ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమయంలో ఉన్నారు. మరో వారం పదిరోజుల్లోనే రాష్ట్రంలో సామాజిక పింఛన్లు.. ఉద్యోగుల జీతాలకు సంబంధించిన వ్యవహారం తేల్చాల్సి ఉంది. ఇటు వైపు పదువులు.. పీఠాల హడావుడి ఉండనే ఉంది. ఇక, పోలవరం.. అమరావతి ప్రాజెక్టులను వడివడిగా ముందుకు నడిపించాల్సి కూడా ఉంది. ఇంత బిజీ టైంలో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనలకు వెళ్తున్నారు. మరి ఇలాం ఎందుకు వెళ్తున్నారు? ఏంటి విషయం అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి ఇంత బిజీ టైంలో తన నియోజకవర్గంలో పర్యటించే బదులు.. ఆయా పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబు అలా చేయడం లేదు. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పరిణామమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. అయితే.. ఇంత అర్జంటు పనులు పెట్టుకుని ఎందుకు ? అనేది ప్రశ్న.
దీనికి ప్రధాన కారణం.. గత నెలలో జరిగిన ఎన్నికలకు ముందు.. చంద్రబాబు కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు. తాను గెలిచిన వెంటనే.. ఇక్కడికి వస్తానని.. ప్రజలందరినీ కలుస్తానని చెప్పారు. అంతేకాదు.. తొలి వారంలోనే సమస్యలపై దృష్టి పెడతానన్నారు. ఇక, పార్టీ కార్యకర్తలకు , నాయకులకు కూడా ఇదే హామీ ఇచ్చారు. పార్టీలో కీలక పదవులను పంచిపెడతానన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత కీలక సమయంలోనూ కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు బయలు దేరుతున్నారు.
This post was last modified on June 20, 2024 10:06 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…