ఏపీలో కొత్తగా కొలువు దీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. శాఖల పరంగా మంత్రు లను కేటాయించడం.. అధికారులను తీసుకోవడం.. వంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగానే పూర్తి చేశారు. ఇక, కార్యాచరణకు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం అవలంభించిన కార్యక్రమాల్లో కొన్నింటిని తప్పని సరిగా అమలు చేస్తున్నారు. అయితే.. వాటికి పేర్లను మార్చుతున్నారు.
ఉదాహరణకు ప్రతినెలా 1వ తేదీనే ఇచ్చే.. సామాజిక పింఛనును గత ప్రభుత్వం జగనన్న సురక్షా పింఛను పేరుతో పంపిణీ చేసింది. కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దీనికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పెట్టింది. అయితే.. పంపిణీ విధానాన్ని మాత్రం మార్చలేదు. ప్రతి నెల 1న ప్రతి ఇంటికీ వెళ్లి.. ఎలా అయితేపింఛను పంపిణీ చేసేవారో.. అలానే ఇప్పుడు కూడా పంపిణీ జరుగుతుంది. కేవలం మార్పల్లా పేరులోనే. అదేవిధంగా.. మరో కీలక కార్యక్రమానికి కూడా పేరు మార్చారు.
ప్రతి సోమవారం.. జగన్ హయాంలో స్పందన పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేం దుకు ప్రయత్నించింది. వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేందుకు ప్రయత్నించింది. సమస్య ఏదై నా స్పందనతో పరిష్కారం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఇదే కార్యక్రమం ఇదే పద్ధతిలో కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే.. పేరు మాత్రం మార్పు చేశారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికగా మార్పు చేశారు.
అయితే.. పనితీరు.. ఇతరత్రా మాత్రం కామన్. అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు కూడా పేరును మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోమవారం నుంచి ప్రజాఫిర్యాదుల పరిష్కారం వేదిక ద్వారా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు పనితీరును మెరుగు పరుచుకోవాలని కూడా అధికారులకు, సిబ్బందికి చంద్రబాబు సూచించారు. మొత్తంగా చంద్రబాబు మార్క్ అయితే.. స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on June 15, 2024 12:52 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…