Political News

తిరుమలలో ఇష్టారాజ్యం నడిపించారు

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఉత్కృష్టం. ఈష‌ణ్మాత్ర‌(సెక‌నులో స‌గ‌భాగం) ద‌ర్శ‌నం ల‌భిస్తే.. చాల‌ని ప‌రిత‌పించే దేవ‌దేవుని భ‌క్తులు వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని మ‌రీ తిరుమ‌ల గిరుల‌కు క్యూ క‌డుతుంటారు. అంత డిమాండ్ ఉండే శ్రీవారి ద‌ర్శ‌నాన్ని వైసీపీ నాయ‌కులు రాజ‌కీయం చేసేశారు. త‌మ చేతికి ఎముక లేకుండా.. సిఫార‌సు లేఖ‌లు ఇచ్చేశారు. దీంతో వైసీపీ భ‌క్తులు.. లెక్క‌కు మిక్కిలి సంఖ్య‌లో శ్రీవారి ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. అయితే ఏంటి నొప్పి అనుకుంటున్నారా? దీనివ‌ల్ల సాధార‌ణ భ‌క్తుల‌కు శ్రీవారు దూర‌మయ్యారు.

వైసీపీ హ‌యాంలో మంత్రులుగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన రోజా, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, టీటీడీ బోర్డు స‌భ్యుడు, అప్ప‌టి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిలు.. త‌మ వారికి లెక్కకు మించిన సిఫార‌సు లేఖలు ఇచ్చిన‌ట్టు తాజాగా విజిలెన్స్ విభాగం గుట్టును బ‌య‌ట పెట్టింది. రోజా అయితే.. స్వ‌యంగా త‌న‌తో మంద‌ల‌కొద్దీ భ‌క్తుల‌ను(అయిన వారిని) తీసుకువెళ్లి ఒకే టికెట్‌పై ప‌దుల సంఖ్య‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే.. తాజా విచార‌ణ‌లో బ్రేక్ ద‌ర్శ‌నం పేరుతో ఆమె వంద‌ల కొద్దీ సిఫార‌సు లేఖ‌లు ఇచ్చార‌ని తెలిసింది.

ఇక‌, మ‌రో కీల‌క నేత‌, అప్ప‌టి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనంలో ఒకేసారి 54 మందిని శ్రీవారి దర్శనానికి పంపిన వ్య‌వ‌హారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాను పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ ఆయన రాసిన సిఫారుసు లేఖను టీడీపీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. మ‌రోవైపు ఈ బ్రేక్ దర్శనం స్కాంతోపాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కుంభకోణంపైనా టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. మొత్తంగా చూస్తే.. అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కుడిని వైసీపీ రాజ‌కీయ దేవ‌దేవుడిగా మార్చేసిన ఉందంతం చూసి.. కోనేటి రాయుడి భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Satya

Recent Posts

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

6 minutes ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

2 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

2 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

2 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

3 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

3 hours ago