గత నెల 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం.. మీడియాకు కనిపించని వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించకపోతే.. తన పేరును పద్మనాభ ‘రెడ్డి’గా మార్చుకుంటానని చెప్పిన ఆయన అన్నంత పని చేశారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిరాష్ట్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది.
తాజాగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొన్ని పాఠాలు చెప్పారు. డిప్యూటీ సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన .. హుందాగా వ్యవహరించాలని సూచించారు. “ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. నేను పవన్ కళ్యాణ్గారిని ఓడిస్తానని చెప్పా. చేయలేక పోయా. అందుకే నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నా” అని వ్యాఖ్యానించారు.
ఇక, పవన్ను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడ ల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి. నా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముద్రగడ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టిడిపికి సూచనలు చేయాలన్నారు. తామేమీ శత్రువులను కామన్నారు. రాజకీయల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని.. అయితే.. ఇదే తీర్పును అడ్డు పెట్టుకుని తమ కుటుంబంపై దాడులు చేయడం ఏంటని ముద్రగడ ప్రశ్నించారు.
This post was last modified on June 21, 2024 1:56 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…