ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమయంలో ఉన్నారు. మరో వారం పదిరోజుల్లోనే రాష్ట్రంలో సామాజిక పింఛన్లు.. ఉద్యోగుల జీతాలకు సంబంధించిన వ్యవహారం తేల్చాల్సి ఉంది. ఇటు వైపు పదువులు.. పీఠాల హడావుడి ఉండనే ఉంది. ఇక, పోలవరం.. అమరావతి ప్రాజెక్టులను వడివడిగా ముందుకు నడిపించాల్సి కూడా ఉంది. ఇంత బిజీ టైంలో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనలకు వెళ్తున్నారు. మరి ఇలాం ఎందుకు వెళ్తున్నారు? ఏంటి విషయం అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి ఇంత బిజీ టైంలో తన నియోజకవర్గంలో పర్యటించే బదులు.. ఆయా పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబు అలా చేయడం లేదు. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పరిణామమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. అయితే.. ఇంత అర్జంటు పనులు పెట్టుకుని ఎందుకు ? అనేది ప్రశ్న.
దీనికి ప్రధాన కారణం.. గత నెలలో జరిగిన ఎన్నికలకు ముందు.. చంద్రబాబు కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు. తాను గెలిచిన వెంటనే.. ఇక్కడికి వస్తానని.. ప్రజలందరినీ కలుస్తానని చెప్పారు. అంతేకాదు.. తొలి వారంలోనే సమస్యలపై దృష్టి పెడతానన్నారు. ఇక, పార్టీ కార్యకర్తలకు , నాయకులకు కూడా ఇదే హామీ ఇచ్చారు. పార్టీలో కీలక పదవులను పంచిపెడతానన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత కీలక సమయంలోనూ కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు బయలు దేరుతున్నారు.
This post was last modified on June 20, 2024 10:06 pm
ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…
సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…
యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…
జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా…
కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…