తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఉత్కృష్టం. ఈషణ్మాత్ర(సెకనులో సగభాగం) దర్శనం లభిస్తే.. చాలని పరితపించే దేవదేవుని భక్తులు వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మరీ తిరుమల గిరులకు క్యూ కడుతుంటారు. అంత డిమాండ్ ఉండే శ్రీవారి దర్శనాన్ని వైసీపీ నాయకులు రాజకీయం చేసేశారు. తమ చేతికి ఎముక లేకుండా.. సిఫారసు లేఖలు ఇచ్చేశారు. దీంతో వైసీపీ భక్తులు.. లెక్కకు మిక్కిలి సంఖ్యలో శ్రీవారి దర్శనాలు చేసుకున్నారు. అయితే ఏంటి నొప్పి అనుకుంటున్నారా? దీనివల్ల సాధారణ భక్తులకు శ్రీవారు దూరమయ్యారు.
వైసీపీ హయాంలో మంత్రులుగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు, అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు.. తమ వారికి లెక్కకు మించిన సిఫారసు లేఖలు ఇచ్చినట్టు తాజాగా విజిలెన్స్ విభాగం గుట్టును బయట పెట్టింది. రోజా అయితే.. స్వయంగా తనతో మందలకొద్దీ భక్తులను(అయిన వారిని) తీసుకువెళ్లి ఒకే టికెట్పై పదుల సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తాజా విచారణలో బ్రేక్ దర్శనం పేరుతో ఆమె వందల కొద్దీ సిఫారసు లేఖలు ఇచ్చారని తెలిసింది.
ఇక, మరో కీలక నేత, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనంలో ఒకేసారి 54 మందిని శ్రీవారి దర్శనానికి పంపిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. తాను పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ ఆయన రాసిన సిఫారుసు లేఖను టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు ఈ బ్రేక్ దర్శనం స్కాంతోపాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కుంభకోణంపైనా టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. మొత్తంగా చూస్తే.. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని వైసీపీ రాజకీయ దేవదేవుడిగా మార్చేసిన ఉందంతం చూసి.. కోనేటి రాయుడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 28, 2024 2:02 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…