అధికారం ఉంది కదా అని నోటికి ఎంత వస్తే అంతే వాగే వైసీపీ నేతల్లో ముందుగా వినిపించే పేరు కొడాలి నానిదే. రాజకీయ వర్గాల్లో ఇది అందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అయిదేళ్లలో నాని నోటికి ఎదురు లేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆయన బూతు పురాణాన్ని కొనసాగించారు. ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేశారనే ఆరోపణలు నానిపై ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో ఓటమితో నానికి షాక్ తగిలింది. ఇప్పుడు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో మరో షాక్ తప్పలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. చివరకు ఇదే జగన్ కొంపముంచిందనే అభిప్రాయం ఉంది. కానీ అది వేరే సంగతి. ఆ వాలంటీర్లతో ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ పంచారు. పార్టీ పనులూ చేయించుకున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో ప్రచారం చేయించాలనుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్రేక్ పడింది. ఎన్నికల ప్రచారం చేయాలనుకుంటే వాలంటీర్ పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. దీంతో వేల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్ కోసం రాజీనామా చేశారని వైసీపీ గొప్పగా చెప్పుకుంది.
కానీ ఇప్పుడు వాలంటీర్లు తమ బాధలు బయటపెట్టుకుంటున్నారు. వైసీపీ నాయకులు భయపెట్టి తమతో రాజీనామాలు చేయించారని అసలు విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఇప్పుడు దీనిపైనే వాలంటీర్లు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొడాలి నాని భయపెట్టి తమను రాజీనామా చేసేలా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాట పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనుతో పాటు మరో ఇద్దరు నేతలపై ఐపీసీ 447, 506 తదితర సెక్షన్ల కింద గుడివాట వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on June 21, 2024 5:42 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…