Political News

చివ‌రి వ‌రుస‌లో జ‌గ‌న్ కూర్చోవాల్సి వ‌స్తే..?

ఓడ‌లు బ‌ళ్లు-బ‌ళ్లు ఓడ‌లు కావ‌డం.. రాజ‌కీయాల్లో కామ‌నే. కానీ, ఇంత‌కుమించిన విధంగా వైసీపీ ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. 151 స్థానాల‌తో ఠీవీగా కాల‌ర్ ఎగ‌రేసుకున్న పార్టీ..ఇప్పుడు 11 స్థానాల‌కు ప‌రిమిత‌మై.. నేల చూపులు చూస్తోంది. పుంజుకుంటుందా? లేదా? అనేది ఆ పార్టీ అనుస‌రించే వ్యూహాల‌ను బ‌ట్టి ఉంటుంది.

కానీ.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం కొన్ని స‌వాళ్లు ఎదుర్కొనాల్సి వ‌స్తోంది. దీనిలో ప్ర‌ధానంగా అసెంబ్లీ వ్య‌వ‌హారం. నిన్న‌టి వ‌ర‌కు తొలి వ‌రుస‌లో కూర్చున్న‌వైసీపీ.. ఇప్పుడు చివ‌రి వ‌రుస‌లో కూర్చునే ప‌రిస్థితికి వ‌చ్చింది.

సాధార‌ణంగా స‌భ‌లో ఎప్పుడూ.. అధికార ప‌క్షం.. స‌భ్యుల‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిపక్షం అయితే.. ఆ ప‌క్క‌గా.. తొలి వ‌రుస నుంచి స‌భ్యుల‌కు సీట్లు కేటాయిస్తారు. ఇది ఎక్క‌డైనా జ‌రిగేదే.

గ‌తంలో టీడీపీకి కూడా.. ఇలానే తొలి వ‌రుస‌లోనే.. 4 సీట్లు కేటాయించి.. దాని నుంచి వెన‌క్కి ఉండే సీట్ల‌ను 6 వ‌రుస‌లు అంటే.. 24 సీట్ల‌ను టీడీపీకి కేటాయించారు. 23 సీట్లు రావ‌డంతో ఆ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా స‌హా.. అసెంబ్లీ బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీలోనూ చోటు క‌ల్పించారు. దీనికి అప్ప‌ట్లో అచ్చెన్నాయుడు, ఇత‌ర నాయ‌కులు హాజ‌ర‌య్యేవారు.

అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌ధాన ప్రతిప‌క్ష‌మే లేకుండా పోయింది. ఈ హోదా ద‌క్కాలంటే.. క‌నీసం 18 మంది స‌భ్యులు ఒక పార్టీకి ఉండాలి(మొత్తం స‌భ్యుల్లో 15 శాతం). కానీ, అధికారం కోల్పోయిన వైసీపీకి 11 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి.

దీంతో ప్ర‌ధాన ప్రతిప‌క్షం హోదా లేదు. పైగా.. బీఏసీలోనూ.. చోటుద‌క్కే చాన్స్ కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి మాత్ర‌మే బీఏసీలో చోటు ఇస్తారు. ఈ ప‌రిస్తితిని వైసీపీ కోల్పోయింది. ఇదొక పెద్ద మైన‌స్‌.

ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క విష‌యం వెలుగు చూసింది. అసెంబ్లీలో.. ఆ పార్టీకి అన్నింటికంటే చివ‌రి వ‌రుస‌లో సీట్లు కేటాయిస్తున్న‌ట్టు స‌మాచారం. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా.. సాధార‌ణంగా అసెంబ్లీ అధికారులు ముందుగానే పార్టీలకు సీట్ల‌ను కేటాయిస్తారు. త‌ర్వాత స్పీక‌ర్ అభిప్రాయం మేర‌కు మార్చే అవ‌కాశం ఉంది. కానీ, వైసీపీకి బ‌ల‌మైన సంఖ్య లేక‌పోవడంతో స్పీక‌ర్ కూడా.. జోక్యం చేసుకునే అవ‌కాశం త‌క్కువే.

దీంతో స‌భ‌లో చివ‌రి 11 సీట్లు కేటాయిస్తే.. జ‌గ‌న్ వెళ్తారా? అనేది ప్ర‌శ్న‌. దాదాపు ఆయ‌న వెళ్ల‌క‌పోవ‌చ్చ‌ని.. అసెంబ్లీ స‌భా వ్య‌వ‌హారాల‌ను మాజీ మంత్రి , సీనియ‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని.. తాను ప్ర‌జాబాట ప‌ట్టే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on June 20, 2024 11:58 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

58 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago