Political News

వైసీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ మార్క్‌ నిఘా.. ఎందుకు?

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన ద‌రిమిలా.. ఆ పార్టీకి ప్రాధాన్యం త‌గ్గిపోయింది. ముఖ్యంగా కొంద‌రు నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం అంచ‌నాల ప్ర‌కారం.. వైసీపీకి అసెంబ్లీలో బ‌లం లేక‌పోయినా.. మండ‌లిలో ఉంది.

35 మంది వ‌ర‌కు వైసీపీకి ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరి బ‌లంతోనే వైసీపీ వ‌చ్చే ఐదేళ్లు నెట్టుకురావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వాయిస్ వినిపించే ప‌రిస్థితి లేక‌పోయినా.. మండ‌లిలో అయినా.. వాయిస్ వినిపించేందుకు వీరే అండ‌గా ఉన్నారు.

అయితే.. గ‌త రెండు రోజుల నుంచి కొంద‌రు ఎమ్మెల్సీలు.. పార్టీకి అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్సీల తో స‌మావేశం పెట్టి.. పార్టీకి మీరే అండ‌గా ఉండాల‌ని.. బ‌ల‌మైన వాయిస్ వినిపించాల‌ని జ‌గ‌న్ చెప్పారు. అయితే.. ఈ స‌మావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు.

వీరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో వీరు జంప్ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని పార్టీ అధినేత ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. చిత్రం ఏంటంటే.. గ‌తంలో జంప్ చేసిన వారినే జ‌గ‌న్ మండ‌లికి పంపించారు.

ఇప్పుడు వారు తిరికి సొంత పార్టీల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది. దీనికి కూడా కార‌ణం ఉంది. టీడీపీ, కూట‌మి పార్టీలు ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లిలో మాత్రం అవిపేల‌వంగా ఉన్నాయి.

దీంతో మండ‌లిలో ప్ర‌భుత్వానికి వైసీపీ నుంచి అడ్డంకులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నుంచి వ‌చ్చే వారికి రెడ్ కార్పెట్ ప‌రిచినా ఆశ్చ‌ర్యం లేదు. అయితే.. ఇంకా అంత దూరం చంద్ర‌బాబు వెళ్ల‌లేదు. కానీ, ఈ ప‌రిణామాల‌ను ముందుగానే గుర్తించి.. కొంద‌రు ఇప్ప‌టి నుంచే వైసీపీకి దూరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ నేత‌లపై … నిఘా పెంచారు. నిత్యం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ ల‌కు ఫోన్లు చేస్తూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న ఈ ప‌నిమీదే ఉన్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్న‌వారు.. అసంతృప్తిలో ఉన్న‌వారిని ఆయ‌న టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఆయన ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

This post was last modified on June 15, 2024 11:15 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

2 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

3 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

4 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

4 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

5 hours ago