ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్నా క్యాంటీన్లను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహకారం అందిస్తారు. ఒక్క క్యాంటీన్ నడవడానికి రోజుకు రూ.20 వేల వరకు నిధులు అవసమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 60 శాతం నిధులు.. కార్పొరేషన్లు 35 శాతం నిధులు వెచ్చించేలా ప్లాన్చేస్తున్నారు.
అన్నా క్యాంటీన్లను గతంలో నిర్వహించినప్పుడు కూడా ఇదే పద్ధతిలో నిధులను వెచ్చించారు. అయితే.. ఇప్పుడు వీటికి తోడు అన్నా క్యాంటీన్లను మరింత ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో స్వచ్ఛంద సంస్థల పాత్రను కూడా.. ప్రధానంగా వినియోగించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలను ఆయన ప్రోత్సహిస్తారు. ఆయా సంస్థలు ఒక రోజు విరాళంగా ప్రాంతాల వారీగా కానీ.. మండలాల వారీగా కానీ.. జిల్లాల్లో కానీ.. భోజనం సహా అల్పాహారాలు అందించేం దుకు అవకాశం కల్పించనున్నారు.
అదేవిధంగా వ్యక్తులను కూడా అన్నాక్యాంటీన్లలో భాగస్వామ్యం చేయనున్నారు. సహజంగా ఇళ్లకు మాత్ర మే పరిమితమయ్యే పుట్టిన రోజులు, పెళ్లిరోజులు, ఇతరత్రా శుభకార్యాలయాల రోజుల్లో పది మందికి భోజ నం పెట్టాలని అనుకునేవారు ఉంటారు. వీరికి అన్నాక్యాంటీన్లను చేరువ చేయాలని చంద్రబాబు భావిస్తు న్నారు. వారు ఆ రోజు వరకు అన్నాక్యాంటీన్ల ద్వారా.. పేదలకు ఆహారం అందించేలా ఈ క్యాంటన్లలో వెసులుబాటుకల్పించనున్నారు. తద్వారా.. సమాజానికి సేవ చేశామన్న తృప్తి వారికి.. అన్యాక్యాంటీన్ల ద్వారా.. పేదలకు ఆహారం అందించామన్న సంతృప్తి వీరికి దక్కేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…