ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన ఏ పార్టీ అయినా తాము ఏం తప్పులు చేశామో నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవడం.. పరిస్థితులకు తగ్గట్లుగా తాము మార ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత పుంజుకోవడానికి కార్యాచరణ మొదలుపెట్టడం చాలా అవసరం. 2019లో చిత్తుగా ఓడాక తెలుగుదేశం, జనసేన ఆ పని చేశాయి.
వైసీపీ వైఫల్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ తాము చేయాల్సిన పోరాటమంతా చేశాయి. ఐతే ఇప్పుడు వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జగన్ అండ్ కో వ్యవహారశైలి చూస్తుంటే.. ఇంకా ఆత్మస్తుతి పరనింద తరహాలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్తో మొదలుపెడితే.. లేటెస్ట్గా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ వ్యాఖ్యలు చూసి అందరూ విస్తుబోతున్నారు.
తన పాలనలో వైఫల్యాలు, తప్పిదాల ఊసే ఎత్తకుండా తాను చాలా గొప్పగా పరిపాలించినా, అద్భుతాలు చేసినా జనాలు ఓడించడం ఏంటి అనే ఆయన ఆవేదన చెందుతున్నారు. తాను మరీ ముక్కుసూటిగా ఉండడం, నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అంటూ నిష్ఠూరాలు ఆడారు.
ఐతే జగన్ ఇలా తనకు తాను ఉత్తముడినంటూ నాటకీయంగా మాట్లాడ్డం.. తెర వెనుక ఆయన చేతలు, ఆ పార్టీ నేతల వ్యవహారం వేరుగా ఉండడం, పాలన అస్తవ్యస్తంగా, అరాచకంగా తయారవడం వల్లే వైసీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిందన్నది వాస్తవం.
ఈ ఫలితాలు చూశాక అయినా మారాల్సింది పోయి జగన్ అనే నాటకీయతను కొనసాగిస్తూ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మరోవైపు కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్లు కొన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు తమ పాత శైలిలోనే ఎదురుదాడి, దుందుడుకుతనంతో మాట్లాడుతుండడం చూసి జగన్ అండ్ కో ఎప్పటికీ మారరు, వీళ్లింతే అనే అభిప్రాయాలను జనం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 22, 2024 11:35 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…