గత నెల 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం.. మీడియాకు కనిపించని వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించకపోతే.. తన పేరును పద్మనాభ ‘రెడ్డి’గా మార్చుకుంటానని చెప్పిన ఆయన అన్నంత పని చేశారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిరాష్ట్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది.
తాజాగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొన్ని పాఠాలు చెప్పారు. డిప్యూటీ సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన .. హుందాగా వ్యవహరించాలని సూచించారు. “ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. నేను పవన్ కళ్యాణ్గారిని ఓడిస్తానని చెప్పా. చేయలేక పోయా. అందుకే నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నా” అని వ్యాఖ్యానించారు.
ఇక, పవన్ను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడ ల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి. నా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముద్రగడ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టిడిపికి సూచనలు చేయాలన్నారు. తామేమీ శత్రువులను కామన్నారు. రాజకీయల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని.. అయితే.. ఇదే తీర్పును అడ్డు పెట్టుకుని తమ కుటుంబంపై దాడులు చేయడం ఏంటని ముద్రగడ ప్రశ్నించారు.
This post was last modified on June 21, 2024 1:56 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…