Political News

ఏపీ స్పీడు మామూలుగా లేదు

ప‌నిచేయాలన్న సంక‌ల్పం.. రాష్ట్రానికి ఏదో మేలు చేయాల‌న్న త‌ప‌న‌.. ఉంటే.. క‌ష్ట సాధ్యం అయినదేదీ ఉండ‌దు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. అధికారంలోకి వ‌చ్చి ప‌ట్టుమ‌ని 10 రోజులు కూడా కాకుముందే.. కీల‌క ప్రాజెక్టు లైన అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప్రాజెక్టుల‌ను ఆయ‌న దాదాపు ప‌ట్టాలెక్కించేశారు. ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం.. పోల‌వ‌రం, అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఒక‌ర‌కంగా నిర్వేదం వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం నాశ‌నం అయింద‌ని.. అమ‌రావ‌తిని ముంచేశార‌ని వీటిని లైన్లో పెట్టాలంటే.. చాలా క‌ష్ట‌ప‌డాల‌ని కూడా చెప్పారు. దీంతో అంద‌రూ ఇప్ప‌ట్లో ఇవి ప్రారంభం కావేమో అనుకున్నారు.

కానీ, చంద్ర‌బాబు త‌ప‌న ఎంత క్లిష్ట స‌మ‌స్య‌ల‌కైనా మార్గం చూపించే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది. అమ‌రావ‌తిని తీసుకుంటే.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న అనంత‌రం.. ఇక్క‌డ దృశ్యాలు మారిపోయాయి. రాత్రికి రాత్రి రెండు రోజుల ఇక్క‌డ సీఆర్డీఏ అధికారుల ఆధ్వ‌ర్యంలో వంద‌ల మంది కూలీల‌ను ఏర్పాటు చేసి.. తుమ్మ‌లు, తుప్ప‌లు తొల‌గించేశారు. గోతులు ప‌డి, పాడుప‌డిన ర‌హ‌దారుల‌ను కూడా బాగు చేయిస్తున్నారు. అదేస‌మ‌యంలో బూజు ప‌ట్టిన క‌ట్ట‌డాల దుమ్ముదులుపుతున్నారు. నీట మునిగిన భ‌వ‌నాల వ‌ద్ద‌.. నిల్వ ఉన్న నీటిని తోడిస్తున్నారు. ఈ ప‌నులు రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి.

ఇంత‌లోనే పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తూ.. ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న జారీ చేసింది. పెట్టుబ‌డులు పెట్టేవారు రావాలంటూ అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌గిన మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అదేస‌మ‌యంలో పోలీసుల‌ను కూడా ప్ర‌త్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయించి.. భ‌ద్ర‌త క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా జాతీయ ప‌త్రిక‌ల‌తోపాటు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో నూ అమ‌రావ‌తికి పెట్టుబడులు వ‌చ్చేలా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాల‌ని కూడా సీఎం చంద్ర‌బాబు ఆదేశించ‌రు.

పోల‌వ‌రం..

ఇక‌, ఏపీకి కీల‌క‌మైన ప్రాజెక్టు పోల‌వ‌రం. దీనిలో అనేక లోపాలు వెలుగు చూసిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు విస్మ‌యం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. రాక్ డ్యాం, స్పిల్ వే, గైడ్ బండ్ వంటివి దెబ్బ‌తిన్నాయ‌ని అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అంత‌ర్జాతీయ నిపుణుల బృందాన్ని తీసుకువ‌చ్చేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి శ‌నివార‌మే ఆయ‌నే కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ‌కు స‌మాచారం ఇవ్వ‌డం.. ఆవెంట‌నే అమెరికా, కెన‌డా నుంచి అంత‌ర్జాతీయ జ‌ల‌వ‌నరుల విష‌యంలో నిపుణులైన ఐదుగురు ఇంజ‌నీర్ల‌ను ర‌ప్పించేందుకు ఒప్పందం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. వీరు ఏడాది పాటు పోల‌వరానికి సంబందించి త‌గిన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌నున్నారు. అదేస‌మ‌యంలో వ్య‌యం త‌గ్గించేలా కూడా వీరు సూచ‌న‌లు చేయ‌నున్నారు. ఎలా చూసుకున్నా.. కీల‌క ప్రాజెక్టుల ‌విష‌యంలో చంద్ర‌బాబు అడుగులు వ‌డివడిగా ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

1 hour ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

3 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

4 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

4 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

5 hours ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

5 hours ago