Political News

వైసీపీని టెన్ష‌న్‌లో పెట్టేసిన హైకోర్టు!

ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ.. ఇప్పుడు కార్యాల‌యాల కూల్చివేత‌పై బెంగ పెట్టుకుంది. అన‌ధికారి కంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యాల‌ను నిర్మిస్తున్న నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం వాటిని కూల్చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో వాటిని క‌క్ష పూరితంగానే కూల్చేస్తు న్నార‌ని పేర్కొంటూ.. వైసీపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. అయితే.. కూల్చివేత‌ల‌కు.. ఒక్క రోజు విరామం ఇవ్వాలంటూ.. హైకోర్టు ఆదేశించింది.

దీంతో గురువారం నాడు అధికారులు దూరంగానే ఉండిపోయారు. దీంతో మ‌రోసారి వైసీపీ నాయ‌కులు హైకోర్టును ఆశ్ర‌యించి.. కూల్చివేత‌ల‌ను నిలుపుద‌ల చేయించాల‌ని అభ్య‌ర్థించారు. త‌మ వాద‌న‌లు వినిపించారు. వీటిని గ‌త ప్ర‌భుత్వం.. కేబినెట్ నిర్ణ‌యం మేర‌కు అనుమ‌తి ఇచ్చింద‌ని తెలిపారు. కానీ, ప్ర‌స్తుత రాష్ట్ర‌ ప్రభుత్వం రాజ‌కీయ‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వివ‌రించారు.  దీనిని దృష్టిలో పెట్టుకుని.. కార్యాల‌యాల‌ను కూల్చివేయ‌కుండా.. నిలువ‌రించాల‌ని హైకోర్టును అభ్య‌ర్థించారు.

దీనిపై మ‌రోసారి విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. తుది తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 16 వైసీపీ కార్యాలయాలపై `స్టేటస్ కో` కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే.. ఆ ఉత్త‌ర్వులు ఎలా ఉంటాయ‌నే విష‌యంపై వైసీపీ నాయ‌కులు దిగులు పెట్టుకున్నారు. టెన్ష‌న్‌తో న్యాయ నిపుణులను ఆశ్ర‌యిస్తున్నారు. త‌మ వాద‌న‌లు ఎలా ఉన్నాయ‌న్న విష‌యంపైనా ఆరా తీస్తున్నారు. గ‌తంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల‌ను కూడా.. వారు అధ్య‌య‌నం చేస్తున్నారు. మొత్తానికి ఒక‌ప్పుడు ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీని టెన్ష‌న్ పెట్టిన వైసీపీ నాయ‌కులు ఇప్పుడు వారే టెన్ష‌న్ ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on June 28, 2024 6:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

4 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

5 hours ago