Political News

ఓదార్పు యాత్ర‌కు జ‌గ‌న్ రెడీ!

వైసీపీ అధినేత‌, తాజా మాజీ సీఎం జ‌గ‌న్ ఓదార్పు యాత్ర‌కు రెడీ అయ్యారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న మ‌నసులో మాట‌ను పార్టీ కీల‌క నాయ‌కుల‌కు వివ‌రించారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం లో నిర్వ‌హించిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాయ‌కులు, గెలిచిన నాయ‌కుల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నిరాశ‌లో కూరుకుపొయిన నాయ‌కుల్లో ఆయ‌న ధైర్యం నూరిపోసే ప్ర‌య‌త్నం చేశారు.

ఎవ‌రూ అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్‌.. 40 శాతం ఓటు బ్యాంకు వైసీపీకి వ‌చ్చింద‌న్నారు. కేంద్రం స‌హా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి వారిని అడ్డుపెట్టుకుని చంద్ర‌బాబు నీచ రాజ‌కీయాలు చేశార‌ని చెప్పారు. అందుకే వైసీపీ ప్ర‌భుత్వ మంచి కార్య‌క్ర‌మాల‌పైనా బుర‌ద‌జ‌ల్లార‌న్నారు. ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌కంగా వంచిచారని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. తాను త్వ‌ర‌లోనే ఓదార్పు యాత్ర చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు.

పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌పై అనేక దాడులు జ‌రిగాయ‌ని, అనేక మందిని చంపేశార‌ని.. వారి వారి కుటుంబాల‌ను తాను క‌లిసి సాయం చేయాల‌ని భావిస్తున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. దీనికి పార్టీలో కీల‌క నాయ‌కులు అంద‌రూ ఓకే చెప్పారు. తాము కూడా.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతామ‌ని వారు చెప్ప‌గా.. కొంత స‌మ‌యం తీసుకోవాల‌ని.. చంద్ర‌బాబు పాల‌న‌కు కూడా.. టైం ఇవ్వాల‌ని.. అప్పుడు యాత్ర‌లు చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు.

This post was last modified on June 20, 2024 2:50 pm

Share

Recent Posts

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

38 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

42 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago