ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన ఏ పార్టీ అయినా తాము ఏం తప్పులు చేశామో నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవడం.. పరిస్థితులకు తగ్గట్లుగా తాము మార ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత పుంజుకోవడానికి కార్యాచరణ మొదలుపెట్టడం చాలా అవసరం. 2019లో చిత్తుగా ఓడాక తెలుగుదేశం, జనసేన ఆ పని చేశాయి.
వైసీపీ వైఫల్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ తాము చేయాల్సిన పోరాటమంతా చేశాయి. ఐతే ఇప్పుడు వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జగన్ అండ్ కో వ్యవహారశైలి చూస్తుంటే.. ఇంకా ఆత్మస్తుతి పరనింద తరహాలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్తో మొదలుపెడితే.. లేటెస్ట్గా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ వ్యాఖ్యలు చూసి అందరూ విస్తుబోతున్నారు.
తన పాలనలో వైఫల్యాలు, తప్పిదాల ఊసే ఎత్తకుండా తాను చాలా గొప్పగా పరిపాలించినా, అద్భుతాలు చేసినా జనాలు ఓడించడం ఏంటి అనే ఆయన ఆవేదన చెందుతున్నారు. తాను మరీ ముక్కుసూటిగా ఉండడం, నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అంటూ నిష్ఠూరాలు ఆడారు.
ఐతే జగన్ ఇలా తనకు తాను ఉత్తముడినంటూ నాటకీయంగా మాట్లాడ్డం.. తెర వెనుక ఆయన చేతలు, ఆ పార్టీ నేతల వ్యవహారం వేరుగా ఉండడం, పాలన అస్తవ్యస్తంగా, అరాచకంగా తయారవడం వల్లే వైసీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిందన్నది వాస్తవం.
ఈ ఫలితాలు చూశాక అయినా మారాల్సింది పోయి జగన్ అనే నాటకీయతను కొనసాగిస్తూ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మరోవైపు కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్లు కొన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు తమ పాత శైలిలోనే ఎదురుదాడి, దుందుడుకుతనంతో మాట్లాడుతుండడం చూసి జగన్ అండ్ కో ఎప్పటికీ మారరు, వీళ్లింతే అనే అభిప్రాయాలను జనం వ్యక్తం చేస్తున్నారు.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…