వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఇల్లూ, వాకిలీ వదిలిపెట్టి వెళ్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాశీ పుణ్యక్షేత్రంలో తలదాచుకున్న కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు.
అనారోగ్యంతో ఆరుద్ర కూతురు వీల్ చెయిర్ కే పరిమితమయింది. ఆమెకు కలిగిన ఇబ్బందులు, ఆమె కూతురు దుస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు నాయుడు అవసరమైన సాయం అందిస్తామని ఈ నెల 14న హామీ ఇచ్చారు. ఆరుద్ర కుమార్తెకు వైద్యం చేయిస్తామని, ఆర్థిక సాయం అందిస్తామని భరోసానిచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పిలిచి రూ.5 లక్షల చెక్ అందజేశారు. .‘నా బిడ్డకు తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. మీ అందరి దీవెనల వల్లే నా కుమార్తె ఈ రోజు ప్రాణాలతో ఉంది’ అని ఆరుద్ర అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేస్తాం, చూస్తాం అనడమే తప్ప ప్రభుత్వం తరఫున తనకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, పైగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని ఆరుద్ర వాపోయింది. కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పారని, తమను ఇబ్బంది పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని, కోర్టు కేసులు క్లియర్ చేసి తమ ఆస్తి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
This post was last modified on June 27, 2024 8:02 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…