వైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్ ఓదార్పు యాత్రకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన తన మనసులో మాటను పార్టీ కీలక నాయకులకు వివరించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు, గెలిచిన నాయకులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిరాశలో కూరుకుపొయిన నాయకుల్లో ఆయన ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.
ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్న జగన్.. 40 శాతం ఓటు బ్యాంకు వైసీపీకి వచ్చిందన్నారు. కేంద్రం సహా.. పవన్ కల్యాణ్ వంటి వారిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారని చెప్పారు. అందుకే వైసీపీ ప్రభుత్వ మంచి కార్యక్రమాలపైనా బురదజల్లారన్నారు. ప్రజలను నమ్మకంగా వంచిచారని జగన్ వ్యాఖ్యానించారు. తాను త్వరలోనే ఓదార్పు యాత్ర చేయడం ద్వారా ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తానన్నారు.
పార్టీ ఓటమి తర్వాత.. వైసీపీ కార్యకర్తల కుటుంబాలపై అనేక దాడులు జరిగాయని, అనేక మందిని చంపేశారని.. వారి వారి కుటుంబాలను తాను కలిసి సాయం చేయాలని భావిస్తున్నట్టు జగన్ చెప్పారు. దీనికి పార్టీలో కీలక నాయకులు అందరూ ఓకే చెప్పారు. తాము కూడా.. తమ తమ నియోజకవర్గాల్లో యాత్రకు సిద్ధమవుతామని వారు చెప్పగా.. కొంత సమయం తీసుకోవాలని.. చంద్రబాబు పాలనకు కూడా.. టైం ఇవ్వాలని.. అప్పుడు యాత్రలు చేయాలని జగన్ సూచించారు.
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…