ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన మాటతీరు చిత్రంగా ఉంటున్నాయి. ఓవైపు 40 శాతం జనం ఇంకా మనవైపే ఉన్నారు అంటూనే.. ఇంకోవైపు ఈవీఎంల హ్యాకింగ్ అంటూ ఆరోపణలు చేశారు.
గతంలో ఈవీఎంల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలనే గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఆయన్ని ఒక ఆట ఆడుకున్నారు నెటిజన్లు. అధికారంలో ఉన్నపుడు మాట్లాడిన మాటలకు, చేసిన చేతలకు.. ఇప్పుడు స్పందిస్తున్న తీరుకు పొంతన ఉండట్లేదని ఆయన్ని రాజకీయ ప్రత్యర్థులే కాక సామాన్య జనాలు కూడా తప్పుబడుతున్నారు. తాజాగా జగన్.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ స్పీకర్కు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ఇందులో ఆయన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఒక ప్రణాళిక ప్రకారమే ఈ పని చేశారని అనిపిస్తోంది.
అసెంబ్లీలో మొత్తం సభ్యుల్లో వైసీపీకి పది శాతం ఎమ్మెల్యేలు లేని నేపథ్యంలో జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఆయన కోర్టుకు వెళ్లినా, ఇంకో ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేనట్లే. ఈ విషయం జగన్కు కూడా తెలియంది కాదు. కానీ ఆయన కావాలనే ఈ లేఖ రాశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాను అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేదని ఇంతకుముందు పార్టీ నేతల సమావేశంలో జగన్ వ్యాఖ్యల్ని బట్టే అర్థమైంది. 151 మంది సభ్యులతో అసెంబ్లీలో అంతులేని అధికారాన్ని అనుభవించాక జగన్కు అసెంబ్లీకి రావడానికి మొహం చెల్లదని.. ఆయన సమావేశాల్లో పాల్గొనరని రఘురామకృష్ణంరాజు లాంటి నేతలు ముందే అంచనా వేశారు. జగన్ తీరు చూస్తే అదే జరగబోతోందనిపిస్తోంది. కానీ అసెంబ్లీకి రాకపోవడానికి ఏదో ఒక కారణం చూపించే జనాల్లోకి వెళ్లాలి. అందుకే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, సభలో అవమానించారని జనాలకు చెప్పుకోవాలి. తద్వారా కొంత సానుభూతి రాబట్టాలి. ఈ కారణం చూపి ఇంకెప్పుడూ అసెంబ్లీకి వెళ్లకుండా మానుకోవాలి. అందుకే అధికార పార్టీని, స్పీకర్ను తప్పుబడుతూ ఒక లేఖ రాసి.. ఈ అంశాన్ని జగన్ ఒక సాకుగా వాడుకుని అసెంబ్లీకి దూరమయ్యే ప్లాన్ వేశారని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on June 26, 2024 2:44 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…