Political News

`రుషికొండ‌` నిర్మాణాల‌పై ష‌ర్మిల హాట్ కామెంట్స్‌!

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో తీవ్ర రాజ‌కీయ దుమారానికి దారితీసిన ప్యాలెస్ నిర్మాణంపై విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ ర్శలు కూడా వ‌చ్చాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య‌దుమారం కొన‌సాగుతోంది. అయితే.. ఇప్పుడు ఈ విస‌యంలో కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల జోక్యం చేసుకున్నారు. రుషి కొండ నిర్మాణాలు అక్ర‌మ‌మ‌ని భావిస్తున్న నేప‌థ్యంలో సిట్టింగ్ జ‌డ్జితో ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని స‌ర్కారును కోరారు. తాజాగా ఆమె స్పందిస్తూ.. రుషికొండ వ్య‌వ‌హారాన్ని నిగ్గు తేల్చాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

ఇక‌, తాను ఓడిపోవ‌డానికివైసీపీనే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. క‌డ‌ప‌లో సిట్టింగ్ ఎంపీ డ‌బ్బులు పారించా ర‌ని.. దీనికి తోడు బెదిరింపుల‌కు కూడా గురి చేశార‌ని..అందుకే తాను ఓడిపోయాన‌ని చెప్పారు. హంత‌కు లు పార్ల‌మెంటుకు వెళ్ల‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే తాను పోటీ చేసిన‌ట్టు ఆమె వివ‌రించారు. అయితే.. ప్ర‌జ‌లు వైసీపీకి భ‌య‌ప‌డే ప‌రిస్థితిని క‌ల్పించార‌ని చెప్పారు. ఇప్పుడు వైసీపీ బుట్ట‌దాఖ‌లైంద‌ని.. ఆ పార్టీ గురించి మాట్లాడుకోవ‌డం వేస్ట్ అని అన్నారు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కాలం న‌డుస్తోంద‌ని ష‌ర్మిల అన్నారు. కేంద్రంలో మోడీ స‌ర్కారు నిల‌బ‌డడానికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని.. ఆయ‌న వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రించి.. ప్ర‌త్యేక హోదా, స్టీల్ ప్లాంటు.. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను రాబ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌న్నారు. అదేవిధంగా ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను ఆయ‌న అమ‌లు చేయాల‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడే తాము ఒత్తిడి చేయ‌బోమ‌ని.. కొంత స‌మ‌యం ఇస్తామ‌ని చెప్పారు.

రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లు గుర్తించార‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాంగ్రె స్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఎదుగుతుంద‌ని ష‌ర్మిల ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఓటు బ్యాంకును సీట్ల‌ను కూడా పెంచుకుంటామ‌న్నారు. వైసీపీ ఓడిపోయినా.. ఆ పార్టీ నాయ‌కుల‌కు ఇంకా తెలివి రాలేద‌ని వ్యాఖ్యానించారు. ఆ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని వెలికి తీయాల‌ని కాంగ్రెస్ పార్టీ సూచిస్తున్న‌ట్టు ష‌ర్మిల చెప్పారు. 

This post was last modified on June 19, 2024 10:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago