Political News

ఏపీ ప్రెస్ అకాడ‌మీ.. ఇక‌పై ‘రామోజీ’ ప్రెస్ అకాడ‌మీ? !

మీడియా మొఘ‌ల్‌, ఈనాడు సంస్థ‌ల అధినేత‌, రామోజీ ఫిలిం సిటీ రూప‌క‌ర్త రామోజీరావుకు ఘ‌న నివాళులు అర్పించేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌న్న‌ద్ద‌మైంది. ఈ నెల 27న ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న‌కు ఘ‌నంగా సంస్మ‌ర‌ణ స‌భ‌ను ఏర్పాటు చేసింది. రామోజీరావు పుట్టిపెరిగిన‌.. కృష్ణాజిల్లాలోనే ఈ కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రూ. 5 కోట్ల ను విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రులు కొలుసు పార్థ‌సార‌థి, కొల్లు ర‌వీంద్ర స‌హా.. మ‌రికొంద‌రు స‌మ‌న్వయం చేసుకుంటున్నారు.

ఇక‌, రామోజీ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ స‌హా .. పాత్రికేయులు.. ఇత‌ర రంగాల ప్ర‌ముఖులు.. ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌రువుతున్నారు. ఈ నేప‌థ్యంలో భద్రతా ఏర్పాట్లు కూడా క‌ట్టుదిట్టం చేశారు. వీవీఐపీలకు, సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి గ్యాలరీకి ఇంఛార్జీలను నియమించారు. ప్రధాన వెన్యూ ప్రదేశంలో డయాస్, బారికేడింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వెన్యూ రహదారులు మరమ్మతులు చేస్తున్నారు. మొత్తంగా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి అదే రేంజ్‌లో ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. అయితే.. ఇప్ప‌టికే రామోజీ రావు జ్ఞాప‌కాలు తెలుగు వారితోనూ.. తెలుగు నేల‌తోనూ చిర‌స్థాయిగా గుర్తుండిపోయేలా.. ఏర్పాట్లు చేస్తామ‌ని.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

ఏపీ ప్రెస్ అకాడ‌మీ పేరును ఆయ‌న ‘రామోజీ ప్రెస్ అకాడ‌మీ’గా మార్చే ఆలోచ‌న చేస్తున్నట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాజ‌ధాని అమ‌రావ‌తి పేరును ఆయ‌నే సూచించిన నేప‌థ్యంలో అమ‌రావ‌తి ప్రాంతంలోనూ రామోజీ విగ్ర‌హానికి స్థ‌లాన్ని కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. దీనిపై చంద్ర‌బాబు కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తిలో రామోజీ స్మార‌కం నిర్మిస్తామ‌న్నారు. ఈ రెండు కార్య‌క్ర‌మాల‌కు కూడా.. ఈ నెల 27న నిర్వ‌హించే సంస్మ‌ర‌ణ స‌భ‌లో నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

This post was last modified on June 24, 2024 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

54 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago