జగన్ ప్రభుత్వంపై కీరవాణి సంచలన వ్యాఖ్యలు

ఈనాడు సంస్థల మాజీ చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభ ఈరోజు విజయవాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సంస్మరణ సభకు రాజకీయ, పాత్రికేయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ వేదికపై రామోజీరావు గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహోన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతీక రామోజీరావు అని కీరవాణి కొనియాడారు. రామోజీరావు లాగా ఒక్కరోజు బతికినా చాలని గతంలో ఓ సభలో తాను అన్నానని, రామోజీరావు లాగా చనిపోవాలని ఈ సభలో అంటున్నానని కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కురుక్షేత్ర మహా సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చే వరకు ఆపారని, అదే మాదిరిగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల నుంచి బయటపడడం చూసి ఆయన మరణించారని కీరవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై కీరవాణి చేసిన ఈ వ్యాఖ్యల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు..గత ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని, కానీ, కీరవాణి వంటి సంగీత దిగ్గజం చేసిన వ్యాఖ్యలు మాత్రం వాటన్నింటిని మించాయని సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

దీనిని బట్టి సినీ రంగం గత ప్రభుత్వం చేతిలో ఎన్ని ఇబ్బందులకు గురైందో అర్థం చేసుకోవచ్చని చర్చిస్తున్నారు. ఏనాడూ రాజకీయాల గురించి మాట్లాడని కీరవాణి వంటి వారు సైతం జగన్ ప్రభుత్వాన్ని నేరుగా విమర్శిస్తున్నారంటే వారి కడుపు ఎంత రగిలిపోయి ఉంటుందో అని నెటిజన్లు అనుకుంటున్నారు.

ఇక, రామోజీరావు ఫొటో దేవుడు ఉండాల్సిన చోట తమ ఇంట్లో ఉంటుందని, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి చిరకాలం ఉంటుందని కీరవాణి అన్నారు. రామోజీరావు సంగీత దర్శకుడిగా తనకు జన్మనిచ్చారని, ఉషా కిరణ్ మూవీస్ లో మనసు-మమత చిత్రంతో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలైందని కీరవాణి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

33 minutes ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

2 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

2 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

2 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

5 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

6 hours ago