Political News

కీల‌క స‌మ‌యంలో కుప్పానికి చంద్ర‌బాబు రీజ‌నేంటి?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క స‌మ‌యంలో ఉన్నారు. మ‌రో వారం ప‌దిరోజుల్లోనే రాష్ట్రంలో సామాజిక పింఛ‌న్లు.. ఉద్యోగుల జీతాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం తేల్చాల్సి ఉంది. ఇటు వైపు ప‌దువులు.. పీఠాల హ‌డావుడి ఉండ‌నే ఉంది. ఇక‌, పోల‌వ‌రం.. అమ‌రావ‌తి ప్రాజెక్టులను వ‌డివ‌డిగా ముందుకు న‌డిపించాల్సి కూడా ఉంది. ఇంత బిజీ టైంలో ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తున్నారు. మ‌రి ఇలాం ఎందుకు వెళ్తున్నారు? ఏంటి విష‌యం అనేది ఆస‌క్తిగా మారింది.

వాస్త‌వానికి ఇంత బిజీ టైంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించే బ‌దులు.. ఆయా ప‌నుల‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, చంద్ర‌బాబు అలా చేయ‌డం లేదు. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ ప‌రిణామ‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. అయితే.. ఇంత అర్జంటు ప‌నులు పెట్టుకుని ఎందుకు ? అనేది ప్ర‌శ్న‌.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. గ‌త నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు.. చంద్ర‌బాబు కుప్పం ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. తాను గెలిచిన వెంట‌నే.. ఇక్క‌డికి వ‌స్తాన‌ని.. ప్ర‌జ‌లంద‌రినీ క‌లుస్తాన‌ని చెప్పారు. అంతేకాదు.. తొలి వారంలోనే స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడ‌తాన‌న్నారు. ఇక‌, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు , నాయ‌కుల‌కు కూడా ఇదే హామీ ఇచ్చారు. పార్టీలో కీల‌క ప‌దవుల‌ను పంచిపెడ‌తాన‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఇంత కీల‌క స‌మ‌యంలోనూ కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరుతున్నారు.

  • ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు వైసీపీ బాధితులుగా ఉన్న టీడీపీ నేత‌ల‌కు ఊర‌ట‌క‌ల్పిస్తారు.
  • పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో విడివిడిగా భేటీ అవుతారు.
  • వ‌చ్చే ఆరు మాసాల‌కు స‌రిప‌డా భ‌రోసా వారికి క‌ల్పిస్తారు. ఎందుకంటే.. మ‌ళ్లీ సంక్రాంతి వ‌ర‌కు బాబు కుప్పానికి వెళ్లే అవ‌కాశం లేదు.
  • నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు. 9వ సారి కూడా త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుప‌నున్నారు.

This post was last modified on June 20, 2024 10:06 pm

Share
Show comments
Published by
Satya
Tags: kuppam

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago