌మంది నాయ‌కుల‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారు ఏపీలో కొలువుదీరి 20 రోజులు మాత్ర‌మే అయింది.

ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే స‌ర్కారు.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు పింఛ‌న్ల‌ను రూ.3000 నుంచి రూ.4000ల‌కు పెంచి ఇస్తోంది. ఇలా .. ఒకే విడ‌త‌లో రూ.1000 చొప్పున పెంచిన ప్ర‌భుత్వం లేదు. ఇక‌, దివ్యాంగుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3000 గా ఉన్న పించ‌నును 6000ల‌కు అంటే డ‌బుల్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పింఛ‌న్ల పంపిణీని చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఎవ‌రెవ‌రికి ఎంతెంత‌?

  • వృద్ధులు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌లకు రూ.3000గా ఉన్న పింఛ‌ను రూ.4 వేలకు పెంచి ఇస్తారు.
  • దివ్యాంగుల‌కు రూ.3000గా ఉన్న పింఛ‌నును రూ.6 వేల‌కు పెంచి ఇస్తారు.
  • త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌వారికి రూ.5 వేలుగా ఉన్న పింఛ‌ను ను రూ.10 వేల‌కు పెంచి ఇస్తారు.
  • కిడ్నీ వ్యాధిగ్ర‌స్థుల‌కు రూ.5 వేలుగా ఉన్న పింఛ‌నును రూ.15 వేల‌కు పెంచి ఇస్తారు.
  • కాగా.. వృద్ధులు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల పింఛ‌నును ఏప్రిల్ నుంచి లెక్క‌గ‌ట్టి.. మ‌రో రూ.3 వేల‌ను అద‌నంగా ఇస్తారు.
  • దివ్యాంగుల పింఛ‌నును కూడా ఏప్రిల్ నుంచి లెక్క‌గ‌ట్టి పెంచి ఇవ్వ‌నున్నారు.
Satya

Recent Posts

తెప్ప త‌గ‌లేసిన త‌మ‌న్నా

కెరీర్ తొలి నాళ్ల‌లో పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌పుడు ద‌క్షిణాదిన వ‌చ్చే ప్ర‌తి ఛాన్సునూ మ‌హా ప్ర‌సాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…

2 hours ago

పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

5 hours ago

ఆర్సీ 17… చెప్పనన్న సుకుమార్

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…

5 hours ago

చంద్రబాబు పవన్ పై మాట పడనివ్వరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…

6 hours ago

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

7 hours ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

8 hours ago