Political News

బీసీకి సలాం- నువ్వుండు తమ్ముడు… తొందరపడకు !!

అధికారంలో ఉన్నప్పుడు జ‌రిగిన త‌ప్పుల‌ను స‌రిచేసుకునే ప‌నిలో ప‌డ్డారట టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో బీసీలు, ద‌ళితుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని, ముఖ్యంగా యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. నువ్వుండు త‌మ్ముడూ.. ముందు ముందు అంతా మీకే ప్రాధాన్యం. ఇప్పుడు తొంద‌ర‌ప‌డితే క‌ష్ట‌మే అంటూ.. కొంద‌రు పార్టీ మారేందుకు సిద్ధ‌ప‌డిన బీసీ నాయ‌కులకు ప్ర‌స్తుతం ఉన్న సీనియ‌ర్లు ఫోన్లు చేసి మ‌రీ చెబుతున్నార‌ని తెలిసింది. మొత్తానికి ఈ ప‌రిణామం.. పార్టీకి మేలు చేస్తుంద‌నే అనుకుంటున్నారు.

విష‌యంలోకివెళ్తే.. టీడీపీ పునాదులు మొత్తం బీసీ సామాజిక వ‌ర్గాల‌పైనే ఉన్నాయ‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతారు. రాష్ట్రంలో ఈ వ‌ర్గాల ఓటు బ్యాంకు భారీగా ఉండ‌డం.. పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ కూడా వీరికి ప్రాధాన్యం ఇచ్చిన నేప‌థ్యంలో ఆది నుంచి కూడా వీరికి పార్టీలో ప్ర‌ధాన స్థానం ఉంది. అదేస‌మ‌యంలో 1990ల‌లో ద‌ళితులు చంద్ర‌బాబు పాల‌న‌లో మంచి గుర్తింపు పొందారు. ప్ర‌తిభా భార‌తి వంటివారికి.. స్పీక‌ర్ ప‌ద‌వులు కూడా బాబు ఇచ్చారు. అయితే, పార్టీ ఉమ్మ‌డి రాష్ట్రంలో దాదాపు ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉంది. ఈ క్ర‌మంలో పార్టీ నిల‌బ‌డేందుకు.. తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు.. నిధులను బాబు సామాజిక వ‌ర్గం స‌ర్దుబాటు చేసింది.

దీంతో గ‌త ఐదేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, బీసీల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని కాదు. కానీ.. బాబు సామాజిక వ‌ర్గం దూకుడు ముందు వారు నిల‌బ‌డ‌లేక పోయారు. బాబు కూడా త‌న వ‌ర్గం నేత‌ల‌కే అప్పాయింట్‌మెంట్లు ఇవ్వ‌డం, వారి నిర్ణ‌యాల‌నే ప్రామాణికంగా తీసుకోవ‌డం వంటివి జ‌ర‌గ‌డంతో బీసీలు దూర‌మ‌య్యారు. ఇక‌, ద‌ళితులకు కూడా ప్రాధాన్యం త‌గ్గింది. ఈ ప‌రిణామ‌మే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పార్టీపై తీవ్ర‌ప్ర‌భావం చూపించింద‌ని భావించిన చంద్ర‌బాబు.. ఇటీవ‌ల జ‌రిగిన పోస్ట్‌మార్ట‌మ్‌లో బీసీలు, ద‌ళితుల‌కు తిరిగి ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ట‌.

అదేస‌మ‌యంలో యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని..త‌న కుమారుడు, భావి టీడీపీ అధినేత‌ లోకేష్‌ను బ‌లోపేతం చేయాలంటే.. యువ‌త ప్రాధాన్యం ఖ‌చ్చితంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే పార్టీ సీనియ‌ర్లు.. బీసీ యువ‌త‌ను, ద‌ళిత నేత‌ల‌నుకూడా పార్టీలో నుంచి జారి పోకుండా చూసుకుంటున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. గ‌త వైభ‌వం దిశ‌గా చంద్ర‌బాబు చేస్తున్న ఈ ప్ర‌యోగం.. ఫ‌లిస్తుందో లేదో చూడాల‌ని అంటున్న‌రు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 24, 2020 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టార్గెట్ పెట్టుకున్న ప్రభాస్ ఫౌజీ

ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఒక మూడు యాక్షన్ ఎపిసోడ్స్…

33 minutes ago

యువ ద‌ర్శ‌కుడికి కోపమొచ్చింది

చాలా త‌క్కువ‌ బ‌డ్జెట్లో, స్టార్ ఇమేజ్ లేని న‌టీన‌టులంతో నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తీసి తెలుగు ప్రేక్ష‌కులను…

1 hour ago

“నేను – ప‌వ‌న్ క‌లిసే ఉంటాం… ఇక మీ ఇష్టం“

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న పార్టీ సీనియ‌ర్ల‌కు.. ప‌రోక్షంగా ఓ విష‌యాన్ని తేల్చి చెప్పేశారు. కూట‌మి విష‌యంలోనూ.. ముఖ్యంగా జ‌న‌సేన‌-టీడీపీ…

6 hours ago

విచార‌ణ మ‌ధ్య‌లో `సెక్స్` వీడియోలు.. హైకోర్టు జ‌డ్జికి షాక్‌!

అది ఢిల్లీ హైకోర్టు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఓ కేసు విచార‌ణను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జ‌రిగాయి. వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లో…

11 hours ago

ప‌సుపు జెండా పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేదు

టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఘ‌నంగా జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీలో జాతీయ‌, రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గాల‌తోపాటు.. పొలిట్ బ్యూరోను…

14 hours ago

పెద్ద ట్విస్టు… పెద్ది విడుదల తేదీ ఇదా

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…

16 hours ago