టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక కార్యాచరణ దిశగా వడివడి అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా దీర్ఘకాలం పాటు పట్టే ప్రాజక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదాహరణకు సాగు నీటి ప్రాజెక్టులు.. పూర్తయ్యేందుకు కనీసంలో కనీసం.. రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోగా తుఫానులు.. వరదలు వంటివి వస్తే.. మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వీటిని ఇప్పటి నుంచే చేపట్టడం ద్వారా.. సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
ప్రధానంగా పోలవరం.. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా… ఉత్తరాంధ్ర నుంచి కోస్తా జిల్లాల వరకు కూడా సాగు నీటి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. ఇదేసమయంలో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్నా.. ఏ ప్రభుత్వమూ పూర్తిచేయలేక పోయిందనే వాదనను తుడిచిపెట్టేసేందుకు కూడా సాధ్యమవుతుంది. అందుకే చంద్రబాబు సోమవారం.. సోమవారం ఆ ప్రాజెక్టు పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. తద్వారా పనులు వేగంగా జరుగుతాయని ఆయన ఆశిస్తున్నారు.
ఇక, కడప ఉక్కు పరిశ్రమకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టును కూడా.. ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కేంద్రంలో గనుల శాఖ సహాయ మంత్రిగా ఏపీకి చెందిన నాయకుడే ఉన్న నేపథ్యంలో ఈ పనులు త్వరగా పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా.. కడప సహా సీమలో నిరుద్యోగం కొంత వరకు తగ్గడంతోపాటు.. పార్టీకి కూడా మంచి ఊపు వస్తుంది. ఇదేసమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా కూడా … చూడాలని నిర్ణయించారు.
ముఖ్యంగా వచ్చే 100 రోజుల్లో కీలక సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ద్వారా.. భవిష్యత్తులో పార్టీకి.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే కార్యాచరణకు చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. ఏదో ఎన్నికలకు ముందు ప్రాజెక్టులను చేపట్టడం కాకుండా.. ముందుగానే వీటిని పూర్తి చేయడం ద్వారా.. ప్రజల్లో మేలైనా ఆశావహాన్ని సాధించవచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైర్లో కూర్చున్న వెంటనే చంద్రబాబు రాష్ట్ర ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే.. ఇక, ఏపీకి సాగునీటి రంగంలో ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోతాయి.
This post was last modified on June 17, 2024 10:53 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…