ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడమే ఆలస్యం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. కేజ్రీవాల్కు బెయిల్ వస్తే బీఆర్ఎస్ లీడర్లకు ఆనందం ఎందుకు అనుకుంటున్నారా? ఇదే కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కూడా త్వరలోనే బెయిల్ వస్తుందనే ఆశలే కారణం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత మనీ లాండరింగ్ ఆరోపణలతో సీబీఐ కూడా ఎంటరవడంతో కవిత అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే కేసులో జైలుకెళ్లారు. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్పై బయటకు వచ్చిన ఆయన్ని తిరిగి జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఆయన మళ్లీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో ఈ బెయిల్పై స్టే పడింది. ఇదిలా ఉండగా మరోవైపు కవిత ఎప్పుడు బయటకు వస్తారా? అని బీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు.
నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఢీలా పడ్డ కేసీఆర్కు కవిత అరెస్టు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇక లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లతో పార్టీ ఉనికే ప్రమాదంలో పడింది. ఇప్పటికే కవిత అరెస్టుతో జరగాల్సిన నష్టం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తనయుడికి పరీక్షలు ఉన్నాయని, ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని ఇలా వివిధ కారణాలతో కవిత బెయిల్ కోరినా కోర్టు నిరాకరించింది. మరి ఇప్పుడు సీబీఐ కస్టడి ముగియడంతో కవితకు కోర్టు బెయిల్ ఇస్తుందా? అన్నది చూడాలి. ఒకవేళ రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చినా దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది. మరి కవిత బయటకు వస్తారా? అన్నది చూడాలి.
This post was last modified on June 21, 2024 5:44 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…