Political News

వైసీపీకి ‘క‌ర్మ ఫ‌లం’: సీమెన్స్ మాజీ ఎండీ

ఏపీలో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 90 వేలు, 80 వేలు , 70 వేల ఓట్ల తేడాతో వైసీపీ నాయ‌కులు మ‌ట్టిక‌రిచారు. ప్ర‌భుత్వం కూలిపోయింది. అయితే.. ఇది రాజ‌కీయంగా ఇప్ప‌టి వ‌ర‌కు అధికార‌ప‌క్ష నాయకులు చేసిన విమ‌ర్శ‌లు. కానీ, ఇప్పుడు కార్పొరేట్ దిగ్గ‌జం.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్‌.. త‌న‌దైన శైలిలో వైసీపీని ఎండ‌గ‌ట్టారు. ‘క‌ర్మ ఫ‌లం’ అనుభ‌విస్తున్నారు అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు. ‘ఏపీలో న్యాయం గెలుస్తుందని నేను చెప్పిన మాటలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిజం చేశారు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదీ.. వైసీపీ క‌ర్మ‌ఫ‌లం.. చేసినందుకు అనుభ‌విస్తోంద‌ని వ్యాఖ్యానించారు. సార్వ‌త్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు సుమన్ బోస్ శుభాకాంక్ష‌లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లాల‌ని తాను మ‌న‌సారా కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. అయితే.. ఆయ‌న వైసీపీపై ఇలా ‘క‌ర్మ‌ఫ‌లం'(చెడు చేసినందుకు అనుభ‌వించడం అనే అర్ధం) అని కామెంట్లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

ఏంటి కార‌ణం?

గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసింది. దీనికి సీమెన్స్ కంపెనీని అప్ప‌ట్లో చంద్ర‌బాబు స‌ర్కారు వినియోగించుకుంది. అప్ప‌ట్లో ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ కంపెనీతో క‌లిసి ప‌నులు చేయించారు. అయితే.. వైసీపీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ లో అవినీతి జ‌రిగింద‌ని.. సీమెన్స్ కంపెనీకి రూ.300 కోట్ల‌ను ముందుగానే చెల్లించార‌ని.. అటు నుంచి తిరిగి మ‌ళ్లీ టీడీపీ ఖాతాలోకే ఈ సొమ్ములు వ‌చ్చాయ‌ని పేర్కొంటూ.. చంద్ర‌బాబుపై కేసులు పెట్టి జైలుకు పంపించిన విష‌యం తెలిసిందే.

దీంతో ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే సీమెన్స్ మాజీ ఎండీగా ఉన్న సుమ‌న్ బోస్‌.. హైద‌రాబాద్‌లో పెద్ద మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి.. తాము తీసుకున్న సొమ్ము రూ.300ల‌కు ర‌సీదులు ఉన్నాయ‌ని.. అధికారికంగానే త‌మ‌కు సొమ్ములు అందాయ‌ని.. చంద్ర‌బాబు అవినీతి చేయ‌లేద‌ని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా జీవితంలో తాను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలకు తీవ్ర విఘాతం కలిగింద న్నారు. అంతేకాదు దీని ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు.

సంబంధిత‌ ప‌త్రాల‌ను కూడా.. చూపించే ప్ర‌య‌త్నం చేశారు. రూ.70 కోట్ల వ‌ర‌కు ప‌త్రాలు చూపించారు. అయితే.. దీనిని అప్ప‌ట్లో వైసీపీ త‌ప్పుబ‌ట్టి.. సుమన్‌బోసు కూడా అవినీతి ప‌రుడే అంటూ.. అప్ప‌టి మంత్రులు వ్యాఖ్యానించారు. దీంతో అప్ప‌ట్లోసైలెంట్ అయిన‌.. బోస్‌.. తాజాగా రియాక్ట్ అయ్యారు. త‌మ‌ను అన‌వ‌స‌రంగా నిందించి.. అభాసు పాలు చేసిన వైసీపీ క‌ర్మ‌ఫ‌లం అనుభ‌విస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

This post was last modified on June 17, 2024 2:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago