Political News

వైసీపీ తొలి అడుగు.. మోడీ వైపా, రాహుల్ వైపా!?

ఏపీలో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ.. ప్రాధాన్యం కోల్పోయింది. అయితే.. ఇది రాష్ట్ర స్థాయిలో! కానీ, జాతీయ స్థాయిలో చూసుకున్న‌ప్పుడు మాత్రం వైసీపీకి కొంత మేర‌కు ప్రాధాన్యం ఉంది. న‌లుగురు ఎంపీలు ద‌క్కారు. నిజానికి ఇద్ద‌రు ఎంపీల‌ను ద‌క్కించుకున్న పార్టీలు కూడా.. ప్రాధాన్యం నిల‌బెట్టుకుంటున్నాయి. కేంద్రంలోని జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు వీరిని త‌మ‌కు సాధ్య‌మైనంత ఎక్కువ‌గా ఆక‌ర్షించే ప‌నిలో ఉన్నాయి. తాజాగా లోక్‌స‌భ స్పీక‌ర్ వివాదం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సంప్ర‌దాయాల‌కు భిన్న‌మైన రీతిలో తొలిసారి పార్ల‌మెంటులో ఎన్నిక జ‌రుగుతోంది.

ఒక‌వైపు.. బీజేపీ నాయ‌కుడు(ఎన్డీయే కూట‌మి), మాజీ స్పీక‌ర్ ఓం బిర్లా, మ‌రో వైపు.. కాంగ్రెస్ నేత‌, కేర‌ళ‌కు చెందిన కె. సురేష్ లు స్పీక‌ర్ ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం నిర్వ‌హించే ఎన్నిక ప్ర‌క్రియ ఆద్యంతం ఇంపార్లెంట్‌గా మారింది. ఇక్క‌డ ఎన్డీయే కూట‌మి ఓడిపోక‌పోవ‌చ్చు. కానీ, ఎన్నిక జ‌ర‌గ‌డం ద్వారా. ఆ పార్టీని ఇరుకున పెట్టాల‌నేది కాంగ్రెస్ కూట‌మి ల‌క్ష్యం. అయితే..ఈ క్ర‌మంలో ఒక్క ఎంపీ స్థానం ఉన్న పార్టీకి కూడా ప్రాధానం ద‌క్కుతోంది. ‘మీ ఓటు ఎటు?’ అంటూ రెండు కూట‌ములు ఫోన్లుచేస్తున్నాయి. అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూట‌ముల్లో లేని పార్టీల‌కు.. ఉదాహ‌ర‌ణ‌కు వైసీపీ వంటివి ఎటు ఉంటాయ‌నేది ఆస‌క్తిగా మారింది.

ఇలా చూసుకుంటే.. పార్ల‌మెంటులో వైసీపీ తొలి అడుగు ఎటు వేస్తుంది? అనేది ఉత్కంఠ‌కు దారితీసింది. నిజానికి ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. న‌లుగురు ఎంపీలు మాత్ర‌మే గెలిచిన త‌ర్వాత జ‌గ‌న్ ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చారు. బీజేపీ వెళ్లి చంద్ర‌బాబుతో చేతులు క‌లిపి త‌మ‌ను ఓడించింద‌ని ఆయ‌న చెబుతూనే.. పార్ల‌మెంటుకు వ‌చ్చే స‌రికి మాత్రం.. త‌మ ప్రాధాన్యం మోడీకేన‌ని అన్నారు. దీంతో ఇప్పుడు పార్ల‌మెంటు స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలో వైసీపీ మోడీకి అనుకూలంగానే ఓటు వేస్తుంద‌ని భావించ‌వ‌చ్చు. కానీ, ఇక్క‌డే బిగ్ ట్విస్ట్ తెర‌మీదికి వ‌చ్చింది.

వైఎస్ కుటుంబానికి స‌న్నిహితంగా ఉన్న క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తాజాగా జ‌గ‌న్‌తో భేటీ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. “మీ న‌లుగురు మావైపు ఉండేలా చూడండి” అని డీకే అభ్య‌ర్థించిన‌ట్టు తెలిసింది. దీంతో జ‌గ‌న్ ఎటు ఉంటారంటూ.. జాతీయ మీడియా కూడా వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. కానీ, జ‌గ‌న్‌పై ఉన్న కేసులు.. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో త‌న‌కు ర‌క్ష‌ణ వంటివి చూసుకుంటే మోడీ వైపే జ‌గ‌న్ ఎంపీలు అడుగులు వేయ‌డం ఖాయ‌మ‌ని.. ఎన్డీయే కూట‌మి బ‌ల‌ప‌రిచిన స్పీక‌ర్ ఓం బిర్లాకే ఓటేయొచ్చ‌ని జాతీయ మీడియా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 25, 2024 9:39 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

18 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

35 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago