జగన్ వివాదాస్పద నిర్ణయాల్లో తనకు నచ్చని మీడియాపై నిషేధం విధించడమే. అప్పట్లో 2019-24 మధ్య.. కొన్ని చానెళ్లను రాష్ట్రంలో ప్రజలుఎవరూ వీక్షించేందుకు వీలు లేకుండా.. సిటీ కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి.. వాటి ప్రసారాలను నిలుపుదల చేయించారు. దీంతో ఆయా చానెళ్ల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత.. సీఎం చంద్రబాబుకు తెలిసి జరిగిందో.. తెలియక జరిగిందో తెలియదు కానీ.. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామీణ, నగర ప్రాంతాల్లోని సిటీ కేబుల్ ఆపరేటర్లు.. కొన్ని వైసీపీ అనుకూల మీడియాలంటూ.. ముద్రవేసి వాటిని ప్రసారం చేయడం మానేశారు. వీటిలో మాజీ సీఎం జగన్ సొంత చానెల్ సాక్షి సహా.. ఆయన హయాంలో సర్కారుకు అనుకూలంగా ప్రసారాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎన్టీవీ, టీవీ-9 సహా మరికొన్ని చానెళ్లు ఉన్నాయి. దీంతో ఆయా ప్రసారాలు నిలిచిపోయాయి. సర్కారు ఉత్తర్వులు ఇచ్చినట్టు ఎక్కడా లేదు. కానీ, కేబుల్ టీవీ ఆపరేటర్లు మాత్రం వాటిని నిలుపుదల చేశారు.
ఈ నేపథ్యంలో ఆయా చానెళ్ల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. వీటిని విచారించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించింది. తక్షణమే ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆయా చానెళ్ల ప్రసారాలను కొనసాగించాలని.. ప్రజలకు అనేక మాధ్యమాల్లో వార్తలు.. వినోదం అందుకునే హక్కు ఉందని తెలిపింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. బ్లాక్ చేసిన చానళ్లను వెంటనే పునరుద్ధరించి, ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on June 25, 2024 10:07 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పెట్టుబడులకు జోష్ పెరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మూడు మాసాల్లోనే పలు కంపెనీలు పెట్టుబడులు…
వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం…
మాములుగా టాలీవుడ్ దసరాకు స్టార్ హీరోల సినిమాలు రావడం సహజం. సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే సీజన్ కావడంతో…
గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ పబ్లిసిటీ పరంగా దిల్ రాజు టీమ్ మీద భారీ ఆశలు…
నార్త్ ఇండియాలో ఎవ్వరూ ఊహించని ఫలితాన్ని అందుకున్న సౌత్ సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఉత్తరాదిన…
"నా మతమేంటి అని అడుగుతున్నారు.. మానవత్వమే నా మతం" అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో ఎంతో నాటకీయంగా మాట్లాడేశారు మాజీ…