ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్నా క్యాంటీన్లను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహకారం అందిస్తారు. ఒక్క క్యాంటీన్ నడవడానికి రోజుకు రూ.20 వేల వరకు నిధులు అవసమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 60 శాతం నిధులు.. కార్పొరేషన్లు 35 శాతం నిధులు వెచ్చించేలా ప్లాన్చేస్తున్నారు.
అన్నా క్యాంటీన్లను గతంలో నిర్వహించినప్పుడు కూడా ఇదే పద్ధతిలో నిధులను వెచ్చించారు. అయితే.. ఇప్పుడు వీటికి తోడు అన్నా క్యాంటీన్లను మరింత ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో స్వచ్ఛంద సంస్థల పాత్రను కూడా.. ప్రధానంగా వినియోగించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలను ఆయన ప్రోత్సహిస్తారు. ఆయా సంస్థలు ఒక రోజు విరాళంగా ప్రాంతాల వారీగా కానీ.. మండలాల వారీగా కానీ.. జిల్లాల్లో కానీ.. భోజనం సహా అల్పాహారాలు అందించేం దుకు అవకాశం కల్పించనున్నారు.
అదేవిధంగా వ్యక్తులను కూడా అన్నాక్యాంటీన్లలో భాగస్వామ్యం చేయనున్నారు. సహజంగా ఇళ్లకు మాత్ర మే పరిమితమయ్యే పుట్టిన రోజులు, పెళ్లిరోజులు, ఇతరత్రా శుభకార్యాలయాల రోజుల్లో పది మందికి భోజ నం పెట్టాలని అనుకునేవారు ఉంటారు. వీరికి అన్నాక్యాంటీన్లను చేరువ చేయాలని చంద్రబాబు భావిస్తు న్నారు. వారు ఆ రోజు వరకు అన్నాక్యాంటీన్ల ద్వారా.. పేదలకు ఆహారం అందించేలా ఈ క్యాంటన్లలో వెసులుబాటుకల్పించనున్నారు. తద్వారా.. సమాజానికి సేవ చేశామన్న తృప్తి వారికి.. అన్యాక్యాంటీన్ల ద్వారా.. పేదలకు ఆహారం అందించామన్న సంతృప్తి వీరికి దక్కేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
This post was last modified on June 27, 2024 8:11 pm
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…