వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఇల్లూ, వాకిలీ వదిలిపెట్టి వెళ్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాశీ పుణ్యక్షేత్రంలో తలదాచుకున్న కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు.
అనారోగ్యంతో ఆరుద్ర కూతురు వీల్ చెయిర్ కే పరిమితమయింది. ఆమెకు కలిగిన ఇబ్బందులు, ఆమె కూతురు దుస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు నాయుడు అవసరమైన సాయం అందిస్తామని ఈ నెల 14న హామీ ఇచ్చారు. ఆరుద్ర కుమార్తెకు వైద్యం చేయిస్తామని, ఆర్థిక సాయం అందిస్తామని భరోసానిచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పిలిచి రూ.5 లక్షల చెక్ అందజేశారు. .‘నా బిడ్డకు తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. మీ అందరి దీవెనల వల్లే నా కుమార్తె ఈ రోజు ప్రాణాలతో ఉంది’ అని ఆరుద్ర అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేస్తాం, చూస్తాం అనడమే తప్ప ప్రభుత్వం తరఫున తనకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, పైగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని ఆరుద్ర వాపోయింది. కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పారని, తమను ఇబ్బంది పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని, కోర్టు కేసులు క్లియర్ చేసి తమ ఆస్తి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
This post was last modified on June 27, 2024 8:02 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…