ఏపీ సీఎం చంద్రబాబు పని ప్రారంభించేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే చంద్రబాబు తన తీరును ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి రాజధానిలోని సచివాలయంలోనే తాను అందుబాటులో ఉంటానని తేల్చిచెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాను సచివాలయంలోనే ఉండనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎవరు వచ్చినా.. తనను కలుసుకోవచ్చారు.
ఇక, ఇదే సమయంలో 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించే క్రమంలో ప్రతి సోమవారం సదరు ప్రాజెక్టు ప్రాంతం వద్దకు వెళ్లి పరిశీలించి..సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసేవారు.
తద్వారా.. పనులు వేగంగా పూర్తి కావడంతోపాటు.. పనుల్లో నాణ్యత కూడా ఉంటుందని.. రాజీ ధోరణి ప్రదర్శించరని చంద్రబాబు చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే పంథాలోనే చంద్రబాబు పయనిస్తున్నారు. సోమవారం నుంచి ఆయన పోలవరం పేరుతో ప్రాజెక్టు సైట్కు వెళ్లనున్నారు.
అంతేకాదు… పోలవరం పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో రాజీ ధోరణి లేదని కూడా ఉన్నతాధికారులకు ఆయన తేల్చి చెప్పారు. ఇక, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించ వద్దని చంద్రబాబు సూచించారు. గతంలో ఏం చేసినా.. ఎలా జరిగినా.. ఇప్పుడు మాత్రం పూర్తి పారదర్శకతతో ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు.
మంత్రుల విషయంలో చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. మంత్రులు ప్రతి ఒక్కరు తమ తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారు. అదేవిధంగా సమయ పాలనను ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ డైరీ మెయింటెన్ చేసుకోవాలని.. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సమయం ప్రకారం.. పరిష్కరించాలన్నారు. ముందుగా నియోజకవర్గాలు, జిల్లాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
This post was last modified on June 15, 2024 2:50 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…