Political News

ఏపీ స్పీడు మామూలుగా లేదు

ప‌నిచేయాలన్న సంక‌ల్పం.. రాష్ట్రానికి ఏదో మేలు చేయాల‌న్న త‌ప‌న‌.. ఉంటే.. క‌ష్ట సాధ్యం అయినదేదీ ఉండ‌దు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. అధికారంలోకి వ‌చ్చి ప‌ట్టుమ‌ని 10 రోజులు కూడా కాకుముందే.. కీల‌క ప్రాజెక్టు లైన అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప్రాజెక్టుల‌ను ఆయ‌న దాదాపు ప‌ట్టాలెక్కించేశారు. ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం.. పోల‌వ‌రం, అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఒక‌ర‌కంగా నిర్వేదం వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం నాశ‌నం అయింద‌ని.. అమ‌రావ‌తిని ముంచేశార‌ని వీటిని లైన్లో పెట్టాలంటే.. చాలా క‌ష్ట‌ప‌డాల‌ని కూడా చెప్పారు. దీంతో అంద‌రూ ఇప్ప‌ట్లో ఇవి ప్రారంభం కావేమో అనుకున్నారు.

కానీ, చంద్ర‌బాబు త‌ప‌న ఎంత క్లిష్ట స‌మ‌స్య‌ల‌కైనా మార్గం చూపించే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది. అమ‌రావ‌తిని తీసుకుంటే.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న అనంత‌రం.. ఇక్క‌డ దృశ్యాలు మారిపోయాయి. రాత్రికి రాత్రి రెండు రోజుల ఇక్క‌డ సీఆర్డీఏ అధికారుల ఆధ్వ‌ర్యంలో వంద‌ల మంది కూలీల‌ను ఏర్పాటు చేసి.. తుమ్మ‌లు, తుప్ప‌లు తొల‌గించేశారు. గోతులు ప‌డి, పాడుప‌డిన ర‌హ‌దారుల‌ను కూడా బాగు చేయిస్తున్నారు. అదేస‌మ‌యంలో బూజు ప‌ట్టిన క‌ట్ట‌డాల దుమ్ముదులుపుతున్నారు. నీట మునిగిన భ‌వ‌నాల వ‌ద్ద‌.. నిల్వ ఉన్న నీటిని తోడిస్తున్నారు. ఈ ప‌నులు రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి.

ఇంత‌లోనే పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తూ.. ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న జారీ చేసింది. పెట్టుబ‌డులు పెట్టేవారు రావాలంటూ అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌గిన మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అదేస‌మ‌యంలో పోలీసుల‌ను కూడా ప్ర‌త్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయించి.. భ‌ద్ర‌త క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా జాతీయ ప‌త్రిక‌ల‌తోపాటు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో నూ అమ‌రావ‌తికి పెట్టుబడులు వ‌చ్చేలా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాల‌ని కూడా సీఎం చంద్ర‌బాబు ఆదేశించ‌రు.

పోల‌వ‌రం..

ఇక‌, ఏపీకి కీల‌క‌మైన ప్రాజెక్టు పోల‌వ‌రం. దీనిలో అనేక లోపాలు వెలుగు చూసిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు విస్మ‌యం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. రాక్ డ్యాం, స్పిల్ వే, గైడ్ బండ్ వంటివి దెబ్బ‌తిన్నాయ‌ని అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అంత‌ర్జాతీయ నిపుణుల బృందాన్ని తీసుకువ‌చ్చేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి శ‌నివార‌మే ఆయ‌నే కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ‌కు స‌మాచారం ఇవ్వ‌డం.. ఆవెంట‌నే అమెరికా, కెన‌డా నుంచి అంత‌ర్జాతీయ జ‌ల‌వ‌నరుల విష‌యంలో నిపుణులైన ఐదుగురు ఇంజ‌నీర్ల‌ను ర‌ప్పించేందుకు ఒప్పందం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. వీరు ఏడాది పాటు పోల‌వరానికి సంబందించి త‌గిన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌నున్నారు. అదేస‌మ‌యంలో వ్య‌యం త‌గ్గించేలా కూడా వీరు సూచ‌న‌లు చేయ‌నున్నారు. ఎలా చూసుకున్నా.. కీల‌క ప్రాజెక్టుల ‌విష‌యంలో చంద్ర‌బాబు అడుగులు వ‌డివడిగా ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 24, 2024 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

10 minutes ago

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…

1 hour ago

పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…

1 hour ago

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

6 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

10 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

11 hours ago