గత నెల 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం.. మీడియాకు కనిపించని వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించకపోతే.. తన పేరును పద్మనాభ ‘రెడ్డి’గా మార్చుకుంటానని చెప్పిన ఆయన అన్నంత పని చేశారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిరాష్ట్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది.
తాజాగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కిర్లంపూడిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొన్ని పాఠాలు చెప్పారు. డిప్యూటీ సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన .. హుందాగా వ్యవహరించాలని సూచించారు. “ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి. నేను పవన్ కళ్యాణ్గారిని ఓడిస్తానని చెప్పా. చేయలేక పోయా. అందుకే నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నా” అని వ్యాఖ్యానించారు.
ఇక, పవన్ను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడ ల్లో నడుస్తున్నాయి. కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి. నా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముద్రగడ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టిడిపికి సూచనలు చేయాలన్నారు. తామేమీ శత్రువులను కామన్నారు. రాజకీయల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని.. అయితే.. ఇదే తీర్పును అడ్డు పెట్టుకుని తమ కుటుంబంపై దాడులు చేయడం ఏంటని ముద్రగడ ప్రశ్నించారు.
This post was last modified on June 21, 2024 1:56 pm
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…
ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…