Political News

ఓదార్పు యాత్ర‌కు జ‌గ‌న్ రెడీ!

వైసీపీ అధినేత‌, తాజా మాజీ సీఎం జ‌గ‌న్ ఓదార్పు యాత్ర‌కు రెడీ అయ్యారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న మ‌నసులో మాట‌ను పార్టీ కీల‌క నాయ‌కుల‌కు వివ‌రించారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం లో నిర్వ‌హించిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాయ‌కులు, గెలిచిన నాయ‌కుల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నిరాశ‌లో కూరుకుపొయిన నాయ‌కుల్లో ఆయ‌న ధైర్యం నూరిపోసే ప్ర‌య‌త్నం చేశారు.

ఎవ‌రూ అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్‌.. 40 శాతం ఓటు బ్యాంకు వైసీపీకి వ‌చ్చింద‌న్నారు. కేంద్రం స‌హా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి వారిని అడ్డుపెట్టుకుని చంద్ర‌బాబు నీచ రాజ‌కీయాలు చేశార‌ని చెప్పారు. అందుకే వైసీపీ ప్ర‌భుత్వ మంచి కార్య‌క్ర‌మాల‌పైనా బుర‌ద‌జ‌ల్లార‌న్నారు. ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌కంగా వంచిచారని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. తాను త్వ‌ర‌లోనే ఓదార్పు యాత్ర చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు.

పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌పై అనేక దాడులు జ‌రిగాయ‌ని, అనేక మందిని చంపేశార‌ని.. వారి వారి కుటుంబాల‌ను తాను క‌లిసి సాయం చేయాల‌ని భావిస్తున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. దీనికి పార్టీలో కీల‌క నాయ‌కులు అంద‌రూ ఓకే చెప్పారు. తాము కూడా.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతామ‌ని వారు చెప్ప‌గా.. కొంత స‌మ‌యం తీసుకోవాల‌ని.. చంద్ర‌బాబు పాల‌న‌కు కూడా.. టైం ఇవ్వాల‌ని.. అప్పుడు యాత్ర‌లు చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు.

This post was last modified on June 20, 2024 2:50 pm

Share
Show comments
Published by
Satya
Tags: Odarpu Yatra

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

4 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago