ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు గుర్తింపు సంపాదించిన నేత.. ముద్రగడ పద్మనాభం. 2019లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడడంలో ఆయన పాత్ర కూడా కొంత ఉంది. టీడీపీకి వ్యతిరేకంగా కాపులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన ప్రయత్నం కొంతమేర ఫలించింది. కానీ ఈసారి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమే ధ్యేయంగా పని చేసి బొక్క బోర్లా పడ్డారు.
పవన్ కళ్యాణ్ను ఓడించాలంటూ పిఠాపురం ప్రజలకు ఆయన ఇచ్చిన పిలుపు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల ముంగిట పవన్ను ఓడించకుంటే తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకుంటానంటూ ఆయన చేసిన సవాల్తో అభాసుపాలైపోయారు. ఇదేం సవాల్ అని జనాలు ముక్కున వేలేసుకున్నారు.
కట్ చేస్తే ఎన్నికల్లో పవన్ కళ్యాణే కాదు.. జనసేన అభ్యర్థులందరూ కూడా తిరుగులేని విజయం సాధించారు. దీంతో ముద్రగడ పరువు పోయింది. ఐతే రాజకీయ నాయకులు ఎన్నికల ముంగిట ఇలాంటి సవాళ్లు చేయడం.. తర్వాత చప్పుడు చేయకుండా ఉండిపోవడం మామూలే. కానీ ముద్రగడ మాత్రం తన సవాల్కు కట్టుబడ్డారు. తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకోవడానికి కొన్ని రోజుల కిందటే అధికార ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ప్రకియ అంతా పూర్తయి ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది.
ముద్రగడ పద్మనాభం పేరు ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా మారినట్లు ఇందులో పేర్కొన్నారు. ఇక నుంచి ఆయన్ని అందరూ ‘పద్మనాభరెడ్డి’గానే పిలవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఉదయం నుంచి ఈ వార్తే హాట్ టాపిక్గా మారింది. పేరు మార్పు సవాల్ విషయంలో ముద్రగడ ఇంత పట్టుదలకు పోయారేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on June 20, 2024 11:05 am
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…