Political News

వైసీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ మార్క్‌ నిఘా.. ఎందుకు?

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన ద‌రిమిలా.. ఆ పార్టీకి ప్రాధాన్యం త‌గ్గిపోయింది. ముఖ్యంగా కొంద‌రు నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం అంచ‌నాల ప్ర‌కారం.. వైసీపీకి అసెంబ్లీలో బ‌లం లేక‌పోయినా.. మండ‌లిలో ఉంది.

35 మంది వ‌ర‌కు వైసీపీకి ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరి బ‌లంతోనే వైసీపీ వ‌చ్చే ఐదేళ్లు నెట్టుకురావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వాయిస్ వినిపించే ప‌రిస్థితి లేక‌పోయినా.. మండ‌లిలో అయినా.. వాయిస్ వినిపించేందుకు వీరే అండ‌గా ఉన్నారు.

అయితే.. గ‌త రెండు రోజుల నుంచి కొంద‌రు ఎమ్మెల్సీలు.. పార్టీకి అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్సీల తో స‌మావేశం పెట్టి.. పార్టీకి మీరే అండ‌గా ఉండాల‌ని.. బ‌ల‌మైన వాయిస్ వినిపించాల‌ని జ‌గ‌న్ చెప్పారు. అయితే.. ఈ స‌మావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు.

వీరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో వీరు జంప్ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని పార్టీ అధినేత ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. చిత్రం ఏంటంటే.. గ‌తంలో జంప్ చేసిన వారినే జ‌గ‌న్ మండ‌లికి పంపించారు.

ఇప్పుడు వారు తిరికి సొంత పార్టీల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది. దీనికి కూడా కార‌ణం ఉంది. టీడీపీ, కూట‌మి పార్టీలు ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లిలో మాత్రం అవిపేల‌వంగా ఉన్నాయి.

దీంతో మండ‌లిలో ప్ర‌భుత్వానికి వైసీపీ నుంచి అడ్డంకులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నుంచి వ‌చ్చే వారికి రెడ్ కార్పెట్ ప‌రిచినా ఆశ్చ‌ర్యం లేదు. అయితే.. ఇంకా అంత దూరం చంద్ర‌బాబు వెళ్ల‌లేదు. కానీ, ఈ ప‌రిణామాల‌ను ముందుగానే గుర్తించి.. కొంద‌రు ఇప్ప‌టి నుంచే వైసీపీకి దూరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ నేత‌లపై … నిఘా పెంచారు. నిత్యం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ ల‌కు ఫోన్లు చేస్తూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న ఈ ప‌నిమీదే ఉన్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్న‌వారు.. అసంతృప్తిలో ఉన్న‌వారిని ఆయ‌న టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఆయన ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

This post was last modified on June 15, 2024 11:15 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

54 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago