Political News

మంత్రుల‌కు ప‌ని పెంచేసిన నారా లోకేష్‌..!

ఇదేంటి? అనుకుంటున్నారా? ఔను .. నిజ‌మే. టీడీపీ యువ నాయ‌కుడు.. మంత్రి నారా లోకేష్ త‌న పార్టీకి చెందిన వారినే కాదు.. కూట‌మి పార్టీల నాయ‌కుల ప‌నిని కూడా పెంచేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నారా లోకేష్‌.. ఆ వెంట‌నే ప్ర‌జాద‌ర్బార్ పేరుతో నిత్యంత‌న నివాసంలోనే ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. సుమారు మూడు గంట‌ల‌పాటు ప్ర‌జ‌ల‌తోబేటీ అవుతున్నారు. ఉద‌యం7 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు.

దీంతో సుదీర్ఘ కాలంగా త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాని వారు.. విన‌తి పత్రాలు ప‌ట్టుకుని ఉండ‌వ‌ల్లిలోని నారాలోకేష్ నివాసానికి క్యూ క‌డుతున్నారు. ఇలా వ‌చ్చిన వారి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన‌డ‌మే కాకుండా సాధ్య‌మైనంత వ‌ర‌కు అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్కారాలు చూపిస్తున్నారు.

రోడ్డు సైడ్ వ్యాపారుల‌కు పోలీసుల నుంచి వేధింపులు వ‌స్తున్నాయ‌ని వ్యాపారాలు విన్న‌వించ‌గా..అక్క‌డిక‌క్క‌డే ఓ లేఖ రాయించి.. డీజీపీకి పంపించారు. దీంతో ఆవెంట‌నే డీజీపీ నుంచి కూడా స‌మాధానం వ‌చ్చింది.

ఇక‌పై వేధింపులు ఉండ‌వ‌ని డీజీపీ చెప్పారు. ఇక ఎక్క‌డో విశాఖ నుంచి ఓ మ‌హిళ వ‌చ్చి.. త‌న బాధ‌లు చెప్పుకొన్నారు. వాటిని కూడా వెంట‌నే నారా లోకేష్ ప‌రిష్క‌రించారు. ఇలా.. నిత్యం వంద‌ల మంది బాధితులు.. వ‌చ్చి స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు.

అయితే.. త‌న నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కే ప‌రిమితం అనుకున్న ప్ర‌జాద‌ర్బార్‌కు ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌స్తుండ‌డంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోనూ ప్ర‌జాప్ర‌తినిధులు, మంత్రులు ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తే బాగుంటుంద‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

విశాఖ‌, మ‌చిలీప‌ట్నం, తిరుప‌తి ప్రాంతాల నుంచి వ‌చ్చిన బాధితులు కూడా.. ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. త‌మ త‌మ ప్రాంతాల్లోని ప్ర‌జాప్ర‌తినిధులు కూడా.. ఇలా.. ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేయాల‌ని.. ఆయ‌న‌కు విన్న‌వించారు.

దీంతో ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్ల‌నున్న‌ట్టు నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఇక‌, ఆయ‌న‌ క‌నుక ఈ సూచ‌న‌ను ముఖ్య‌మంత్రికి వివ‌రిస్తే.. ఇక నుంచి ప్ర‌జాద‌ర్బార్‌ను అంద‌రూ నిర్వ‌హించ‌డం.. ఖ‌చ్చితం కానుంది. దీంతో స‌హ‌జంగానే మంత్రుల‌కు ప‌ని పెరగ‌నుంది.

This post was last modified on June 20, 2024 2:46 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago