జగన్ వివాదాస్పద నిర్ణయాల్లో తనకు నచ్చని మీడియాపై నిషేధం విధించడమే. అప్పట్లో 2019-24 మధ్య.. కొన్ని చానెళ్లను రాష్ట్రంలో ప్రజలుఎవరూ వీక్షించేందుకు వీలు లేకుండా.. సిటీ కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి.. వాటి ప్రసారాలను నిలుపుదల చేయించారు. దీంతో ఆయా చానెళ్ల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత.. సీఎం చంద్రబాబుకు తెలిసి జరిగిందో.. తెలియక జరిగిందో తెలియదు కానీ.. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామీణ, నగర ప్రాంతాల్లోని సిటీ కేబుల్ ఆపరేటర్లు.. కొన్ని వైసీపీ అనుకూల మీడియాలంటూ.. ముద్రవేసి వాటిని ప్రసారం చేయడం మానేశారు. వీటిలో మాజీ సీఎం జగన్ సొంత చానెల్ సాక్షి సహా.. ఆయన హయాంలో సర్కారుకు అనుకూలంగా ప్రసారాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎన్టీవీ, టీవీ-9 సహా మరికొన్ని చానెళ్లు ఉన్నాయి. దీంతో ఆయా ప్రసారాలు నిలిచిపోయాయి. సర్కారు ఉత్తర్వులు ఇచ్చినట్టు ఎక్కడా లేదు. కానీ, కేబుల్ టీవీ ఆపరేటర్లు మాత్రం వాటిని నిలుపుదల చేశారు.
ఈ నేపథ్యంలో ఆయా చానెళ్ల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. వీటిని విచారించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించింది. తక్షణమే ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆయా చానెళ్ల ప్రసారాలను కొనసాగించాలని.. ప్రజలకు అనేక మాధ్యమాల్లో వార్తలు.. వినోదం అందుకునే హక్కు ఉందని తెలిపింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. బ్లాక్ చేసిన చానళ్లను వెంటనే పునరుద్ధరించి, ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…