Political News

మంత్రుల‌కు ప‌ని పెంచేసిన నారా లోకేష్‌..!

ఇదేంటి? అనుకుంటున్నారా? ఔను .. నిజ‌మే. టీడీపీ యువ నాయ‌కుడు.. మంత్రి నారా లోకేష్ త‌న పార్టీకి చెందిన వారినే కాదు.. కూట‌మి పార్టీల నాయ‌కుల ప‌నిని కూడా పెంచేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నారా లోకేష్‌.. ఆ వెంట‌నే ప్ర‌జాద‌ర్బార్ పేరుతో నిత్యంత‌న నివాసంలోనే ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. సుమారు మూడు గంట‌ల‌పాటు ప్ర‌జ‌ల‌తోబేటీ అవుతున్నారు. ఉద‌యం7 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు.

దీంతో సుదీర్ఘ కాలంగా త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాని వారు.. విన‌తి పత్రాలు ప‌ట్టుకుని ఉండ‌వ‌ల్లిలోని నారాలోకేష్ నివాసానికి క్యూ క‌డుతున్నారు. ఇలా వ‌చ్చిన వారి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన‌డ‌మే కాకుండా సాధ్య‌మైనంత వ‌ర‌కు అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్కారాలు చూపిస్తున్నారు.

రోడ్డు సైడ్ వ్యాపారుల‌కు పోలీసుల నుంచి వేధింపులు వ‌స్తున్నాయ‌ని వ్యాపారాలు విన్న‌వించ‌గా..అక్క‌డిక‌క్క‌డే ఓ లేఖ రాయించి.. డీజీపీకి పంపించారు. దీంతో ఆవెంట‌నే డీజీపీ నుంచి కూడా స‌మాధానం వ‌చ్చింది.

ఇక‌పై వేధింపులు ఉండ‌వ‌ని డీజీపీ చెప్పారు. ఇక ఎక్క‌డో విశాఖ నుంచి ఓ మ‌హిళ వ‌చ్చి.. త‌న బాధ‌లు చెప్పుకొన్నారు. వాటిని కూడా వెంట‌నే నారా లోకేష్ ప‌రిష్క‌రించారు. ఇలా.. నిత్యం వంద‌ల మంది బాధితులు.. వ‌చ్చి స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు.

అయితే.. త‌న నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కే ప‌రిమితం అనుకున్న ప్ర‌జాద‌ర్బార్‌కు ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌స్తుండ‌డంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోనూ ప్ర‌జాప్ర‌తినిధులు, మంత్రులు ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తే బాగుంటుంద‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

విశాఖ‌, మ‌చిలీప‌ట్నం, తిరుప‌తి ప్రాంతాల నుంచి వ‌చ్చిన బాధితులు కూడా.. ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. త‌మ త‌మ ప్రాంతాల్లోని ప్ర‌జాప్ర‌తినిధులు కూడా.. ఇలా.. ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేయాల‌ని.. ఆయ‌న‌కు విన్న‌వించారు.

దీంతో ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్ల‌నున్న‌ట్టు నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఇక‌, ఆయ‌న‌ క‌నుక ఈ సూచ‌న‌ను ముఖ్య‌మంత్రికి వివ‌రిస్తే.. ఇక నుంచి ప్ర‌జాద‌ర్బార్‌ను అంద‌రూ నిర్వ‌హించ‌డం.. ఖ‌చ్చితం కానుంది. దీంతో స‌హ‌జంగానే మంత్రుల‌కు ప‌ని పెరగ‌నుంది.

This post was last modified on June 20, 2024 2:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: Nara Lokesh

Recent Posts

ప్ర‌ధాని మోడీ ఇంట కొత్త అతిధి

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాల‌కు పండ‌గ వ‌చ్చింది. సుమారు 30 గోవుల‌ను ఈ గోశాల‌లో పెంచు తున్నారు.…

38 mins ago

ఉప్పెన భామకు మళ్ళీ నిరాశేనా

డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత వరస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిన హీరోయిన్ కృతి శెట్టి మలయాళం…

2 hours ago

రేవంత్‌రెడ్డి…. చిట్టినాయుడు, టైగర్ కౌశిక్ భాయ్:  కేటీఆర్‌

"తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్ర‌బాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయ‌నెం త‌?" అని బీఆర్ ఎస్…

4 hours ago

కొత్త హీరో లాంచింగ్.. ఎన్ని కోట్లు పోశారో

హీరోయిన్‌గా రెజీనా కసాండ్రా.. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ.. ఇంకా చాలామంది ప్రముఖ…

4 hours ago

సిద్ధు, విశ్వ‌క్.. మ‌ధ్య‌లో తార‌క్

సినిమాల ప్ర‌మోష‌న్లు రోజు రోజుకూ కొంత పుత్త‌లు తొక్కుతున్నాయి. ఒక మూస‌లో సాగిపోతే ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌డం క‌ష్టం కాబ‌ట్టి..…

5 hours ago

జనసేన వైపు ఉదయభాను చూపు !

ఏపీలో అధికారం కోల్పోవడం వైసీపీ నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు మోపీదేవి వెంకటరమణ, ఆళ్ల నాని,…

5 hours ago