ఈనాడు సంస్థల మాజీ చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభ ఈరోజు విజయవాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సంస్మరణ సభకు రాజకీయ, పాత్రికేయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ వేదికపై రామోజీరావు గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహోన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతీక రామోజీరావు అని కీరవాణి కొనియాడారు. రామోజీరావు లాగా ఒక్కరోజు బతికినా చాలని గతంలో ఓ సభలో తాను అన్నానని, రామోజీరావు లాగా చనిపోవాలని ఈ సభలో అంటున్నానని కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కురుక్షేత్ర మహా సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చే వరకు ఆపారని, అదే మాదిరిగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల నుంచి బయటపడడం చూసి ఆయన మరణించారని కీరవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై కీరవాణి చేసిన ఈ వ్యాఖ్యల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు..గత ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని, కానీ, కీరవాణి వంటి సంగీత దిగ్గజం చేసిన వ్యాఖ్యలు మాత్రం వాటన్నింటిని మించాయని సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
దీనిని బట్టి సినీ రంగం గత ప్రభుత్వం చేతిలో ఎన్ని ఇబ్బందులకు గురైందో అర్థం చేసుకోవచ్చని చర్చిస్తున్నారు. ఏనాడూ రాజకీయాల గురించి మాట్లాడని కీరవాణి వంటి వారు సైతం జగన్ ప్రభుత్వాన్ని నేరుగా విమర్శిస్తున్నారంటే వారి కడుపు ఎంత రగిలిపోయి ఉంటుందో అని నెటిజన్లు అనుకుంటున్నారు.
ఇక, రామోజీరావు ఫొటో దేవుడు ఉండాల్సిన చోట తమ ఇంట్లో ఉంటుందని, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి చిరకాలం ఉంటుందని కీరవాణి అన్నారు. రామోజీరావు సంగీత దర్శకుడిగా తనకు జన్మనిచ్చారని, ఉషా కిరణ్ మూవీస్ లో మనసు-మమత చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలైందని కీరవాణి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…