ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచిన ఆ సీనియర్ నాయకుడి రాజకీయ భవిష్యత్ ఇప్పుడు అయోమయంలో పడింది. మునిగిపోతున్న పడవ లాంటి పార్టీలో నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సీనియర్ నాయకుడు ఎవరో కాదు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. టీడీపీలో నుంచి బీఆర్ఎస్లో చేరిన ఈ వరంగల్ లీడర్ డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఘనత సాధించారు. కానీ నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కు చెందిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి చేతిలో పాలకుర్తి నియోజకవర్గంలో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్నారు.
ఈ ఓటమి ఒకవైపైతే మరోవైపు బీఆర్ఎస్ ఉనికి రాష్ట్రంలో ప్రమాదంలో పడింది. ఆ పార్టీలో ఉంటే పొలిటికల్ కెరీర్ కొనసాగే అవకాశం లేదని భావిస్తున్న ఎర్రబెల్లి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఎర్రబెల్లిని రేవంత్ పార్టీలోకి తీసుకుంటారా? అన్నదే ఇక్కడ ప్రశ్న. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎర్రబెల్లితో కాంగ్రెస్కు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అంతే కాకుండా గతంలో కాంగ్రెస్పై, రేవంత్పై ఎర్రబెల్లి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లిని కాంగ్రెస్లో చేర్చుకోవడం సాధ్యం కాదనే చెప్పాలి.
ఇక బీజేపీ కూడా ఎర్రబెల్లిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఎర్రబెల్లి గతంలో ప్రాతినిథ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గంతో పాటు పాలకుర్తిలోనూ బీజేపీకి బలం లేదు. పైగా ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్ను పార్టీలోకి తీసుకునే పెద్దగా ప్రయోజనం ఏం ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ పోరాటం చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలనే డిమాండ్తో సాగుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి ఎర్రబెల్లిని చేర్చుకోవడం కరెక్టు కాదని బీజేపీ భావిస్తోందని తెలిసింది.
This post was last modified on June 21, 2024 5:46 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…