ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పెద్ద పీట వేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు నేపథ్యంలో 175 శాసనసభ స్థానాలకు గాను 21 జనసేనకు, బీజేపీకి 10 శాసనసభ స్థానాలు కేటాయించడంతో టీడీపీ 144 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశానుసారం అభ్యర్థుల గెలుపుకోసం, కూటమి ఘనవిజయం కోసం కృషిచేసిన నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పోరేషన్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘనవిజయం కోసం కృషిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గెలుపుకోసం పనిచేసిన మహమ్మద్ ఇక్బాల్ లను శాసనమండలికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వీరిద్దరినీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు సమాచారం.
This post was last modified on June 27, 2024 5:26 pm
ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్బస్టర్ కొట్టి దశాబ్దం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…