Political News

ఆద‌ర్శ‌ప్రాయంగా అన్నా క్యాంటీన్లు.. విష‌యం ఏంటంటే!

ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న అన్నా క్యాంటీన్ల‌ను ఆద‌ర్శ‌ప్రాయంగా తీర్చిదిద్దేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్ని నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. ఒక‌వైపు ప్ర‌భుత్వం వైపు నుంచి ఆర్థిక స‌హ‌కారం అందిస్తారు. ఒక్క క్యాంటీన్ న‌డ‌వ‌డానికి రోజుకు రూ.20 వేల వ‌ర‌కు నిధులు అవ‌స‌మ‌వుతాయ‌ని అంచనా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం 60 శాతం నిధులు.. కార్పొరేష‌న్లు 35 శాతం నిధులు వెచ్చించేలా ప్లాన్‌చేస్తున్నారు.

అన్నా క్యాంటీన్ల‌ను గ‌తంలో నిర్వ‌హించిన‌ప్పుడు కూడా ఇదే ప‌ద్ధ‌తిలో నిధుల‌ను వెచ్చించారు. అయితే.. ఇప్పుడు వీటికి తోడు అన్నా క్యాంటీన్ల‌ను మ‌రింత ఆద‌ర్శంగా తీర్చిదిద్దే క్ర‌మంలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల పాత్ర‌ను కూడా.. ప్ర‌ధానంగా వినియోగించుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చే సంస్థ‌ల‌ను ఆయ‌న ప్రోత్స‌హిస్తారు. ఆయా సంస్థ‌లు ఒక రోజు విరాళంగా ప్రాంతాల వారీగా కానీ.. మండ‌లాల వారీగా కానీ.. జిల్లాల్లో కానీ.. భోజ‌నం స‌హా అల్పాహారాలు అందించేం దుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.

అదేవిధంగా వ్య‌క్తుల‌ను కూడా అన్నాక్యాంటీన్ల‌లో భాగ‌స్వామ్యం చేయ‌నున్నారు. స‌హ‌జంగా ఇళ్ల‌కు మాత్ర మే ప‌రిమిత‌మ‌య్యే పుట్టిన రోజులు, పెళ్లిరోజులు, ఇత‌ర‌త్రా శుభ‌కార్యాల‌యాల రోజుల్లో ప‌ది మందికి భోజ నం పెట్టాల‌ని అనుకునేవారు ఉంటారు. వీరికి అన్నాక్యాంటీన్ల‌ను చేరువ చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తు న్నారు. వారు ఆ రోజు వ‌రకు అన్నాక్యాంటీన్ల ద్వారా.. పేద‌ల‌కు ఆహారం అందించేలా ఈ క్యాంట‌న్ల‌లో వెసులుబాటుక‌ల్పించ‌నున్నారు. తద్వారా.. స‌మాజానికి సేవ చేశామ‌న్న తృప్తి వారికి.. అన్యాక్యాంటీన్ల ద్వారా.. పేద‌ల‌కు ఆహారం అందించామ‌న్న సంతృప్తి వీరికి ద‌క్కేలా చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. 

This post was last modified on June 27, 2024 8:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

6 minutes ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

4 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

9 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

10 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

10 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

10 hours ago