Political News

టీడీపీలో ద‌క్క‌ని ప్రియార్టీ.. ఆ యువ నేత‌కు వైసీపీలో ద‌క్కుతోందే!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణాలు ఎదుర‌వుతాయో.. నాయ‌కులు సైతం చెప్ప‌లేని ప‌రిస్థితి నేటి రాజ‌కీయాల్లో నెల‌కొంది. ఒక పార్టీలో నేత డ‌మ్మీ కావొచ్చు.. మ‌రో పార్టీలో అదే నాయ‌కుడు తురుపు ముక్క కావొచ్చు. వారి వారి వ్యూహాలు.. వ్యక్తిగ‌త అజెండాలు ఒక పార్టీలో ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోవ‌చ్చు.. అలాగ‌ని అస‌లు ఆ నేత‌ల‌నుప‌క్క‌న పెట్ట‌డానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అదే నేత‌ల‌ను మ‌రో పార్టీ చ‌క్క‌గా వినియోగించుకోవ‌చ్చు. ఈ ఫార్ములా.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో క‌నిపిస్తోంది. తాజాగా.. టీడీపీలో భారం అనుకున్న యువ‌ నాయ‌కుడు వైసీపీలో కీల‌కంగా మారారు.

టీడీపీలో పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌ని నాయ‌కుడికి.. వైసీపీలో అమిత‌మైన ప్రాధాన్యం ద‌క్కుతోంది. ఈ ప‌రిణామం పొలిటిక‌ల్‌గా కీల‌క‌మైన‌ విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న దేవినేని రాజ‌శేఖ‌ర్ ఉర‌ఫ్ నెహ్రూ వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన దేవినేని అవినాష్‌కు ఏకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయ‌న ఎప్పుడు అడిగితే అప్పుడు కాద‌న‌కుండా.. ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. అప్పాయింట్‌మెంట్ ఇస్తున్నారు. ఆయ‌న‌తో ముచ్చ‌టిస్తున్నారు. విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై వాక‌బు చేస్తున్నారు. దీంతో అవినాష్‌కు మంచి ఫ్యూచ‌ర్ స‌మీప భవిష్య‌త్తులోనే ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రి ఇదే నేత‌.. కాంగ్రెస్‌లోను, టీడీపీలోనూ కొన‌సాగారు. 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే, అప్ప‌ట్లో ఆయ‌న‌కు డిపాజిట్ కూడా రాలేదు. పైగా స్థానిక నాయ‌కులు కూడా క‌లిసిరాలేదు. ఇక‌, త‌ర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగు యువత అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు సైతం చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. 2019లో గుడివాడ నుంచి పోటీ చేసి మ‌రోసారి ఓడిపోవ‌డంతో ఆయ‌నకు ఐర‌న్ లెగ్ అనే ముద్ర వేశారు టీడీపీ నాయ‌కులు. దీంతో ఆశించిన గుర్తింపు రాలేదు స‌రిక‌దా.. ఆయ‌న‌కు ఎస‌రు పెట్టే నాయ‌కులు త‌యార‌య్యార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

అదే స‌మయంలో త‌న‌కు స్వేచ్ఛ కూడా లేద‌ని అవినాష్ ప‌లుమార్లు ఆఫ్ దిరికార్డుగా వాపోయేవారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మాజీ మంత్రి లోకేష్ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేయాల‌ని ఆదేశాలు వ‌చ్చాయ‌ట‌. దీంతో అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయ‌న కోరుకున్న తూర్పు నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతోపాటు.. మంత్రులకు కూడా ద‌క్క‌ద‌ని భావిస్తున్నసీఎం అప్పాయింట్మెంట్ ల‌భిస్తుండడంతో తిరుగులేని నేత‌గా ఆయ‌న మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ కూడా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో టీడీపీ క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు అవినాష్ క‌రెక్ట్ అనే భావ‌న‌తో ఉన్నార‌నే ప్ర‌చారం కూడా సాగుతుండ‌డంగ‌మ‌నార్హం.

This post was last modified on September 22, 2020 1:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పార్టీ పేరుతో ఊహించని షాక్ ఇస్తున్న కవిత?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…

34 minutes ago

15 కోట్లు తీసుకునే హీరోకు 50 కోట్లు ఇస్తే?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…

36 minutes ago

అట్లీ రిస్క్ తీసుకోలేకపోతున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…

1 hour ago

నైట్ పార్టీపై ‘ఈగిల్’ రైడ్… హ్యాపీగా హేమ

హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…

2 hours ago

బిగ్ డే – కంటెంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం

టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…

5 hours ago

మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…

6 hours ago