Political News

జ‌గ‌న్ చుట్టూ భారీ వివాదం.. క్యాంపు ఆఫీసుపై విచార‌ణ‌?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చుట్టూ భారీ వివాదం ముసురుకుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా శివారులోని తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాల‌యం నుంచే ఆయ‌న ఐదేళ్లు పాల‌న సాగించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న క్యాంపు కార్యాల‌యాన్ని ఇంద్ర భ‌వ‌నంగా తీర్చిదిద్దుకున్నారు. క‌ళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగులు, శుభ్రంగా క‌డిగిన చేతుల‌తో ముట్టుకున్న మ‌ర‌క‌లు ప‌డ‌తాయా? అని అనిపించేంత రాయితో త‌న క్యాంపు కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, దీనిలో ఏర్పాటు చేసుకున్న ఫ‌ర్నిచ‌ర్‌.. అమెరికా అధ్య‌క్షుడి కార్యాల‌యంలో కూడా ఉండ‌ద‌ని అంటారు.

అంత ఖ‌రీదైన బ్రిట‌న్ రాజ‌వంశీకులు వినియోగించే ఫ‌ర్నిచ‌ర్‌ను జ‌గ‌న్ త‌న క్యాంపు కార్యాల‌యంలో వినియోగిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. అదేస‌మ‌యంలో కిలోమీట‌రున్న‌ర దూరం మేర‌కు .. క్యాంపు కార్యాల‌యం ఉన్న మార్గంలో ఇత‌ర ప్ర‌జలను ఎవ‌రినీ అడుగు కూడా పెట్ట‌కుండా ఏర్పాటు చేసుకున్న ర‌హ‌దారి కూడా.. ఇప్పుడు వివాదంగా మారింది. వీటిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు.. శివ‌రామ‌కృష్ణ ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. జ‌గ‌న్ నివాసంలో రూ.18 కోట్ల రూపాయ‌ల విలువైన ఫ‌ర్నిచ‌ర్ ఏర్పాటు చేసుకున్న‌ట్టు చెప్పారు.

ఇదేస‌మ‌యంలో రేవేంద్ర‌పాటు వ‌ర‌కు వేయాల‌ని భావించిన రోడ్డును ఆపేసి ఆ నిధుల‌తో త‌ళ‌త‌ళ‌లాడేలా.. తాడేప‌ల్లికి ర‌హ‌దారి నిర్మించుకున్నార‌ని.. ఇది ప‌బ్లిక్ రోడ్డు అయినా.. దీనిని ప్రైవేటుగా వాడుకున్నార‌ని.. అదేవిధంగాప్ర‌తి ఆరు మాసాల‌కు కూడా.. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం హంగుల‌కు రూ.కోట్లు ఖ‌ర్చు చేశార‌ని పేర్కొన్నారు. వీటికి ప్ర‌జాధ‌నం ఖ‌ర్చుచేశార‌ని తెలిపారు. ఇప్పుడు ఆయ‌న మాజీ సీఎం అయిన నేప‌థ్యంలో క‌నీసం ఫ‌ర్నిచ‌ర్‌ను అయినా.. ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌ని కానీ, అలా చేయ‌లేద‌ని వ్యాఖ్యానించారు.

గ‌తంలో త‌న తండ్రి ఫ‌ర్నిచ‌ర్‌ను దొంగిలించార‌ని కేసు పెట్టార‌ని.. కానీ, తాను అలా చేయ‌లేద‌ని.. త‌న తండ్రి శివ‌ప్ర‌సాద్ వివ‌ర‌ణ ఇచ్చినా.. వేధించి ఆత్మ‌హ‌త్య చేసుకునే వ‌ర‌కు తీసుకువ‌చ్చార‌ని వాపోయారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నిర్మించుకున్న తాడేప‌ల్లి ప్యాలెస్ ఖ‌ర్చుల‌ను, ఫ‌ర్నిచ‌ర్ ఖ‌ర్చును రాబ‌ట్టేలా.. ప్ర‌బుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డంతోపాటు.. జ‌గ‌న్‌పై కేసులు పెట్టాల‌ని కోడెల శివ‌రామ‌కృష్ణ ప్ర‌బుత్వానికి విన్న‌వించారు. దీనిపై టీడీపీ నాయ‌కులు కూడా స్పందించారు. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా ఫ‌ర్నిచ‌ర్ సొమ్మును ప్ర‌భుత్వానికి వెన‌క్కి ఇవ్వాల‌ని.. లేదా ఫ‌ర్నిచ‌ర్‌ను వెన‌క్కి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చంద్ర‌బాబు స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Satya

Recent Posts

విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…

10 minutes ago

జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…

35 minutes ago

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…

1 hour ago

ట్రిలియనీర్ క్లబ్ నుంచి మస్క్ అవుట్

కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…

2 hours ago

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…

4 hours ago

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

13 hours ago