ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన దరిమిలా.. ఆ పార్టీకి ప్రాధాన్యం తగ్గిపోయింది. ముఖ్యంగా కొందరు నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం.. వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోయినా.. మండలిలో ఉంది.
35 మంది వరకు వైసీపీకి ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరి బలంతోనే వైసీపీ వచ్చే ఐదేళ్లు నెట్టుకురావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వాయిస్ వినిపించే పరిస్థితి లేకపోయినా.. మండలిలో అయినా.. వాయిస్ వినిపించేందుకు వీరే అండగా ఉన్నారు.
అయితే.. గత రెండు రోజుల నుంచి కొందరు ఎమ్మెల్సీలు.. పార్టీకి అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్సీల తో సమావేశం పెట్టి.. పార్టీకి మీరే అండగా ఉండాలని.. బలమైన వాయిస్ వినిపించాలని జగన్ చెప్పారు. అయితే.. ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు.
వీరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో వీరు జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారని పార్టీ అధినేత ఒక నిర్ణయానికి వచ్చారు. చిత్రం ఏంటంటే.. గతంలో జంప్ చేసిన వారినే జగన్ మండలికి పంపించారు.
ఇప్పుడు వారు తిరికి సొంత పార్టీలకు వెళ్లే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. దీనికి కూడా కారణం ఉంది. టీడీపీ, కూటమి పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. మండలిలో మాత్రం అవిపేలవంగా ఉన్నాయి.
దీంతో మండలిలో ప్రభుత్వానికి వైసీపీ నుంచి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరిచినా ఆశ్చర్యం లేదు. అయితే.. ఇంకా అంత దూరం చంద్రబాబు వెళ్లలేదు. కానీ, ఈ పరిణామాలను ముందుగానే గుర్తించి.. కొందరు ఇప్పటి నుంచే వైసీపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలపై … నిఘా పెంచారు. నిత్యం సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లకు ఫోన్లు చేస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఈ పనిమీదే ఉన్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్నవారు.. అసంతృప్తిలో ఉన్నవారిని ఆయన టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on June 15, 2024 11:15 am
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…