ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచిన ఆ సీనియర్ నాయకుడి రాజకీయ భవిష్యత్ ఇప్పుడు అయోమయంలో పడింది. మునిగిపోతున్న పడవ లాంటి పార్టీలో నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సీనియర్ నాయకుడు ఎవరో కాదు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. టీడీపీలో నుంచి బీఆర్ఎస్లో చేరిన ఈ వరంగల్ లీడర్ డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఘనత సాధించారు. కానీ నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కు చెందిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి చేతిలో పాలకుర్తి నియోజకవర్గంలో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్నారు.
ఈ ఓటమి ఒకవైపైతే మరోవైపు బీఆర్ఎస్ ఉనికి రాష్ట్రంలో ప్రమాదంలో పడింది. ఆ పార్టీలో ఉంటే పొలిటికల్ కెరీర్ కొనసాగే అవకాశం లేదని భావిస్తున్న ఎర్రబెల్లి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఎర్రబెల్లిని రేవంత్ పార్టీలోకి తీసుకుంటారా? అన్నదే ఇక్కడ ప్రశ్న. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎర్రబెల్లితో కాంగ్రెస్కు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అంతే కాకుండా గతంలో కాంగ్రెస్పై, రేవంత్పై ఎర్రబెల్లి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లిని కాంగ్రెస్లో చేర్చుకోవడం సాధ్యం కాదనే చెప్పాలి.
ఇక బీజేపీ కూడా ఎర్రబెల్లిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఎర్రబెల్లి గతంలో ప్రాతినిథ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గంతో పాటు పాలకుర్తిలోనూ బీజేపీకి బలం లేదు. పైగా ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్ను పార్టీలోకి తీసుకునే పెద్దగా ప్రయోజనం ఏం ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ పోరాటం చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలనే డిమాండ్తో సాగుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి ఎర్రబెల్లిని చేర్చుకోవడం కరెక్టు కాదని బీజేపీ భావిస్తోందని తెలిసింది.
This post was last modified on June 21, 2024 5:46 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…