ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమయంలో ఉన్నారు. మరో వారం పదిరోజుల్లోనే రాష్ట్రంలో సామాజిక పింఛన్లు.. ఉద్యోగుల జీతాలకు సంబంధించిన వ్యవహారం తేల్చాల్సి ఉంది. ఇటు వైపు పదువులు.. పీఠాల హడావుడి ఉండనే ఉంది. ఇక, పోలవరం.. అమరావతి ప్రాజెక్టులను వడివడిగా ముందుకు నడిపించాల్సి కూడా ఉంది. ఇంత బిజీ టైంలో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనలకు వెళ్తున్నారు. మరి ఇలాం ఎందుకు వెళ్తున్నారు? ఏంటి విషయం అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి ఇంత బిజీ టైంలో తన నియోజకవర్గంలో పర్యటించే బదులు.. ఆయా పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబు అలా చేయడం లేదు. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పరిణామమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. అయితే.. ఇంత అర్జంటు పనులు పెట్టుకుని ఎందుకు ? అనేది ప్రశ్న.
దీనికి ప్రధాన కారణం.. గత నెలలో జరిగిన ఎన్నికలకు ముందు.. చంద్రబాబు కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు. తాను గెలిచిన వెంటనే.. ఇక్కడికి వస్తానని.. ప్రజలందరినీ కలుస్తానని చెప్పారు. అంతేకాదు.. తొలి వారంలోనే సమస్యలపై దృష్టి పెడతానన్నారు. ఇక, పార్టీ కార్యకర్తలకు , నాయకులకు కూడా ఇదే హామీ ఇచ్చారు. పార్టీలో కీలక పదవులను పంచిపెడతానన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత కీలక సమయంలోనూ కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు బయలు దేరుతున్నారు.
This post was last modified on June 20, 2024 10:06 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…