Political News

ఏపీ స్పీడు మామూలుగా లేదు

ప‌నిచేయాలన్న సంక‌ల్పం.. రాష్ట్రానికి ఏదో మేలు చేయాల‌న్న త‌ప‌న‌.. ఉంటే.. క‌ష్ట సాధ్యం అయినదేదీ ఉండ‌దు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. అధికారంలోకి వ‌చ్చి ప‌ట్టుమ‌ని 10 రోజులు కూడా కాకుముందే.. కీల‌క ప్రాజెక్టు లైన అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప్రాజెక్టుల‌ను ఆయ‌న దాదాపు ప‌ట్టాలెక్కించేశారు. ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం.. పోల‌వ‌రం, అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఒక‌ర‌కంగా నిర్వేదం వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం నాశ‌నం అయింద‌ని.. అమ‌రావ‌తిని ముంచేశార‌ని వీటిని లైన్లో పెట్టాలంటే.. చాలా క‌ష్ట‌ప‌డాల‌ని కూడా చెప్పారు. దీంతో అంద‌రూ ఇప్ప‌ట్లో ఇవి ప్రారంభం కావేమో అనుకున్నారు.

కానీ, చంద్ర‌బాబు త‌ప‌న ఎంత క్లిష్ట స‌మ‌స్య‌ల‌కైనా మార్గం చూపించే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది. అమ‌రావ‌తిని తీసుకుంటే.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న అనంత‌రం.. ఇక్క‌డ దృశ్యాలు మారిపోయాయి. రాత్రికి రాత్రి రెండు రోజుల ఇక్క‌డ సీఆర్డీఏ అధికారుల ఆధ్వ‌ర్యంలో వంద‌ల మంది కూలీల‌ను ఏర్పాటు చేసి.. తుమ్మ‌లు, తుప్ప‌లు తొల‌గించేశారు. గోతులు ప‌డి, పాడుప‌డిన ర‌హ‌దారుల‌ను కూడా బాగు చేయిస్తున్నారు. అదేస‌మ‌యంలో బూజు ప‌ట్టిన క‌ట్ట‌డాల దుమ్ముదులుపుతున్నారు. నీట మునిగిన భ‌వ‌నాల వ‌ద్ద‌.. నిల్వ ఉన్న నీటిని తోడిస్తున్నారు. ఈ ప‌నులు రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి.

ఇంత‌లోనే పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తూ.. ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న జారీ చేసింది. పెట్టుబ‌డులు పెట్టేవారు రావాలంటూ అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌గిన మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అదేస‌మ‌యంలో పోలీసుల‌ను కూడా ప్ర‌త్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయించి.. భ‌ద్ర‌త క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా జాతీయ ప‌త్రిక‌ల‌తోపాటు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో నూ అమ‌రావ‌తికి పెట్టుబడులు వ‌చ్చేలా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాల‌ని కూడా సీఎం చంద్ర‌బాబు ఆదేశించ‌రు.

పోల‌వ‌రం..

ఇక‌, ఏపీకి కీల‌క‌మైన ప్రాజెక్టు పోల‌వ‌రం. దీనిలో అనేక లోపాలు వెలుగు చూసిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు విస్మ‌యం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. రాక్ డ్యాం, స్పిల్ వే, గైడ్ బండ్ వంటివి దెబ్బ‌తిన్నాయ‌ని అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అంత‌ర్జాతీయ నిపుణుల బృందాన్ని తీసుకువ‌చ్చేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి శ‌నివార‌మే ఆయ‌నే కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ‌కు స‌మాచారం ఇవ్వ‌డం.. ఆవెంట‌నే అమెరికా, కెన‌డా నుంచి అంత‌ర్జాతీయ జ‌ల‌వ‌నరుల విష‌యంలో నిపుణులైన ఐదుగురు ఇంజ‌నీర్ల‌ను ర‌ప్పించేందుకు ఒప్పందం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. వీరు ఏడాది పాటు పోల‌వరానికి సంబందించి త‌గిన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌నున్నారు. అదేస‌మ‌యంలో వ్య‌యం త‌గ్గించేలా కూడా వీరు సూచ‌న‌లు చేయ‌నున్నారు. ఎలా చూసుకున్నా.. కీల‌క ప్రాజెక్టుల ‌విష‌యంలో చంద్ర‌బాబు అడుగులు వ‌డివడిగా ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 24, 2024 1:33 pm

Share

Recent Posts

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

5 minutes ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

8 minutes ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

2 hours ago

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

3 hours ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

3 hours ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

3 hours ago