Political News

ఏపీలో ముదిరిన వ‌లంటీర్ల వ్య‌వ‌హారం

ఏపీలో కీల‌క‌మైన వ‌లంటీర్ల వ్య‌వ‌హారం ముదిరింది. వైసీపీ హ‌యాంలో 2019లో నియ‌మితులైన వ‌లంటీర్ల విష‌యం.. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు పెను వివాదం రేపిన విష‌యం తెలిసిందే. వీరంతా వైసీపీకి అనుబంధంగా ప‌నిచేస్తున్నార‌ని.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని పేర్కొంటూ.. సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ అనే స్వ‌చ్ఛంద సంస్త కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దీంతో ఎన్నిక‌ల వేళ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌న పెట్టారు. ఈ స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూట‌మి.. తాము అధికారంలోకి వ‌స్తే వ‌లంటీర్ల‌ను కొన‌సాగిస్తామ‌ని హామీ ఇచ్చింది.

అంతేకాదు.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రో అడుగు ముందుకు వేసి.. తాము అధికారంలోకి వ‌చ్చాక వ‌లంటీర్ల వేత‌నాల‌ను రూ.5000 నుంచి రూ.10 వేల‌కు పెంచుతామ‌ని చెప్పారు. అయితే..స‌ర్కారు వ‌చ్చినా.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోలేదు. అంతేకాదు.. జూలై 1వ తేదీన ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇవ్వాల్సిన సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లోని కార్య‌ద‌ర్శులు, ఇత‌ర సిబ్బందితో పంపిణీ చేయించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఏం చేస్తార‌నే చ‌ర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలో మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అస‌లు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఏపీ హైకోర్టులో తాజాగా పిటిష‌న్ దాఖ‌లైంది. గ‌త వైసీపీ హ‌యాంలో చేప‌ట్టిన వ‌లంటీర్ నియామాలు అన్నీ.. అస్ప‌ష్టంగా ఉన్నాయని.. రిజ‌ర్వేష‌న్ల‌ను పాటించ‌లేద‌ని పిటిష‌నర్ పేర్కొన్నారు. అంతేకాదు.. వైసీపీకి నాయ‌కుల అనుచ‌రుల‌ను, వారి కుటుంబ స‌భ్యుల‌ను కూడా వ‌లంటీర్లుగా నియ‌మించుకున్నార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌నే ర‌ద్దు చేయాల‌ని కోరారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. స‌మాధానం చెప్పాలంటూ చంద్ర‌బాబు స‌ర్కారును ఆదేశించింది.

ర‌ద్దు చేస్తే..

ప్ర‌స్తుతం వేసిన పిటిష‌న్‌పై హైకోర్టుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి స‌మాధానం చెబుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే.. స‌మాధానం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తే.. రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు ఇబ్బంది వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ఒక వేళ ఇప్పుడున్న వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసినా కొత్త‌గా నూత‌న వ‌లంటీర్ల నియామ‌కం చేప‌ట్టే అవ‌కాశం ఉంది. అయితే.. అప్పుడు ఏ విధానంలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తారో చూడాలి. ఇదిలావుంటే.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఓన్ చేసుకున్న‌ వైసీపీ మాత్రం ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

అల్లు అర్జున్ 23… ఇబ్బందేం లేదు!

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…

26 minutes ago

ఔను… ర‌జినీ సినిమాకు మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు మారాడు

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఒక సినిమా తీయాల‌ని ఏడాది కింద‌ట్నుంచి ప్ర‌య‌త్నాలు…

33 minutes ago

ఢిల్లీలో చర్చలు.. భారత్ పై కొత్త పన్నులు.. ట్రంప్ డబుల్ గేమ్!

భారత్ తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంటామని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు…

2 hours ago

డాన్ 3 గొడవ నుంచి బయటపడ్డ రణ్‌వీర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కు ఒక పెద్ద ఊరట లభించింది. డాన్ 3 సినిమా వివాదం నేపథ్యంలో…

2 hours ago

టెన్షన్ పెట్టిన ‘పెద్ద’ మల్టీప్లెక్సులు

ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నప్పుడు నిర్మాతకు ఫలితం కన్నా ఎక్కువగా ఆందోళనకు గురి చేసే అంశాలు చాలా ఉంటాయి. వాటిలో…

2 hours ago

తెలంగాణ విషయంలో పవన్ కు బాబు మద్దతు

తెలంగాణ‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించదలిచిన సభకు పోలీసులు, కోర్టు అనుమతినివ్వకపోవడం రాజకీయ దుమారానికి తెర లేపిన…

3 hours ago