పార్టీ అధినేత జగన్కు సైతం అంతుచిక్కకుండా.. కొందరు నాయకులు రాజకీయాలు చేస్తున్నారా? వారి వ్యూహాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారా? అంటే..ఔననే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. గెలుస్తారని అనుకున్న నాయకులు.. కూడా ఓడిపోయారు. 164 మంది నాయకులు ఓడిపోవడం.. పార్టలోనూ చర్చనీయాంశమైంది. అయితే.. ఈ పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు 164 మందిలో 40 – 60 మంది పక్క చూపులు చూస్తున్నారు.
ఏ చిన్న అవకాశం వచ్చినా.. వారు పార్టీ మారిపోవడం ఖాయమని తెలుస్తోంది. అవకాశం సృష్టించుకునై నా.. పార్టీ మారేందుకు ప్రయత్నించేలా చూస్తున్నారు. వ్యాపారాలు, వ్యవహారాలు నడుపుతున్న వారంతా ఈ జాబితాలోనే ఉన్నారు. కొందరు ఎన్నికలకు ముందు జారుకోగా.. ఇప్పుడు ఓడిన నాయకులు మరింత మంది పార్టీకి రాంరాం చెప్పనున్నారు. ఎందుకంటే.. వచ్చే ఐదేళ్ల పాటు వారు వైసీపీలోనే ఉంటే.. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. పైగా.. ఖర్చు పెరుగుతుంది. ఈ కారణాలు కొందరిని వేధిస్తున్నాయి.
మరికొందరు మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం కోసం చూసుకుంటున్నారు. వీరు ఎవరు ఏయే ప్రయత్నా లు చేస్తున్నారనే విషయం సోషల్ మీడియా ఎప్పుడో పసిగట్టింది. ఇక, వైసీపీ అధినేత మాత్రం పసిగట్టకుండా ఉంటారా? కానీ.. జంప్ చేసేవారు వీరేనంటూ.. వినిపిస్తున్న.. జాబితాలో ఉన్న వారంతా.. ఇప్పుడు .. మౌనంగా ఉన్నారు. అంతేకాదు.. జగన్ గురువారం నిర్వహించిన విస్తృత స్తాయి సమావేశానికి కూడా హాజరయ్యారు. జగన్ చెప్పిందంతా కూల్గా విన్నారు. ఆ తర్వాత.. వెళ్లిపోయారు.
ఇక్కడ వారి వ్యూహం ఏంటంటే.. ఈ సమావేశానికి హాజరు కాకపోతే.. మరింతగా తమపై ప్రచారం జరుగుతుందనే! వెళ్లేది ఎలానూ వెళ్తాం కాబట్టి.. వెళ్లేవరకు అనవసర రచ్చ ఎందుకని నాయకులు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం. చిత్రంఏంటంటే.. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో చాలా మంది గతంలో ఇతర పార్టీల నుంచి జంప్ చేసి వచ్చిన వారే కావడం గమనార్హం. మరి వీరి వ్యూహాలను జగన్ పసిగట్టే ఉంటారు. సో.. ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 21, 2024 10:26 am
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…