ఇదేంటి? అనుకుంటున్నారా? ఔను .. నిజమే. టీడీపీ యువ నాయకుడు.. మంత్రి నారా లోకేష్ తన పార్టీకి చెందిన వారినే కాదు.. కూటమి పార్టీల నాయకుల పనిని కూడా పెంచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్.. ఆ వెంటనే ప్రజాదర్బార్ పేరుతో నిత్యంతన నివాసంలోనే ప్రజలను కలుస్తున్నారు. సుమారు మూడు గంటలపాటు ప్రజలతోబేటీ అవుతున్నారు. ఉదయం7 గంటల నుంచి 10 గంటల వరకు మంగళగిరి నియోజకవర్గం ప్రజలతో మమేకం అవుతున్నారు.
దీంతో సుదీర్ఘ కాలంగా తమ సమస్యలు పరిష్కారం కాని వారు.. వినతి పత్రాలు పట్టుకుని ఉండవల్లిలోని నారాలోకేష్ నివాసానికి క్యూ కడుతున్నారు. ఇలా వచ్చిన వారి సమస్యలను సావధానంగా వినడమే కాకుండా సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారాలు చూపిస్తున్నారు.
రోడ్డు సైడ్ వ్యాపారులకు పోలీసుల నుంచి వేధింపులు వస్తున్నాయని వ్యాపారాలు విన్నవించగా..అక్కడికక్కడే ఓ లేఖ రాయించి.. డీజీపీకి పంపించారు. దీంతో ఆవెంటనే డీజీపీ నుంచి కూడా సమాధానం వచ్చింది.
ఇకపై వేధింపులు ఉండవని డీజీపీ చెప్పారు. ఇక ఎక్కడో విశాఖ నుంచి ఓ మహిళ వచ్చి.. తన బాధలు చెప్పుకొన్నారు. వాటిని కూడా వెంటనే నారా లోకేష్ పరిష్కరించారు. ఇలా.. నిత్యం వందల మంది బాధితులు.. వచ్చి సమస్యలు చెప్పుకొంటున్నారు.
అయితే.. తన నియోజకవర్గం వరకే పరిమితం అనుకున్న ప్రజాదర్బార్కు ఎక్కడెక్కడ నుంచో వస్తుండడంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోనూ ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రజాదర్బార్ నిర్వహిస్తే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి.
విశాఖ, మచిలీపట్నం, తిరుపతి ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు కూడా.. ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ తమ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు కూడా.. ఇలా.. ప్రజాదర్బార్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని.. ఆయనకు విన్నవించారు.
దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఇక, ఆయన కనుక ఈ సూచనను ముఖ్యమంత్రికి వివరిస్తే.. ఇక నుంచి ప్రజాదర్బార్ను అందరూ నిర్వహించడం.. ఖచ్చితం కానుంది. దీంతో సహజంగానే మంత్రులకు పని పెరగనుంది.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…