విశాఖపట్నం జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసిన ప్యాలెస్ నిర్మాణంపై విమర్శలు ప్రతి విమ ర్శలు కూడా వచ్చాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యదుమారం కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ విసయంలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల జోక్యం చేసుకున్నారు. రుషి కొండ నిర్మాణాలు అక్రమమని భావిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని సర్కారును కోరారు. తాజాగా ఆమె స్పందిస్తూ.. రుషికొండ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఇక, తాను ఓడిపోవడానికివైసీపీనే కారణమని వ్యాఖ్యానించారు. కడపలో సిట్టింగ్ ఎంపీ డబ్బులు పారించా రని.. దీనికి తోడు బెదిరింపులకు కూడా గురి చేశారని..అందుకే తాను ఓడిపోయానని చెప్పారు. హంతకు లు పార్లమెంటుకు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే తాను పోటీ చేసినట్టు ఆమె వివరించారు. అయితే.. ప్రజలు వైసీపీకి భయపడే పరిస్థితిని కల్పించారని చెప్పారు. ఇప్పుడు వైసీపీ బుట్టదాఖలైందని.. ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని అన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు కాలం నడుస్తోందని షర్మిల అన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు నిలబడడానికి చంద్రబాబే కారణమని.. ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంటు.. విభజన చట్టంలోని అంశాలను రాబట్టుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆయన అమలు చేయాలని చెప్పారు. అయితే.. ఇప్పుడే తాము ఒత్తిడి చేయబోమని.. కొంత సమయం ఇస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ను ప్రజలు గుర్తించారని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రె స్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకును సీట్లను కూడా పెంచుకుంటామన్నారు. వైసీపీ ఓడిపోయినా.. ఆ పార్టీ నాయకులకు ఇంకా తెలివి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్నట్టు షర్మిల చెప్పారు.
This post was last modified on June 19, 2024 10:12 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…