Political News

రోజాకు అంత భయమేల?

అసలే ఎన్నికల్లో ఘోర పరాజయం తాలూకు అవమాన భారంతో ఉన్నారు జగన్ అండ్ కో. ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రుషికొండ మీద ఏకంగా రూ.550 కోట్ల ఖర్చుతో జగన్ కుటుంబం కోసం విలాసవంతంగా నిర్మించుకున్న భవనాల వ్యవహారంతో వైసీపీ పరువు పోతోంది. జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది.

అధికారంలో ఉండగా జగన్, అమర్‌నాథ్ లాంటి మంత్రులు.. అవి సీఎం కోసం నియమిస్తున్న భవనాలని నొక్కి వక్కాణించారు. కానీ ఇప్పుడేమో అవి ప్రభుత్వ భవనాలని, టూరిజం కోసమని, అతిథుల కోసం కట్టారని మాట మారుస్తున్నారు. తాజాగా రోజా ఈ వ్యవహారంపై ట్విట్టర్ పోస్టు కూడా పెట్టింది. కానీ ఆమెను కౌంటర్ చేద్దామని చూస్తున్న నెటిజన్లకు కామెంట్లు పెట్టే అవకాశం మాత్రం లేకపోయింది.

ఎన్నికలు అయిన దగ్గర్నుంచి రోజా తన కామెంట్ బాక్స్‌ను క్లోజ్ చేసి పెట్టేసింది. తన పోస్టులకు ఎవ్వరూ స్పందించే అవకాశం లేకుండా చేసింది. తన పట్ల జనాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో రోజాకు బాగానే అర్థమైనట్లుంది. అందుకే తన ఏ పోస్టుకూ ఎవ్వరూ కామెంట్ చేయలేని విధంగా చూసుకుంది. నిజంగా తన వాదనలో, తన పోస్టుల్లో నిజం ఉందని అనిపిస్తే.. దాని మీద ఎవ్వరైనా కౌంటర్లు వేసినా సమాధానం చెప్పుకోగలగాలి. కానీ కేవలం తన వెర్షన్ మాత్రం వినిపించి.. ఎవ్వరూ దానికి సమాధానం చెప్పలేని విధంగా చేసుకోవడం అంటే వాదనలో పస లేనట్లే కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

రోజా మాత్రమే కాదు.. వైసీపీకి భజన చేయడం ద్వారా జనాల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న కోన వెంకట్ లాంటి వైసీపీ మద్దతుదారులు సైతం కామెంట్ బాక్స్ క్లోజ్ చేసి పోస్టులు పెడుతుండడం గమనార్హం.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

1 hour ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

6 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

8 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

8 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

10 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

12 hours ago