Political News

జాగ్ర‌త్త ప‌డుతున్న జ‌గ‌న్..

ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బొక్క బోర్లా ప‌డ్డా వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఇన్నాళ్ల‌కు వాస్త‌వం గ్ర‌హించారు. పార్టీ అంటే.. కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాలు కాద‌ని.. పార్టీ అంటే.. నాయ‌కుల‌ని ఆయ‌న గుర్తించిన‌ట్టున్నారు. ఈ క్ర‌మంలోనే నాయ‌కులను కాపాడుకునేందుకు తంటాలు ప‌డుతున్నారు. తాజాగా పార్టీ నేత‌ల‌తో విస్తృత స్థాయి స‌మావేశానికి జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఈ నెల 19న తాడేప‌ల్లి లోని క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ నాయ‌కుల‌తో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు పోటీ చేసి ఓడిన అభ్యర్ధులందరినీ కూడా ఆహ్వనించారు.

వీరితో పాటు పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిన అభ్యర్ధులను కూడా ఆహ్వనించారు. అంద‌రూ విదిగా హాజ‌రు కావాలంటూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో జ‌గ‌న్ వారిని ప‌క్క చూపులు చూడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం పార్టీలో నాయకులు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేసుకుంటున్నారు. వ‌చ్చే ఐదేళ్లు కూడా.. పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితి ఎదురు కానుంది. ఇది త‌ప్ప‌దు. క‌క్ష పూరిత రాజ‌కీయాలు, కుట్ర పూరిత రాజ‌కీయాలు లేక‌పోయినా.. వారు గ‌తంలో చేసిన నిర్వాకాల‌పై విచార‌ణ‌లు, చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు ఉంటాయ‌నే చ‌ర్చ సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీలో ఓడిపోయి.. వివాదాల‌కు కేంద్రంగా ముద్ర‌ప‌డిన నాయ‌కులు ప‌లువురు.. త‌మ ఇల్లు చ‌క్క‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు.. ఏవైనా కూడా.. నాయ‌కులు ఇప్పుడు వైసీపీలో ఉంటే సేఫ్ కాద‌ని భావిస్తున్నారు. దీంతో పార్టీ మార్పు దిశ‌గా అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు చేస్తున్నారు. దీనిని ప‌సిగ‌ట్టిన‌.. వైసీపీ అధిష్టానం.. చేతనైనంత వ‌ర‌కు పార్టీ నాయ‌కుల‌ను కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. గ‌తంలో పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం అంటే.. ఏళ్ల‌కు ఏళ్లు స‌మ‌యం తీసుకున్న జ‌గ‌న్‌..ఇప్పుడు పార్టీ ఓడిన 15 రోజుల్లోనే ఈ త‌ర‌హా స‌మావేశం ఏర్పాటు చేయ‌డం వెనుక పార్టీ నేత‌ల‌ను నిల‌బెట్టుకోవ‌డ‌మే అజెండా అనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.

This post was last modified on June 18, 2024 2:32 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago