జగన్ వివాదాస్పద నిర్ణయాల్లో తనకు నచ్చని మీడియాపై నిషేధం విధించడమే. అప్పట్లో 2019-24 మధ్య.. కొన్ని చానెళ్లను రాష్ట్రంలో ప్రజలుఎవరూ వీక్షించేందుకు వీలు లేకుండా.. సిటీ కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి.. వాటి ప్రసారాలను నిలుపుదల చేయించారు. దీంతో ఆయా చానెళ్ల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత.. సీఎం చంద్రబాబుకు తెలిసి జరిగిందో.. తెలియక జరిగిందో తెలియదు కానీ.. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామీణ, నగర ప్రాంతాల్లోని సిటీ కేబుల్ ఆపరేటర్లు.. కొన్ని వైసీపీ అనుకూల మీడియాలంటూ.. ముద్రవేసి వాటిని ప్రసారం చేయడం మానేశారు. వీటిలో మాజీ సీఎం జగన్ సొంత చానెల్ సాక్షి సహా.. ఆయన హయాంలో సర్కారుకు అనుకూలంగా ప్రసారాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎన్టీవీ, టీవీ-9 సహా మరికొన్ని చానెళ్లు ఉన్నాయి. దీంతో ఆయా ప్రసారాలు నిలిచిపోయాయి. సర్కారు ఉత్తర్వులు ఇచ్చినట్టు ఎక్కడా లేదు. కానీ, కేబుల్ టీవీ ఆపరేటర్లు మాత్రం వాటిని నిలుపుదల చేశారు.
ఈ నేపథ్యంలో ఆయా చానెళ్ల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. వీటిని విచారించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించింది. తక్షణమే ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆయా చానెళ్ల ప్రసారాలను కొనసాగించాలని.. ప్రజలకు అనేక మాధ్యమాల్లో వార్తలు.. వినోదం అందుకునే హక్కు ఉందని తెలిపింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. బ్లాక్ చేసిన చానళ్లను వెంటనే పునరుద్ధరించి, ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on June 25, 2024 10:07 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…