విశాఖపట్నం సాగర తీరంలో ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషి కొండను తొలిచి.. గత వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. పర్యావరణాన్ని ఛిద్రం చేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెట్టినా.. పర్యావరణ ప్రేమికులు నెత్తీ నోరూ బాదుకున్నా.. వినకుండా.. జగన్ సర్కారు ముందుకు సాగింది. ఒకానొక దశలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “చెట్టు పోతే పెంచగలం.. కొండ కొట్టేస్తే.. పెంచడం సాధ్యమేనా?“ అని నిలదీసింది.
అయినప్పటికీ.. జగన్ మారలేదు. టీడీపీ నేతల లెక్కల ప్రకారం 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఇక్కడి నిర్మాణాలు చేపట్టారు. విలాసవంతమైన భవనాలు నిర్మించారు. అదేమంటే.. ప్రభుత్వ అవసరాల కోసమని అప్పట్లో వైసీపీ పెద్దలు తీర్పులు చెప్పారు.
ఇక, వీటిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కథక థలుగా ప్రతిపక్షాలు చెప్పుకొచ్చాయి. బాత్ రూమ్ కమోడ్స్ నుంచి టైల్స్ వరకు.. అంతర్జాతీయంగా తెప్పించినవేనని అంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకిని కూడా.. ఇక్కడ వాలనివ్వలేదు.
కానీ, ఓడలు బళ్లయ్యాయి. వైసీపీ వీగిపోయింది. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఫలితంగా.. రుచికొండపై ఆంక్షలు ఎత్తేశారు. ఒకప్పుడు డీసీపీ స్తాయి అధికారిని.. పది మంది సీఐలను కూడా ఇక్కడ నియమించారు. ఈగ వాలితే కేసు పెట్టేశారు.
ఎవరినైనా ఎదిరించే కామ్రెడ్ నారాయణ కూడా దిక్కుతోచక.. హైకోర్టు నుంచి కొన్ని గంటల పాటు అనుమతి తెచ్చుకుని పరిశీలించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి శత్రుదుర్భేధ్యమైన రుషి కొండలో ఇప్పుడు చిన్నారులు..యువత క్రికెట్ ఆడుకుంటున్నారు.
తాజాగా ఇక్కడ పర్యటించిన టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు.. ఈ ముచ్చట చూసి నవ్వుకున్నారు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటా మని తెలిపారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో జగన్ నిర్మించిన ఈ అక్రమ కట్టడాన్ని తాము కూల్చేయబోమన్నారు. అయితే.. దీనిని ప్రజావసరాలకు వినియోగించడమో.. లేక కేంద్రానికి రెంట్కు ఇచ్చే అవకాశం ఉంటే వారికి ఇవ్వడమో చేస్తే.. రాష్ట్రానికి కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్టు తెలిపారు.
ఇదీ.. “కారే రాజులు.. రాజ్యముల్ గెలవరే.. గర్వోన్నతిన్ పొందరే.. వారేరీ..“ అని మహాకవి పోతన చెప్పిన వాక్యాలు గుర్తు చేస్తోంది!!
This post was last modified on June 16, 2024 3:21 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…