Political News

టీడీపీలో ద‌క్క‌ని ప్రియార్టీ.. ఆ యువ నేత‌కు వైసీపీలో ద‌క్కుతోందే!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణాలు ఎదుర‌వుతాయో.. నాయ‌కులు సైతం చెప్ప‌లేని ప‌రిస్థితి నేటి రాజ‌కీయాల్లో నెల‌కొంది. ఒక పార్టీలో నేత డ‌మ్మీ కావొచ్చు.. మ‌రో పార్టీలో అదే నాయ‌కుడు తురుపు ముక్క కావొచ్చు. వారి వారి వ్యూహాలు.. వ్యక్తిగ‌త అజెండాలు ఒక పార్టీలో ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోవ‌చ్చు.. అలాగ‌ని అస‌లు ఆ నేత‌ల‌నుప‌క్క‌న పెట్ట‌డానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అదే నేత‌ల‌ను మ‌రో పార్టీ చ‌క్క‌గా వినియోగించుకోవ‌చ్చు. ఈ ఫార్ములా.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో క‌నిపిస్తోంది. తాజాగా.. టీడీపీలో భారం అనుకున్న యువ‌ నాయ‌కుడు వైసీపీలో కీల‌కంగా మారారు.

టీడీపీలో పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌ని నాయ‌కుడికి.. వైసీపీలో అమిత‌మైన ప్రాధాన్యం ద‌క్కుతోంది. ఈ ప‌రిణామం పొలిటిక‌ల్‌గా కీల‌క‌మైన‌ విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న దేవినేని రాజ‌శేఖ‌ర్ ఉర‌ఫ్ నెహ్రూ వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన దేవినేని అవినాష్‌కు ఏకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయ‌న ఎప్పుడు అడిగితే అప్పుడు కాద‌న‌కుండా.. ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. అప్పాయింట్‌మెంట్ ఇస్తున్నారు. ఆయ‌న‌తో ముచ్చ‌టిస్తున్నారు. విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై వాక‌బు చేస్తున్నారు. దీంతో అవినాష్‌కు మంచి ఫ్యూచ‌ర్ స‌మీప భవిష్య‌త్తులోనే ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రి ఇదే నేత‌.. కాంగ్రెస్‌లోను, టీడీపీలోనూ కొన‌సాగారు. 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే, అప్ప‌ట్లో ఆయ‌న‌కు డిపాజిట్ కూడా రాలేదు. పైగా స్థానిక నాయ‌కులు కూడా క‌లిసిరాలేదు. ఇక‌, త‌ర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగు యువత అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు సైతం చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. 2019లో గుడివాడ నుంచి పోటీ చేసి మ‌రోసారి ఓడిపోవ‌డంతో ఆయ‌నకు ఐర‌న్ లెగ్ అనే ముద్ర వేశారు టీడీపీ నాయ‌కులు. దీంతో ఆశించిన గుర్తింపు రాలేదు స‌రిక‌దా.. ఆయ‌న‌కు ఎస‌రు పెట్టే నాయ‌కులు త‌యార‌య్యార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

అదే స‌మయంలో త‌న‌కు స్వేచ్ఛ కూడా లేద‌ని అవినాష్ ప‌లుమార్లు ఆఫ్ దిరికార్డుగా వాపోయేవారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మాజీ మంత్రి లోకేష్ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేయాల‌ని ఆదేశాలు వ‌చ్చాయ‌ట‌. దీంతో అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయ‌న కోరుకున్న తూర్పు నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతోపాటు.. మంత్రులకు కూడా ద‌క్క‌ద‌ని భావిస్తున్నసీఎం అప్పాయింట్మెంట్ ల‌భిస్తుండడంతో తిరుగులేని నేత‌గా ఆయ‌న మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ కూడా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో టీడీపీ క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు అవినాష్ క‌రెక్ట్ అనే భావ‌న‌తో ఉన్నార‌నే ప్ర‌చారం కూడా సాగుతుండ‌డంగ‌మ‌నార్హం.

This post was last modified on September 22, 2020 1:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

2 hours ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

4 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

5 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

6 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

8 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

8 hours ago