Political News

జగన్ అండ్ కో ఎప్పటికీ మారరు?

ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన ఏ పార్టీ అయినా తాము ఏం తప్పులు చేశామో నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవడం.. పరిస్థితులకు తగ్గట్లుగా తాము మార ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత పుంజుకోవడానికి కార్యాచరణ మొదలుపెట్టడం చాలా అవసరం. 2019లో చిత్తుగా ఓడాక తెలుగుదేశం, జనసేన ఆ పని చేశాయి.

వైసీపీ వైఫల్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ తాము చేయాల్సిన పోరాటమంతా చేశాయి. ఐతే ఇప్పుడు వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జగన్ అండ్ కో వ్యవహారశైలి చూస్తుంటే.. ఇంకా ఆత్మస్తుతి పరనింద తరహాలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్‌తో మొదలుపెడితే.. లేటెస్ట్‌గా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ వ్యాఖ్యలు చూసి అందరూ విస్తుబోతున్నారు.

తన పాలనలో వైఫల్యాలు, తప్పిదాల ఊసే ఎత్తకుండా తాను చాలా గొప్పగా పరిపాలించినా, అద్భుతాలు చేసినా జనాలు ఓడించడం ఏంటి అనే ఆయన ఆవేదన చెందుతున్నారు. తాను మరీ ముక్కుసూటిగా ఉండడం, నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అంటూ నిష్ఠూరాలు ఆడారు.

ఐతే జగన్ ఇలా తనకు తాను ఉత్తముడినంటూ నాటకీయంగా మాట్లాడ్డం.. తెర వెనుక ఆయన చేతలు, ఆ పార్టీ నేతల వ్యవహారం వేరుగా ఉండడం, పాలన అస్తవ్యస్తంగా, అరాచకంగా తయారవడం వల్లే వైసీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిందన్నది వాస్తవం.

ఈ ఫలితాలు చూశాక అయినా మారాల్సింది పోయి జగన్ అనే నాటకీయతను కొనసాగిస్తూ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

మరోవైపు కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్లు కొన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు తమ పాత శైలిలోనే ఎదురుదాడి, దుందుడుకుతనంతో మాట్లాడుతుండడం చూసి జగన్ అండ్ కో ఎప్పటికీ మారరు, వీళ్లింతే అనే అభిప్రాయాలను జనం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on June 22, 2024 11:35 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

1 hour ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

3 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

4 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

5 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

5 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

6 hours ago