ఏపీ ప్రజలకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తాను బాధ్యతలు చేపడతానని అన్నారు. ఈ సేవ చేసే భాగ్యంతనకు కల్పించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా కంటే..ఒక ఎమ్మెల్యేగానే తాను సేవ చేసేందుకు ఇష్టపడతానని చెప్పారు.
ప్రజలు ఎన్నుకున్న పదవిని స్వార్థం కోసం ఎట్టి పరిస్థితిలోనూ వినియోగించుకునేదిలేదన్న ఆయన.. తనకు ఇష్టమైన శాఖలు కేటాయించిన.. సీఎం చంద్రబాబుకు కూడా.. కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అటవీ సంపదను దోచుకున్నవారితో సొమ్ములను తిరిగి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.
“ఎంతటివారైనా.. అడవి తల్లిని దోచుకున్నవారు ఎక్కడున్నా వదిలి పెట్టను” అని పవన్ వ్యాఖ్యానించారు. ఇక, తన వారాహి యాత్ర సందర్భంగా అనేక సమస్యలను కళ్లారా చూసినట్టు చెప్పారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. అడవులను కంటికి రెప్పలా కాపాడతానని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో మాత్రమే పండే ఎర్రచందనాన్ని పరిరక్షించే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని తేల్చి చెప్పారు. “అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
అనుభవాలు ఇవీ..
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…