విశాఖలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండపై వైసీపీ హయాంలో జరిగిన నిర్మాణం.. ఇప్పుడు కాక రేపుతోంది. రూ.500 కోట్లతో మహారాజా ప్యాలెస్ను తలపించేలా చేపట్టిన ఈ నిర్మాణాలను మూడేళ్ల పాటు సాగించారు.
దీనిలోకి పురుగును కూడా రానివ్వకుండా.. కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మొత్తానికి వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ.. కూడా.. విశాఖ రుషికొండపై ఏం జరుగుతోందన్నది ప్రధాన ప్రశ్నగానే మారిపోయింది. ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఇక, తాజా ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి.. టీడీపీ పగ్గాలు చేపట్టాక.. రుషికొండలోకి ప్రజాప్రతినిధులు.. జర్నలిస్టులను తీసుకువెళ్లారు. ఇక్కడి పరిశరాలను.. నిర్మాణాలను చూపించారు. ఇది మహారాజా ప్యాలెస్కు భిన్నంగా ఏమీలేదని తేల్చారు. ఆ తర్వాత అనేక కథనాలు… వచ్చాయి. అంతేకాదు.. వాటిపై వ్యాఖ్యానాలు కూడా.. వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్యాలెస్.. రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. గతంలో జగన్ ప్రజావేదికను కూల్చేయడంతో ఇప్పుడు ఈ ప్యాలెస్ను కూల్చేస్తారా? అనేది చర్చ.
అయితే.. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు అలా చేయకపోవచ్చు. కానీ, ఈ ప్యాలెస్ను ఏం చేయాలన్నది మాత్రం సర్కారుకు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికినాలుగు ఆప్షన్లు పరిశీలిస్తున్నారు. వీటిలో ఒక్కటి వర్కవుట్ అయినా.. ప్యాలెస్ విషయంలో మంచి చేసినట్టేనని కొందరు చెబుతున్నారు.
1) కేంద్ర పర్యాటక శాఖకు ఈ ప్యాలెస్ను విక్రయించడం.
2) రాష్ట్ర పర్యాటక పరిధిలోనే దీనిని ఉంచడం.
3) త్రివిధ దళాలకు అప్పగించేలా నిర్ణయం తీసుకోవడం.
4) ప్రభుత్వ అతిథి గృహంగా గుర్తించడం.
ఈ నాలుగు పరిధిల్లో ఒక్కటి సక్సెస్ అయినా.. ఫర్వాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ సమావేశాలకు.. రాజధానిలో నిర్మాణాలు ఉన్నాయి. లేకపోతే.. కేబినెట్ సమావేశాలకు.. దీనిని వినియోగిం చుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఏర్పాటు చేయాలన్నా.. కడు దూరం. అంటే.. ఒక నిర్ణయం తీసుకునేందుకు ఎలానూ ఈ ప్యాలెస్ ప్రయోజన కరంగా కనిపించకపోవడం పెను సమస్యగా మారింది. దీంతో ఇప్పుడు నాలుగు ఆప్షన్లను పరిశీలిస్తున్నారు.
This post was last modified on June 20, 2024 11:57 am
ఆయా షేర్ అంటూ పాటల నుంచే సంచలనాలు మొదలుపెట్టిన ది ప్యారడైజ్ సినిమా దానికి తగ్గట్టే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్…
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) ఎన్నికలపై ప్రధాన పార్టీల కార్యకర్తల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కార్పొరేషన్ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు మరో సమస్య ఎదురైంది. అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ నుంచి వచ్చే…
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర…
కరోనా సమయంలో ‘‘భలే మంచి ఓటీటీ బేరము’’ అని పాడుకున్నాయి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు. మిగతా భాషల చిత్రాలకు కూడా…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…