Political News

ప‌వ‌న్‌కు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌రెడ్డి విన్న‌పాలు…!

గ‌త నెల 13న జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. మీడియాకు క‌నిపించ‌ని వైసీపీ నాయ‌కుడు, కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చారు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఓడించ‌క‌పోతే.. త‌న పేరును పద్మ‌నాభ ‘రెడ్డి’గా మార్చుకుంటాన‌ని చెప్పిన ఆయ‌న అన్నంత ప‌ని చేశారు. త‌న పేరును ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌రెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిరాష్ట్ర ప్ర‌భుత్వం గెజిట్ కూడా విడుద‌ల చేసింది.

తాజాగా ముద్ర‌గ‌డ మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడిన ముద్రగ‌డ‌.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్‌కు కొన్ని పాఠాలు చెప్పారు. డిప్యూటీ సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయ‌న .. హుందాగా వ్య‌వ‌హ‌రించాలని సూచించారు. “ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారిని ఓడిస్తాన‌ని చెప్పా. చేయ‌లేక పోయా. అందుకే నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నా” అని వ్యాఖ్యానించారు.

ఇక‌, ప‌వ‌న్‌ను ఉద్దేశించి ముద్ర‌గ‌డ మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడ ల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి. నా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టిడిపికి సూచనలు చేయాలన్నారు. తామేమీ శ‌త్రువుల‌ను కామ‌న్నారు. రాజ‌కీయ‌ల్లో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తున్నామ‌ని.. అయితే.. ఇదే తీర్పును అడ్డు పెట్టుకుని త‌మ కుటుంబంపై దాడులు చేయ‌డం ఏంట‌ని ముద్ర‌గ‌డ ప్ర‌శ్నించారు.

This post was last modified on June 21, 2024 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago