వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఇల్లూ, వాకిలీ వదిలిపెట్టి వెళ్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాశీ పుణ్యక్షేత్రంలో తలదాచుకున్న కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు.
అనారోగ్యంతో ఆరుద్ర కూతురు వీల్ చెయిర్ కే పరిమితమయింది. ఆమెకు కలిగిన ఇబ్బందులు, ఆమె కూతురు దుస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు నాయుడు అవసరమైన సాయం అందిస్తామని ఈ నెల 14న హామీ ఇచ్చారు. ఆరుద్ర కుమార్తెకు వైద్యం చేయిస్తామని, ఆర్థిక సాయం అందిస్తామని భరోసానిచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పిలిచి రూ.5 లక్షల చెక్ అందజేశారు. .‘నా బిడ్డకు తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. మీ అందరి దీవెనల వల్లే నా కుమార్తె ఈ రోజు ప్రాణాలతో ఉంది’ అని ఆరుద్ర అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేస్తాం, చూస్తాం అనడమే తప్ప ప్రభుత్వం తరఫున తనకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, పైగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని ఆరుద్ర వాపోయింది. కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పారని, తమను ఇబ్బంది పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని, కోర్టు కేసులు క్లియర్ చేసి తమ ఆస్తి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
This post was last modified on June 27, 2024 8:02 pm
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధికంగా రూ.700 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ట్రైలర్…
‘కల్కి’ సినిమాలో ఎన్ని పాత్రలున్నాయో లెక్క పెట్టి చెప్పడం కష్టం. అతిథి పాత్రలు చేసిన వాళ్ల లిస్టే చాలా పెద్దది.…
కేవలం ఒక్క సినిమాతో ఒక హీరో మార్కెట్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, మార్కెట్ ఎన్నో రెట్లు పెరిగిపోవడం ‘బాహుబలి’తో ప్రభాస్…
ఈ గురువారం రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. సినిమాలో కూడా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘కల్కి 2898 ఏడీ’ రిలీజైపోయింది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి…
‘కల్కి 2898 ఏడీ’ లాంటి ఎపిక్ మూవీకి పని చేసిన సాంకేతిక నిపుణుల విషయంలో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇలాంటి భారీ…