‘నేను 2008లో తొలిసారి రామోజీరావు గారిని కలిశాను. రామోజీ రావు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారు. ఆయన మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీ వివరించారు’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ సంస్మరణ సభకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని, ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని రామోజీరావు అనే వారని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారని పవన్ అన్నారు. రాజధాని అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా సూచించారు.
పత్రికా స్వేచ్చ ఎంత అవసరమో రామోజీరావు ఎప్పుడూ చెప్పేవారు, ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా ఆయన జర్నలిజం విలువలను వదల్లేదు అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.
This post was last modified on June 28, 2024 9:48 am
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…