గత నెల 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం.. మీడియాకు కనిపించని వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించకపోతే.. తన పేరును పద్మనాభ ‘రెడ్డి’గా మార్చుకుంటానని చెప్పిన ఆయన అన్నంత పని చేశారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిరాష్ట్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది.
తాజాగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొన్ని పాఠాలు చెప్పారు. డిప్యూటీ సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన .. హుందాగా వ్యవహరించాలని సూచించారు. “ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. నేను పవన్ కళ్యాణ్గారిని ఓడిస్తానని చెప్పా. చేయలేక పోయా. అందుకే నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నా” అని వ్యాఖ్యానించారు.
ఇక, పవన్ను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడ ల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి. నా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముద్రగడ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టిడిపికి సూచనలు చేయాలన్నారు. తామేమీ శత్రువులను కామన్నారు. రాజకీయల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని.. అయితే.. ఇదే తీర్పును అడ్డు పెట్టుకుని తమ కుటుంబంపై దాడులు చేయడం ఏంటని ముద్రగడ ప్రశ్నించారు.
This post was last modified on June 21, 2024 1:56 pm
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…