ఏపీ ప్రజలకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తాను బాధ్యతలు చేపడతానని అన్నారు. ఈ సేవ చేసే భాగ్యంతనకు కల్పించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా కంటే..ఒక ఎమ్మెల్యేగానే తాను సేవ చేసేందుకు ఇష్టపడతానని చెప్పారు.
ప్రజలు ఎన్నుకున్న పదవిని స్వార్థం కోసం ఎట్టి పరిస్థితిలోనూ వినియోగించుకునేదిలేదన్న ఆయన.. తనకు ఇష్టమైన శాఖలు కేటాయించిన.. సీఎం చంద్రబాబుకు కూడా.. కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అటవీ సంపదను దోచుకున్నవారితో సొమ్ములను తిరిగి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.
“ఎంతటివారైనా.. అడవి తల్లిని దోచుకున్నవారు ఎక్కడున్నా వదిలి పెట్టను” అని పవన్ వ్యాఖ్యానించారు. ఇక, తన వారాహి యాత్ర సందర్భంగా అనేక సమస్యలను కళ్లారా చూసినట్టు చెప్పారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. అడవులను కంటికి రెప్పలా కాపాడతానని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో మాత్రమే పండే ఎర్రచందనాన్ని పరిరక్షించే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని తేల్చి చెప్పారు. “అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
అనుభవాలు ఇవీ..
This post was last modified on June 15, 2024 8:47 pm
కూటమి సర్కారుకు వంద రోజులు పూర్తయ్యాయి. సంతృప్తి విషయంలో కూటమి పార్టీల నాయకులు తల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా?…
దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ డెబ్యూలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఫైర్బ్రాండ్లు కూడా…
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేళ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన పది పాత ఏఎన్ఆర్ క్లాసిక్స్ ని…
తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్,…
దర్శకుడు కొరటాల శివ కొంచెం రిజర్వ్డ్ గా మాట్లాడతారని పేరు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఎంత స్టార్ హీరోతో…