టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక కార్యాచరణ దిశగా వడివడి అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా దీర్ఘకాలం పాటు పట్టే ప్రాజక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదాహరణకు సాగు నీటి ప్రాజెక్టులు.. పూర్తయ్యేందుకు కనీసంలో కనీసం.. రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోగా తుఫానులు.. వరదలు వంటివి వస్తే.. మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వీటిని ఇప్పటి నుంచే చేపట్టడం ద్వారా.. సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
ప్రధానంగా పోలవరం.. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా… ఉత్తరాంధ్ర నుంచి కోస్తా జిల్లాల వరకు కూడా సాగు నీటి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. ఇదేసమయంలో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్నా.. ఏ ప్రభుత్వమూ పూర్తిచేయలేక పోయిందనే వాదనను తుడిచిపెట్టేసేందుకు కూడా సాధ్యమవుతుంది. అందుకే చంద్రబాబు సోమవారం.. సోమవారం ఆ ప్రాజెక్టు పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. తద్వారా పనులు వేగంగా జరుగుతాయని ఆయన ఆశిస్తున్నారు.
ఇక, కడప ఉక్కు పరిశ్రమకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టును కూడా.. ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కేంద్రంలో గనుల శాఖ సహాయ మంత్రిగా ఏపీకి చెందిన నాయకుడే ఉన్న నేపథ్యంలో ఈ పనులు త్వరగా పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా.. కడప సహా సీమలో నిరుద్యోగం కొంత వరకు తగ్గడంతోపాటు.. పార్టీకి కూడా మంచి ఊపు వస్తుంది. ఇదేసమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా కూడా … చూడాలని నిర్ణయించారు.
ముఖ్యంగా వచ్చే 100 రోజుల్లో కీలక సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ద్వారా.. భవిష్యత్తులో పార్టీకి.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే కార్యాచరణకు చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. ఏదో ఎన్నికలకు ముందు ప్రాజెక్టులను చేపట్టడం కాకుండా.. ముందుగానే వీటిని పూర్తి చేయడం ద్వారా.. ప్రజల్లో మేలైనా ఆశావహాన్ని సాధించవచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైర్లో కూర్చున్న వెంటనే చంద్రబాబు రాష్ట్ర ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే.. ఇక, ఏపీకి సాగునీటి రంగంలో ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోతాయి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…