Political News

జ‌గ‌న్ చుట్టూ భారీ వివాదం.. క్యాంపు ఆఫీసుపై విచార‌ణ‌?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చుట్టూ భారీ వివాదం ముసురుకుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా శివారులోని తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాల‌యం నుంచే ఆయ‌న ఐదేళ్లు పాల‌న సాగించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న క్యాంపు కార్యాల‌యాన్ని ఇంద్ర భ‌వ‌నంగా తీర్చిదిద్దుకున్నారు. క‌ళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగులు, శుభ్రంగా క‌డిగిన చేతుల‌తో ముట్టుకున్న మ‌ర‌క‌లు ప‌డ‌తాయా? అని అనిపించేంత రాయితో త‌న క్యాంపు కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, దీనిలో ఏర్పాటు చేసుకున్న ఫ‌ర్నిచ‌ర్‌.. అమెరికా అధ్య‌క్షుడి కార్యాల‌యంలో కూడా ఉండ‌ద‌ని అంటారు.

అంత ఖ‌రీదైన బ్రిట‌న్ రాజ‌వంశీకులు వినియోగించే ఫ‌ర్నిచ‌ర్‌ను జ‌గ‌న్ త‌న క్యాంపు కార్యాల‌యంలో వినియోగిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. అదేస‌మ‌యంలో కిలోమీట‌రున్న‌ర దూరం మేర‌కు .. క్యాంపు కార్యాల‌యం ఉన్న మార్గంలో ఇత‌ర ప్ర‌జలను ఎవ‌రినీ అడుగు కూడా పెట్ట‌కుండా ఏర్పాటు చేసుకున్న ర‌హ‌దారి కూడా.. ఇప్పుడు వివాదంగా మారింది. వీటిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు.. శివ‌రామ‌కృష్ణ ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. జ‌గ‌న్ నివాసంలో రూ.18 కోట్ల రూపాయ‌ల విలువైన ఫ‌ర్నిచ‌ర్ ఏర్పాటు చేసుకున్న‌ట్టు చెప్పారు.

ఇదేస‌మ‌యంలో రేవేంద్ర‌పాటు వ‌ర‌కు వేయాల‌ని భావించిన రోడ్డును ఆపేసి ఆ నిధుల‌తో త‌ళ‌త‌ళ‌లాడేలా.. తాడేప‌ల్లికి ర‌హ‌దారి నిర్మించుకున్నార‌ని.. ఇది ప‌బ్లిక్ రోడ్డు అయినా.. దీనిని ప్రైవేటుగా వాడుకున్నార‌ని.. అదేవిధంగాప్ర‌తి ఆరు మాసాల‌కు కూడా.. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం హంగుల‌కు రూ.కోట్లు ఖ‌ర్చు చేశార‌ని పేర్కొన్నారు. వీటికి ప్ర‌జాధ‌నం ఖ‌ర్చుచేశార‌ని తెలిపారు. ఇప్పుడు ఆయ‌న మాజీ సీఎం అయిన నేప‌థ్యంలో క‌నీసం ఫ‌ర్నిచ‌ర్‌ను అయినా.. ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌ని కానీ, అలా చేయ‌లేద‌ని వ్యాఖ్యానించారు.

గ‌తంలో త‌న తండ్రి ఫ‌ర్నిచ‌ర్‌ను దొంగిలించార‌ని కేసు పెట్టార‌ని.. కానీ, తాను అలా చేయ‌లేద‌ని.. త‌న తండ్రి శివ‌ప్ర‌సాద్ వివ‌ర‌ణ ఇచ్చినా.. వేధించి ఆత్మ‌హ‌త్య చేసుకునే వ‌ర‌కు తీసుకువ‌చ్చార‌ని వాపోయారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నిర్మించుకున్న తాడేప‌ల్లి ప్యాలెస్ ఖ‌ర్చుల‌ను, ఫ‌ర్నిచ‌ర్ ఖ‌ర్చును రాబ‌ట్టేలా.. ప్ర‌బుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డంతోపాటు.. జ‌గ‌న్‌పై కేసులు పెట్టాల‌ని కోడెల శివ‌రామ‌కృష్ణ ప్ర‌బుత్వానికి విన్న‌వించారు. దీనిపై టీడీపీ నాయ‌కులు కూడా స్పందించారు. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా ఫ‌ర్నిచ‌ర్ సొమ్మును ప్ర‌భుత్వానికి వెన‌క్కి ఇవ్వాల‌ని.. లేదా ఫ‌ర్నిచ‌ర్‌ను వెన‌క్కి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చంద్ర‌బాబు స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on June 16, 2024 7:41 am

Share
Show comments

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago