Political News

ఒక్క ఓట‌మి.. జ‌గ‌న్‌ వ్యాపారాల‌పైనా ఎఫెక్ట్‌..!

ఒక్క ఓట‌మి ఒకే ఒక్క ఓట‌మి.. వైసీపీ అధినేత‌, తాజా మాజీ సీఎం జ‌గ‌న్‌ను మాన‌సికంగానే కాకుండా.. ఇమేజ్ ప‌రంగా కూడా దెబ్బేసేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వా త‌.. కూడా జ‌గ‌న్ వ్యాపారవేత్త అనే విష‌యం తెలిసిందే. సిమెంటు, క‌రెంటు స‌హా.. మీడియా రంగంలోనూ ఆయ‌న వ్యాపారాలు ఉన్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు.. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు కూడా.. అవి నిర్విఘ్నంగా సాగాయి. ఇక‌, అధికారపక్షంలోకి రావ‌డంతో వ్యాపారాలు పంజుకున్నాయి.

గ‌త ఐదేళ్ల‌లో జ‌గ‌న్ మీడియా సంస్థ‌లు సాక్షి ప‌త్రిక‌, చానెళ్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. ప్ర‌భుత్వం నుంచి అందిన ద‌న్ను.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన మ‌ద్ద‌తుతో ప‌త్రిక స‌ర్క్యులేష‌న్ పెరిగిపోయింది. అదేస‌మయంలో స‌ర్కారు నుంచి యాడ్స్ రూపంలోనూ కోట్ల‌కు కోట్ల రూపాయ‌ల సొమ్ములు వ‌చ్చాయి. ఇక‌, సిమెంటు వ్యాపారం కూడా.. పుంజుకుంది. విద్యుత్ రంగంలోనూ సొమ్ములు బాగానే అందాయి. లాభాలు క‌నిపించాయి. దీంతో ఇక తిరుగులేద‌ని అనుకున్నారు. విస్త‌ర‌ణ‌కు కూడా ప్లాన్‌చేశారు.

కానీ, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోవైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా కూడా ద‌క్కించుకోలేక పోయింది. దీంతో ఈ ప్ర‌భావం వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌తంగానే కాకుండా.. వ్యాపార ప‌రంగా కూడా ప్ర‌భావం చూపిస్తోంది. ఎన్నిక‌ల వ‌ర‌కు.. 14 ల‌క్ష‌లుగా ఉన్న సాక్షి ప‌త్రిక స‌ర్క్యులేష‌న్ ఇప్పుడు ఒక్క‌సారిగా 10 ల‌క్ష‌ల చిల్ల‌ర‌కు ప‌డిపోయింది. యాడ్స్ కూడా త‌గ్గిపోయాయి. దీంతో ప‌త్రిక‌లో సిబ్బందిని త‌గ్గించే ప్లాన్ చేస్తున్నారు.

ఇక‌, సిమెంటు, క‌రెంటు వ్యాపారాలు కూడా.. స‌గానికి స‌గం ప‌డిపోయాయి. ముఖ్యంగా భార‌తి సిమెంటును కొనుగోలు చేసేందుకు గ‌తంలో పొరుగు రాష్ట్రాలు ఇంట్ర‌స్ట్ చూపించాయి. వైసీపీ స‌ర్కారుతో ప‌నులు ఉన్న నేప‌థ్యంలో దీనిని కొనుగోలు చేశార‌నే విమ‌ర్శ‌లు తెలంగాణ‌లోనూ వినిపించాయి. అయితే..ఏపీలో స‌ర్కారు మార‌డంతో అదే ప్ర‌భావం ఇప్పుడు రివ‌ర్స్ అవుతుంద‌ని అంచ‌నా వేసి.. దీనికి సంబంధించిన కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేసుకుంటున్నాయి.

ఉత్త‌రాఖండ్‌లో విద్యుత్ సంస్థ‌ల నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయ‌ని స‌మాచారం. దీంతో జ‌గ‌న్‌ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి పెట్టారు. ఏదేమైనా ఒక్క ఓట‌మి ఆయ‌న వ్యాపారాల‌పైనా ప్ర‌భావం చూపించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న కుటుంబానికి చెందిన హెరిటేజ్ చైన్ బిజినెస్ పుంజుకుంది. షేర్లు స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on June 19, 2024 9:34 am

Share

Recent Posts

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

5 hours ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

6 hours ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

7 hours ago

ప్యారడైజ్ టీం కాయదును హర్ట్ చేసిందా?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…

8 hours ago

రెండు పొరపాట్లు ఇంత మూల్యాన్ని చెల్లించాయి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…

8 hours ago

దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి రద్దు!

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అన‌ర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ విష‌యాన్ని అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్…

10 hours ago