ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం, స్పీకర్ ఎంపిక కోసం ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై వెళ్లడంతో జూన్ 24 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను నిర్వహించాలని అనుకున్నారు.
కానీ, తాజాగా ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 21, 22 తేదీలలో శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజులపాటు జరగబోయే సమావేశాలలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంపిక లాంఛనమే అని తెలుస్తోంది. ఇక, జనసేన నుంచి డిప్యూటీ స్పీకర్ గా లోకం మాధవిని ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్ గా పొన్నూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్రను నియమించబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…