Political News

ఒక్క ఓట‌మి.. జ‌గ‌న్‌ వ్యాపారాల‌పైనా ఎఫెక్ట్‌..!

ఒక్క ఓట‌మి ఒకే ఒక్క ఓట‌మి.. వైసీపీ అధినేత‌, తాజా మాజీ సీఎం జ‌గ‌న్‌ను మాన‌సికంగానే కాకుండా.. ఇమేజ్ ప‌రంగా కూడా దెబ్బేసేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వా త‌.. కూడా జ‌గ‌న్ వ్యాపారవేత్త అనే విష‌యం తెలిసిందే. సిమెంటు, క‌రెంటు స‌హా.. మీడియా రంగంలోనూ ఆయ‌న వ్యాపారాలు ఉన్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు.. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు కూడా.. అవి నిర్విఘ్నంగా సాగాయి. ఇక‌, అధికారపక్షంలోకి రావ‌డంతో వ్యాపారాలు పంజుకున్నాయి.

గ‌త ఐదేళ్ల‌లో జ‌గ‌న్ మీడియా సంస్థ‌లు సాక్షి ప‌త్రిక‌, చానెళ్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. ప్ర‌భుత్వం నుంచి అందిన ద‌న్ను.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన మ‌ద్ద‌తుతో ప‌త్రిక స‌ర్క్యులేష‌న్ పెరిగిపోయింది. అదేస‌మయంలో స‌ర్కారు నుంచి యాడ్స్ రూపంలోనూ కోట్ల‌కు కోట్ల రూపాయ‌ల సొమ్ములు వ‌చ్చాయి. ఇక‌, సిమెంటు వ్యాపారం కూడా.. పుంజుకుంది. విద్యుత్ రంగంలోనూ సొమ్ములు బాగానే అందాయి. లాభాలు క‌నిపించాయి. దీంతో ఇక తిరుగులేద‌ని అనుకున్నారు. విస్త‌ర‌ణ‌కు కూడా ప్లాన్‌చేశారు.

కానీ, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోవైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కనీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా కూడా ద‌క్కించుకోలేక పోయింది. దీంతో ఈ ప్ర‌భావం వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌తంగానే కాకుండా.. వ్యాపార ప‌రంగా కూడా ప్ర‌భావం చూపిస్తోంది. ఎన్నిక‌ల వ‌ర‌కు.. 14 ల‌క్ష‌లుగా ఉన్న సాక్షి ప‌త్రిక స‌ర్క్యులేష‌న్ ఇప్పుడు ఒక్క‌సారిగా 10 ల‌క్ష‌ల చిల్ల‌ర‌కు ప‌డిపోయింది. యాడ్స్ కూడా త‌గ్గిపోయాయి. దీంతో ప‌త్రిక‌లో సిబ్బందిని త‌గ్గించే ప్లాన్ చేస్తున్నారు.

ఇక‌, సిమెంటు, క‌రెంటు వ్యాపారాలు కూడా.. స‌గానికి స‌గం ప‌డిపోయాయి. ముఖ్యంగా భార‌తి సిమెంటును కొనుగోలు చేసేందుకు గ‌తంలో పొరుగు రాష్ట్రాలు ఇంట్ర‌స్ట్ చూపించాయి. వైసీపీ స‌ర్కారుతో ప‌నులు ఉన్న నేప‌థ్యంలో దీనిని కొనుగోలు చేశార‌నే విమ‌ర్శ‌లు తెలంగాణ‌లోనూ వినిపించాయి. అయితే..ఏపీలో స‌ర్కారు మార‌డంతో అదే ప్ర‌భావం ఇప్పుడు రివ‌ర్స్ అవుతుంద‌ని అంచ‌నా వేసి.. దీనికి సంబంధించిన కాంట్రాక్టుల‌ను ర‌ద్దు చేసుకుంటున్నాయి.

ఉత్త‌రాఖండ్‌లో విద్యుత్ సంస్థ‌ల నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయ‌ని స‌మాచారం. దీంతో జ‌గ‌న్‌ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి పెట్టారు. ఏదేమైనా ఒక్క ఓట‌మి ఆయ‌న వ్యాపారాల‌పైనా ప్ర‌భావం చూపించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న కుటుంబానికి చెందిన హెరిటేజ్ చైన్ బిజినెస్ పుంజుకుంది. షేర్లు స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on June 19, 2024 9:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago