Political News

ప‌వ‌న్‌కు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌రెడ్డి విన్న‌పాలు…!

గ‌త నెల 13న జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. మీడియాకు క‌నిపించ‌ని వైసీపీ నాయ‌కుడు, కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చారు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఓడించ‌క‌పోతే.. త‌న పేరును పద్మ‌నాభ ‘రెడ్డి’గా మార్చుకుంటాన‌ని చెప్పిన ఆయ‌న అన్నంత ప‌ని చేశారు. త‌న పేరును ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌రెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిరాష్ట్ర ప్ర‌భుత్వం గెజిట్ కూడా విడుద‌ల చేసింది.

తాజాగా ముద్ర‌గ‌డ మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడిన ముద్రగ‌డ‌.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్‌కు కొన్ని పాఠాలు చెప్పారు. డిప్యూటీ సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయ‌న .. హుందాగా వ్య‌వ‌హ‌రించాలని సూచించారు. “ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారిని ఓడిస్తాన‌ని చెప్పా. చేయ‌లేక పోయా. అందుకే నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నా” అని వ్యాఖ్యానించారు.

ఇక‌, ప‌వ‌న్‌ను ఉద్దేశించి ముద్ర‌గ‌డ మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడ ల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి. నా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టిడిపికి సూచనలు చేయాలన్నారు. తామేమీ శ‌త్రువుల‌ను కామ‌న్నారు. రాజ‌కీయ‌ల్లో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తున్నామ‌ని.. అయితే.. ఇదే తీర్పును అడ్డు పెట్టుకుని త‌మ కుటుంబంపై దాడులు చేయ‌డం ఏంట‌ని ముద్ర‌గ‌డ ప్ర‌శ్నించారు.

This post was last modified on June 21, 2024 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

48 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago