ఏపీ ప్రజలకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తాను బాధ్యతలు చేపడతానని అన్నారు. ఈ సేవ చేసే భాగ్యంతనకు కల్పించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా కంటే..ఒక ఎమ్మెల్యేగానే తాను సేవ చేసేందుకు ఇష్టపడతానని చెప్పారు.
ప్రజలు ఎన్నుకున్న పదవిని స్వార్థం కోసం ఎట్టి పరిస్థితిలోనూ వినియోగించుకునేదిలేదన్న ఆయన.. తనకు ఇష్టమైన శాఖలు కేటాయించిన.. సీఎం చంద్రబాబుకు కూడా.. కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అటవీ సంపదను దోచుకున్నవారితో సొమ్ములను తిరిగి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.
“ఎంతటివారైనా.. అడవి తల్లిని దోచుకున్నవారు ఎక్కడున్నా వదిలి పెట్టను” అని పవన్ వ్యాఖ్యానించారు. ఇక, తన వారాహి యాత్ర సందర్భంగా అనేక సమస్యలను కళ్లారా చూసినట్టు చెప్పారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. అడవులను కంటికి రెప్పలా కాపాడతానని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో మాత్రమే పండే ఎర్రచందనాన్ని పరిరక్షించే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని తేల్చి చెప్పారు. “అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
అనుభవాలు ఇవీ..
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…