ఓడలు బళ్లు-బళ్లు ఓడలు కావడం.. రాజకీయాల్లో కామనే. కానీ, ఇంతకుమించిన విధంగా వైసీపీ ఘోర పరాజయం చవి చూసింది. 151 స్థానాలతో ఠీవీగా కాలర్ ఎగరేసుకున్న పార్టీ..ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమై.. నేల చూపులు చూస్తోంది. పుంజుకుంటుందా? లేదా? అనేది ఆ పార్టీ అనుసరించే వ్యూహాలను బట్టి ఉంటుంది.
కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తోంది. దీనిలో ప్రధానంగా అసెంబ్లీ వ్యవహారం. నిన్నటి వరకు తొలి వరుసలో కూర్చున్నవైసీపీ.. ఇప్పుడు చివరి వరుసలో కూర్చునే పరిస్థితికి వచ్చింది.
సాధారణంగా సభలో ఎప్పుడూ.. అధికార పక్షం.. సభ్యులకు ప్రాధాన్యం ఉంటుంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం అయితే.. ఆ పక్కగా.. తొలి వరుస నుంచి సభ్యులకు సీట్లు కేటాయిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే.
గతంలో టీడీపీకి కూడా.. ఇలానే తొలి వరుసలోనే.. 4 సీట్లు కేటాయించి.. దాని నుంచి వెనక్కి ఉండే సీట్లను 6 వరుసలు అంటే.. 24 సీట్లను టీడీపీకి కేటాయించారు. 23 సీట్లు రావడంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా సహా.. అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలోనూ చోటు కల్పించారు. దీనికి అప్పట్లో అచ్చెన్నాయుడు, ఇతర నాయకులు హాజరయ్యేవారు.
అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమే లేకుండా పోయింది. ఈ హోదా దక్కాలంటే.. కనీసం 18 మంది సభ్యులు ఒక పార్టీకి ఉండాలి(మొత్తం సభ్యుల్లో 15 శాతం). కానీ, అధికారం కోల్పోయిన వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి.
దీంతో ప్రధాన ప్రతిపక్షం హోదా లేదు. పైగా.. బీఏసీలోనూ.. చోటుదక్కే చాన్స్ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే.. ప్రధాన ప్రతిపక్షానికి మాత్రమే బీఏసీలో చోటు ఇస్తారు. ఈ పరిస్తితిని వైసీపీ కోల్పోయింది. ఇదొక పెద్ద మైనస్.
ఇక, ఇప్పుడు మరో కీలక విషయం వెలుగు చూసింది. అసెంబ్లీలో.. ఆ పార్టీకి అన్నింటికంటే చివరి వరుసలో సీట్లు కేటాయిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. సాధారణంగా అసెంబ్లీ అధికారులు ముందుగానే పార్టీలకు సీట్లను కేటాయిస్తారు. తర్వాత స్పీకర్ అభిప్రాయం మేరకు మార్చే అవకాశం ఉంది. కానీ, వైసీపీకి బలమైన సంఖ్య లేకపోవడంతో స్పీకర్ కూడా.. జోక్యం చేసుకునే అవకాశం తక్కువే.
దీంతో సభలో చివరి 11 సీట్లు కేటాయిస్తే.. జగన్ వెళ్తారా? అనేది ప్రశ్న. దాదాపు ఆయన వెళ్లకపోవచ్చని.. అసెంబ్లీ సభా వ్యవహారాలను మాజీ మంత్రి , సీనియర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించే అవకాశం ఉందని.. తాను ప్రజాబాట పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…