ఏపీ రాజధాని అమరావతి ఇప్పటి వరకు మూలన ఉన్న ప్రాంతంగా.. ముసురుపట్టిన ప్రాంతంగా మారిపోయింది. ఎటు చూసినా తుమ్మలు, తుప్పలు తప్ప.. గత ఐదేళ్లలో ఇక్కడ జరిగింది.. ఒరిగింది ఏమీలేదు.
కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారడం.. సీఎం చంద్రబాబు గద్దెనెక్కడంతో అమరావతి తలరాత మారిపోనుంది. ఒక ఖచ్చితమైన సమయం పెట్టుకుని.. దాని ప్రకారం పనులు చేసేందుకు.. కేవలం మూడేళ్లలోనే అమరావతిని 90 శాతం వరకు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.
ఇదే విషయాన్ని తాజాగా మంత్రి బాధ్యతలు చేపట్టిన ఏపీ పురశాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. ఒక సమయం పెట్టుకుని.. ఆ సమయంలోనే అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దు తామని తెలిపారు. తాజాగా ఆయన మంత్రి బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో సతీమణితో కలిసి ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు.
‘‘రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉంది. రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రైతులు అందజేశారు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చారు. వారి విశ్వాసాన్నీ, నమ్మకాన్నీ నిలబెడతాం. రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని నిర్మాణం చేయాలన్న చంద్రబాబు సంకల్పాన్ని నిజం చేస్తాం“ అని మంత్రి నారాయణ వివరించారు.
కాగా, ప్రస్తుతం అనేక భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. కొన్ని పిచ్చి మొక్కలతో నిండి పోయాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఇక్కడ తుప్పలు.. పిచ్చి చెట్లు తొలగించే కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఇక, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధానిని ప్రస్తుత ప్రభుత్వం నిర్మించేందుకు రెడీఅయింది. ప్లాన్లో మార్పులు చేస్తే.. మరోసారి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నదిఉన్నట్టుగా నవనగరాలను నిర్మించేందుకు ప్లాన్ చేయడం గమనార్హం. 2027-28మధ్యలో రాజధాని పూర్తి చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.
This post was last modified on June 16, 2024 11:16 am
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…