తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ అరెస్టయ్యారు. అయితే. . అరెస్టు చేసే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. బాల్క సుమన్ కాలర్ పట్టుకుని.. గుంచిమరీ పోలీసులు ఆయనను జీపులోకి బలవంతంగా నెట్టారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు.. ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు.
అరెస్టు ఎందుకు?
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం హైదరాబాద్ లో తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ అగ్రనేతగా గుర్తింపు పొందిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్లో ఉండి.. పదవులు అనుభవించి.. ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతూ.. పార్టీకి ద్రోహం చేశారంటూ.. సుమన్ నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలతో కలిసి వెళ్లేందుకు సుమన్ ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగి.. తాము సంఘవిద్రోహ శక్తులం కాదని.. వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే.. ఎందుకు అడ్డుకున్నారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఇప్పుడు ఆందోళనలు వద్దు.. సీఎం వస్తున్నారని పోలీసులు చెప్పినా ఎంత సేపటికీ వినకపోవడంతో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ .. సుమన్ కాలర్ పట్టుకుని వాహనంలోకి బలవంతంగా నెట్టడం వైరల్ అయింది. దీనిని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే. కూడా సర్కారు ఓర్చుకోలేక పోతోందని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా రేవంత్, భట్టి విక్రమార్కలు ఆయన ఇంటికి వచ్చి.. పార్టీ కండువా కప్పి మరీ కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
This post was last modified on June 21, 2024 3:42 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…