Political News

కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం !

లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైన నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం రేగుతున్నది. కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితం అయింది. జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసుల అంశాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని ప్రజాపనుల మంత్రి సతీశ్‌ జార్కిహోళి, సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ బహిరంగంగా డిమాండ్‌ మొదలుపెట్టారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్యపై వారు ఒత్తిడి తెస్తున్నారు. సతీశ్‌ జార్కిహోళి, కేఎన్‌ రాజన్న ఎస్టీ వర్గానికి చెందినవారు కాగా, జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ముస్లిం. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో మళ్లీ అంతర్గత పోరు మొదలైంది.

సీఎం సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూర్‌లో పార్టీ ఓటమిపాలైంది. అలాగే బెంగళూరు రూరల్‌ స్థానంలో తన సోదరుడు డీకే సురేశ్‌ను శివకుమార్‌ గెలిపించుకోలేకపోయారు. మైసూరులో బీజేపీ అభ్యర్థి క్రిష్ణదత్త చామరాజ వడియార్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ణపై 1,39,262 ఓట్లతో గెలవడం విశేషం. బెంగుళూరు రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మంజునాథ్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ ను 2,69,647 ఓట్లతో ఓడించడం గమనార్హం.

అదనపు ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలని లోక్ సభ ఎన్నికల ముందు సీనియర్ మంత్రులు జీ పరమేశ్వర, సతీశ్‌ జార్కిహోళి, హెచ్‌సీ మహదేవప్ప, రాజన్న, కేహెచ్‌ మునియప్ప తదితరులు ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఈ డిమాండ్ మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఎక్కడికి దారితీస్తుందోనని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

This post was last modified on June 24, 2024 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago