Political News

ఒక్క ఓట‌మి.. జ‌గ‌న్‌ వ్యాపారాల‌పైనా ఎఫెక్ట్‌..!

ఒక్క ఓట‌మి ఒకే ఒక్క ఓట‌మి.. వైసీపీ అధినేత‌, తాజా మాజీ సీఎం జ‌గ‌న్‌ను మాన‌సికంగానే కాకుండా.. ఇమేజ్ ప‌రంగా కూడా దెబ్బేసేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వా త‌.. కూడా జ‌గ‌న్ వ్యాపారవేత్త అనే విష‌యం తెలిసిందే. సిమెంటు, క‌రెంటు స‌హా.. మీడియా రంగంలోనూ ఆయ‌న వ్యాపారాలు ఉన్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు.. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు కూడా.. అవి నిర్విఘ్నంగా సాగాయి. ఇక‌, అధికారపక్షంలోకి రావ‌డంతో వ్యాపారాలు పంజుకున్నాయి.

గ‌త ఐదేళ్ల‌లో జ‌గ‌న్ మీడియా సంస్థ‌లు సాక్షి ప‌త్రిక‌, చానెళ్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. ప్ర‌భుత్వం నుంచి అందిన ద‌న్ను.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన మ‌ద్ద‌తుతో ప‌త్రిక స‌ర్క్యులేష‌న్ పెరిగిపోయింది. అదేస‌మయంలో స‌ర్కారు నుంచి యాడ్స్ రూపంలోనూ కోట్ల‌కు కోట్ల రూపాయ‌ల సొమ్ములు వ‌చ్చాయి. ఇక‌, సిమెంటు వ్యాపారం కూడా.. పుంజుకుంది. విద్యుత్ రంగంలోనూ సొమ్ములు బాగానే అందాయి. లాభాలు క‌నిపించాయి. దీంతో ఇక తిరుగులేద‌ని అనుకున్నారు. విస్త‌ర‌ణ‌కు కూడా ప్లాన్‌చేశారు.

కానీ, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోవైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా కూడా ద‌క్కించుకోలేక పోయింది. దీంతో ఈ ప్ర‌భావం వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌తంగానే కాకుండా.. వ్యాపార ప‌రంగా కూడా ప్ర‌భావం చూపిస్తోంది. ఎన్నిక‌ల వ‌ర‌కు.. 14 ల‌క్ష‌లుగా ఉన్న సాక్షి ప‌త్రిక స‌ర్క్యులేష‌న్ ఇప్పుడు ఒక్క‌సారిగా 10 ల‌క్ష‌ల చిల్ల‌ర‌కు ప‌డిపోయింది. యాడ్స్ కూడా త‌గ్గిపోయాయి. దీంతో ప‌త్రిక‌లో సిబ్బందిని త‌గ్గించే ప్లాన్ చేస్తున్నారు.

ఇక‌, సిమెంటు, క‌రెంటు వ్యాపారాలు కూడా.. స‌గానికి స‌గం ప‌డిపోయాయి. ముఖ్యంగా భార‌తి సిమెంటును కొనుగోలు చేసేందుకు గ‌తంలో పొరుగు రాష్ట్రాలు ఇంట్ర‌స్ట్ చూపించాయి. వైసీపీ స‌ర్కారుతో ప‌నులు ఉన్న నేప‌థ్యంలో దీనిని కొనుగోలు చేశార‌నే విమ‌ర్శ‌లు తెలంగాణ‌లోనూ వినిపించాయి. అయితే..ఏపీలో స‌ర్కారు మార‌డంతో అదే ప్ర‌భావం ఇప్పుడు రివ‌ర్స్ అవుతుంద‌ని అంచ‌నా వేసి.. దీనికి సంబంధించిన కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేసుకుంటున్నాయి.

ఉత్త‌రాఖండ్‌లో విద్యుత్ సంస్థ‌ల నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయ‌ని స‌మాచారం. దీంతో జ‌గ‌న్‌ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి పెట్టారు. ఏదేమైనా ఒక్క ఓట‌మి ఆయ‌న వ్యాపారాల‌పైనా ప్ర‌భావం చూపించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న కుటుంబానికి చెందిన హెరిటేజ్ చైన్ బిజినెస్ పుంజుకుంది. షేర్లు స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on June 19, 2024 9:34 am

Share

Recent Posts

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

5 minutes ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

3 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

5 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

6 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

6 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

7 hours ago