కలలు కనడం ఈజీనే. కానీ, వాటిని సాకారం చేసుకునేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అది కూడా.. వ్యక్తిగత కలలైతే బాగానే ఉంటుంది. కానీ, ప్రభుత్వ పరంగా ఒక వ్యవస్థను మార్చాలని కలలు కంటే మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఈ సమస్యే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకు వచ్చింది. ఆయన తొలి సమీక్షలోనే కీలక ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు. గ్రామీణ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఎందుకు విస్తరించకూడదన్నది ఆయన ప్రశ్న.
ఇది పైకి చాలా బాగానే ఉంది. చేస్తే.. చాలా మంచిదే. కానీ, ఇది అమలు కావడం.. అమలు చేయడం అనేది అంత ఈజీకాదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజుకు రూ.220 అందుతోంది. ఏడాదికి 100 రోజులు పనులు కల్పిస్తున్నారు. దీనిని రైతులకు.. ముఖ్యంగా వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని.. రైతులపై భారం తగ్గించాలని పవన్ ఆలోచన. ఇది మంచిదే. తద్వారా.. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని ఆయన తగ్గించాలని చూస్తున్నారు.
అయితే.. పవన్ చేసిన ఆలోచన కొత్తకాదు. గతంలో జగన్ కూడా ప్రయత్నించారు. ఇంతకు ముందు .. చంద్రబాబు కూడా.. ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. దీనికి కారణం.. కరువు పనులుగా గ్రామీణ ప్రాంతాల్లో పేర్కొనే ఉపాధి హామీ పనులు తక్కువుగా ఉంటాయి. అంటే..రెండు గంటలు గట్టిగా పనిచేస్తే చాలు మస్టర్ వేయించుకుంటే చాలు.. సొమ్ములు చేతిలో పడతాయి. పైగా రక్షణ కూడా ఉంటుంది. కానీ.. వ్యవసాయ పనులకు వచ్చే సరికి మాత్రం ఈ సొమ్ములు చాలవు.
ప్రస్తుతం రైతు కూలీలకు రూ.500 నుంచి 600ల వరకు గిట్టుబాటు అవుతోంది. సీజన్లో మాత్రమే ఉండే ఈ పనులకు నైపుణ్యం కూడా అవసరం. అందరూ చేయలేరు. దీంతో ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలను అటు మళ్లించడం అనేది ప్రయాసతో కూడుకున్న ప్రక్రియగా చంద్రబాబు హయాంలోనూ.. తర్వాత..జగన్ హయాంలోనూ నిరూపితమైంది. పైగా.. దీనికి కేంద్రం ఇచ్చే నిధులు చాలవు. ఎటొచ్చీ.. రైతులు ఖర్చు చేయాల్సిందే.అంతేకాదు.. ఒకసారి.. వ్యవసాయ పనులను ఉపాధి పనులతో జోడిస్తే.. రైతుల మాట కూలీలు వినే పరిస్థితి ఉండదని అనేక సందర్భాల్లో తేలిపోయింది. సో.. పవన్ కలలు కంటున్నా.. ఇది సాధ్యం కావడం అంత ఈజీ కాదనే అంటున్నారు పరిశీలకులు. చేస్తే మంచిదేనని చెబుతున్నారు.
This post was last modified on June 24, 2024 10:30 am
ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పెట్టుబడులకు జోష్ పెరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మూడు మాసాల్లోనే పలు కంపెనీలు పెట్టుబడులు…
వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం…
మాములుగా టాలీవుడ్ దసరాకు స్టార్ హీరోల సినిమాలు రావడం సహజం. సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే సీజన్ కావడంతో…
గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ పబ్లిసిటీ పరంగా దిల్ రాజు టీమ్ మీద భారీ ఆశలు…
నార్త్ ఇండియాలో ఎవ్వరూ ఊహించని ఫలితాన్ని అందుకున్న సౌత్ సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఉత్తరాదిన…
"నా మతమేంటి అని అడుగుతున్నారు.. మానవత్వమే నా మతం" అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో ఎంతో నాటకీయంగా మాట్లాడేశారు మాజీ…