ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పెద్ద పీట వేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు నేపథ్యంలో 175 శాసనసభ స్థానాలకు గాను 21 జనసేనకు, బీజేపీకి 10 శాసనసభ స్థానాలు కేటాయించడంతో టీడీపీ 144 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశానుసారం అభ్యర్థుల గెలుపుకోసం, కూటమి ఘనవిజయం కోసం కృషిచేసిన నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పోరేషన్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘనవిజయం కోసం కృషిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గెలుపుకోసం పనిచేసిన మహమ్మద్ ఇక్బాల్ లను శాసనమండలికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వీరిద్దరినీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు సమాచారం.
This post was last modified on June 27, 2024 5:26 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…