తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఉత్కృష్టం. ఈషణ్మాత్ర(సెకనులో సగభాగం) దర్శనం లభిస్తే.. చాలని పరితపించే దేవదేవుని భక్తులు వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మరీ తిరుమల గిరులకు క్యూ కడుతుంటారు. అంత డిమాండ్ ఉండే శ్రీవారి దర్శనాన్ని వైసీపీ నాయకులు రాజకీయం చేసేశారు. తమ చేతికి ఎముక లేకుండా.. సిఫారసు లేఖలు ఇచ్చేశారు. దీంతో వైసీపీ భక్తులు.. లెక్కకు మిక్కిలి సంఖ్యలో శ్రీవారి దర్శనాలు చేసుకున్నారు. అయితే ఏంటి నొప్పి అనుకుంటున్నారా? దీనివల్ల సాధారణ భక్తులకు శ్రీవారు దూరమయ్యారు.
వైసీపీ హయాంలో మంత్రులుగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు, అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు.. తమ వారికి లెక్కకు మించిన సిఫారసు లేఖలు ఇచ్చినట్టు తాజాగా విజిలెన్స్ విభాగం గుట్టును బయట పెట్టింది. రోజా అయితే.. స్వయంగా తనతో మందలకొద్దీ భక్తులను(అయిన వారిని) తీసుకువెళ్లి ఒకే టికెట్పై పదుల సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తాజా విచారణలో బ్రేక్ దర్శనం పేరుతో ఆమె వందల కొద్దీ సిఫారసు లేఖలు ఇచ్చారని తెలిసింది.
ఇక, మరో కీలక నేత, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనంలో ఒకేసారి 54 మందిని శ్రీవారి దర్శనానికి పంపిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. తాను పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ ఆయన రాసిన సిఫారుసు లేఖను టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు ఈ బ్రేక్ దర్శనం స్కాంతోపాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కుంభకోణంపైనా టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. మొత్తంగా చూస్తే.. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని వైసీపీ రాజకీయ దేవదేవుడిగా మార్చేసిన ఉందంతం చూసి.. కోనేటి రాయుడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 28, 2024 2:02 pm
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…