విశాఖపట్నం జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసిన ప్యాలెస్ నిర్మాణంపై విమర్శలు ప్రతి విమ ర్శలు కూడా వచ్చాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యదుమారం కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ విసయంలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల జోక్యం చేసుకున్నారు. రుషి కొండ నిర్మాణాలు అక్రమమని భావిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని సర్కారును కోరారు. తాజాగా ఆమె స్పందిస్తూ.. రుషికొండ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఇక, తాను ఓడిపోవడానికివైసీపీనే కారణమని వ్యాఖ్యానించారు. కడపలో సిట్టింగ్ ఎంపీ డబ్బులు పారించా రని.. దీనికి తోడు బెదిరింపులకు కూడా గురి చేశారని..అందుకే తాను ఓడిపోయానని చెప్పారు. హంతకు లు పార్లమెంటుకు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే తాను పోటీ చేసినట్టు ఆమె వివరించారు. అయితే.. ప్రజలు వైసీపీకి భయపడే పరిస్థితిని కల్పించారని చెప్పారు. ఇప్పుడు వైసీపీ బుట్టదాఖలైందని.. ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని అన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు కాలం నడుస్తోందని షర్మిల అన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు నిలబడడానికి చంద్రబాబే కారణమని.. ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంటు.. విభజన చట్టంలోని అంశాలను రాబట్టుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆయన అమలు చేయాలని చెప్పారు. అయితే.. ఇప్పుడే తాము ఒత్తిడి చేయబోమని.. కొంత సమయం ఇస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ను ప్రజలు గుర్తించారని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రె స్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకును సీట్లను కూడా పెంచుకుంటామన్నారు. వైసీపీ ఓడిపోయినా.. ఆ పార్టీ నాయకులకు ఇంకా తెలివి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్నట్టు షర్మిల చెప్పారు.
This post was last modified on June 19, 2024 10:12 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…