ఒక్క ఓటమి ఒకే ఒక్క ఓటమి.. వైసీపీ అధినేత, తాజా మాజీ సీఎం జగన్ను మానసికంగానే కాకుండా.. ఇమేజ్ పరంగా కూడా దెబ్బేసేసిందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లోకి రాకముందు.. వచ్చిన తర్వా త.. కూడా జగన్ వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే. సిమెంటు, కరెంటు సహా.. మీడియా రంగంలోనూ ఆయన వ్యాపారాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు.. రాజకీయాల్లోకి రాకముందు కూడా.. అవి నిర్విఘ్నంగా సాగాయి. ఇక, అధికారపక్షంలోకి రావడంతో వ్యాపారాలు పంజుకున్నాయి.
గత ఐదేళ్లలో జగన్ మీడియా సంస్థలు సాక్షి పత్రిక, చానెళ్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. ప్రభుత్వం నుంచి అందిన దన్ను.. ప్రజల నుంచి వచ్చిన మద్దతుతో పత్రిక సర్క్యులేషన్ పెరిగిపోయింది. అదేసమయంలో సర్కారు నుంచి యాడ్స్ రూపంలోనూ కోట్లకు కోట్ల రూపాయల సొమ్ములు వచ్చాయి. ఇక, సిమెంటు వ్యాపారం కూడా.. పుంజుకుంది. విద్యుత్ రంగంలోనూ సొమ్ములు బాగానే అందాయి. లాభాలు కనిపించాయి. దీంతో ఇక తిరుగులేదని అనుకున్నారు. విస్తరణకు కూడా ప్లాన్చేశారు.
కానీ, తాజాగా జరిగిన ఎన్నికల్లోవైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేక పోయింది. దీంతో ఈ ప్రభావం వైసీపీ అధినేత జగన్పై వ్యక్తిగతంగానే కాకుండా.. వ్యాపార పరంగా కూడా ప్రభావం చూపిస్తోంది. ఎన్నికల వరకు.. 14 లక్షలుగా ఉన్న సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఇప్పుడు ఒక్కసారిగా 10 లక్షల చిల్లరకు పడిపోయింది. యాడ్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో పత్రికలో సిబ్బందిని తగ్గించే ప్లాన్ చేస్తున్నారు.
ఇక, సిమెంటు, కరెంటు వ్యాపారాలు కూడా.. సగానికి సగం పడిపోయాయి. ముఖ్యంగా భారతి సిమెంటును కొనుగోలు చేసేందుకు గతంలో పొరుగు రాష్ట్రాలు ఇంట్రస్ట్ చూపించాయి. వైసీపీ సర్కారుతో పనులు ఉన్న నేపథ్యంలో దీనిని కొనుగోలు చేశారనే విమర్శలు తెలంగాణలోనూ వినిపించాయి. అయితే..ఏపీలో సర్కారు మారడంతో అదే ప్రభావం ఇప్పుడు రివర్స్ అవుతుందని అంచనా వేసి.. దీనికి సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేసుకుంటున్నాయి.
ఉత్తరాఖండ్లో విద్యుత్ సంస్థల నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయని సమాచారం. దీంతో జగన్ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఏదేమైనా ఒక్క ఓటమి ఆయన వ్యాపారాలపైనా ప్రభావం చూపించడం గమనార్హం. ఇక, ఇదేసమయంలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ చైన్ బిజినెస్ పుంజుకుంది. షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…