వైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్ ఓదార్పు యాత్రకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన తన మనసులో మాటను పార్టీ కీలక నాయకులకు వివరించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు, గెలిచిన నాయకులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిరాశలో కూరుకుపొయిన నాయకుల్లో ఆయన ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.
ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్న జగన్.. 40 శాతం ఓటు బ్యాంకు వైసీపీకి వచ్చిందన్నారు. కేంద్రం సహా.. పవన్ కల్యాణ్ వంటి వారిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారని చెప్పారు. అందుకే వైసీపీ ప్రభుత్వ మంచి కార్యక్రమాలపైనా బురదజల్లారన్నారు. ప్రజలను నమ్మకంగా వంచిచారని జగన్ వ్యాఖ్యానించారు. తాను త్వరలోనే ఓదార్పు యాత్ర చేయడం ద్వారా ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తానన్నారు.
పార్టీ ఓటమి తర్వాత.. వైసీపీ కార్యకర్తల కుటుంబాలపై అనేక దాడులు జరిగాయని, అనేక మందిని చంపేశారని.. వారి వారి కుటుంబాలను తాను కలిసి సాయం చేయాలని భావిస్తున్నట్టు జగన్ చెప్పారు. దీనికి పార్టీలో కీలక నాయకులు అందరూ ఓకే చెప్పారు. తాము కూడా.. తమ తమ నియోజకవర్గాల్లో యాత్రకు సిద్ధమవుతామని వారు చెప్పగా.. కొంత సమయం తీసుకోవాలని.. చంద్రబాబు పాలనకు కూడా.. టైం ఇవ్వాలని.. అప్పుడు యాత్రలు చేయాలని జగన్ సూచించారు.
This post was last modified on June 20, 2024 2:50 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…