Political News

వైసీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ మార్క్‌ నిఘా.. ఎందుకు?

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన ద‌రిమిలా.. ఆ పార్టీకి ప్రాధాన్యం త‌గ్గిపోయింది. ముఖ్యంగా కొంద‌రు నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం అంచ‌నాల ప్ర‌కారం.. వైసీపీకి అసెంబ్లీలో బ‌లం లేక‌పోయినా.. మండ‌లిలో ఉంది.

35 మంది వ‌ర‌కు వైసీపీకి ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరి బ‌లంతోనే వైసీపీ వ‌చ్చే ఐదేళ్లు నెట్టుకురావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వాయిస్ వినిపించే ప‌రిస్థితి లేక‌పోయినా.. మండ‌లిలో అయినా.. వాయిస్ వినిపించేందుకు వీరే అండ‌గా ఉన్నారు.

అయితే.. గ‌త రెండు రోజుల నుంచి కొంద‌రు ఎమ్మెల్సీలు.. పార్టీకి అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్సీల తో స‌మావేశం పెట్టి.. పార్టీకి మీరే అండ‌గా ఉండాల‌ని.. బ‌ల‌మైన వాయిస్ వినిపించాల‌ని జ‌గ‌న్ చెప్పారు. అయితే.. ఈ స‌మావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు.

వీరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో వీరు జంప్ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని పార్టీ అధినేత ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. చిత్రం ఏంటంటే.. గ‌తంలో జంప్ చేసిన వారినే జ‌గ‌న్ మండ‌లికి పంపించారు.

ఇప్పుడు వారు తిరికి సొంత పార్టీల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది. దీనికి కూడా కార‌ణం ఉంది. టీడీపీ, కూట‌మి పార్టీలు ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లిలో మాత్రం అవిపేల‌వంగా ఉన్నాయి.

దీంతో మండ‌లిలో ప్ర‌భుత్వానికి వైసీపీ నుంచి అడ్డంకులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నుంచి వ‌చ్చే వారికి రెడ్ కార్పెట్ ప‌రిచినా ఆశ్చ‌ర్యం లేదు. అయితే.. ఇంకా అంత దూరం చంద్ర‌బాబు వెళ్ల‌లేదు. కానీ, ఈ ప‌రిణామాల‌ను ముందుగానే గుర్తించి.. కొంద‌రు ఇప్ప‌టి నుంచే వైసీపీకి దూరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ నేత‌లపై … నిఘా పెంచారు. నిత్యం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ ల‌కు ఫోన్లు చేస్తూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న ఈ ప‌నిమీదే ఉన్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్న‌వారు.. అసంతృప్తిలో ఉన్న‌వారిని ఆయ‌న టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఆయన ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

This post was last modified on June 15, 2024 11:15 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago