Political News

ఏపీ విష‌యంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు!

జ‌గ‌న్ వివాదాస్ప‌ద నిర్ణ‌యాల్లో త‌న‌కు న‌చ్చ‌ని మీడియాపై నిషేధం విధించ‌డ‌మే. అప్ప‌ట్లో 2019-24 మ‌ధ్య‌.. కొన్ని చానెళ్ల‌ను రాష్ట్రంలో ప్ర‌జ‌లుఎవ‌రూ వీక్షించేందుకు వీలు లేకుండా.. సిటీ కేబుల్ ఆప‌రేట‌ర్ల‌పై ఒత్తిడి తెచ్చి.. వాటి ప్ర‌సారాల‌ను నిలుపుద‌ల చేయించారు. దీంతో ఆయా చానెళ్ల యాజ‌మాన్యాలు కోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందాయి.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు కొలువుదీరిన త‌ర్వాత‌.. సీఎం చంద్ర‌బాబుకు తెలిసి జ‌రిగిందో.. తెలియ‌క జ‌రిగిందో తెలియదు కానీ.. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామీణ‌, న‌గ‌ర ప్రాంతాల్లోని సిటీ కేబుల్ ఆప‌రేట‌ర్లు.. కొన్ని వైసీపీ అనుకూల మీడియాలంటూ.. ముద్ర‌వేసి వాటిని ప్ర‌సారం చేయ‌డం మానేశారు. వీటిలో మాజీ సీఎం జ‌గ‌న్ సొంత చానెల్ సాక్షి స‌హా.. ఆయ‌న హ‌యాంలో స‌ర్కారుకు అనుకూలంగా ప్ర‌సారాలు చేశారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఎన్టీవీ, టీవీ-9 స‌హా మ‌రికొన్ని చానెళ్లు ఉన్నాయి. దీంతో ఆయా ప్ర‌సారాలు నిలిచిపోయాయి. స‌ర్కారు ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ట్టు ఎక్క‌డా లేదు. కానీ, కేబుల్ టీవీ ఆప‌రేట‌ర్లు మాత్రం వాటిని నిలుపుద‌ల చేశారు.

ఈ నేప‌థ్యంలో ఆయా చానెళ్ల యాజ‌మాన్యాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించాయి. వీటిని విచారించిన కోర్టు తీవ్ర వ్యాఖ్య‌లే చేసింది. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు భంగం క‌లుగుతుంటే ప్ర‌భుత్వం ఏంచేస్తోంద‌ని ప్ర‌శ్నించింది. త‌క్ష‌ణ‌మే ఇలా చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. ఆయా చానెళ్ల ప్ర‌సారాల‌ను కొన‌సాగించాల‌ని.. ప్ర‌జ‌ల‌కు అనేక మాధ్య‌మాల్లో వార్త‌లు.. వినోదం అందుకునే హ‌క్కు ఉంద‌ని తెలిపింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేర‌ని పేర్కొంది. బ్లాక్ చేసిన చానళ్లను వెంటనే పునరుద్ధరించి, ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on June 25, 2024 10:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

1 hour ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

2 hours ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

3 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago