Political News

వైసీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ మార్క్‌ నిఘా.. ఎందుకు?

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన ద‌రిమిలా.. ఆ పార్టీకి ప్రాధాన్యం త‌గ్గిపోయింది. ముఖ్యంగా కొంద‌రు నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం అంచ‌నాల ప్ర‌కారం.. వైసీపీకి అసెంబ్లీలో బ‌లం లేక‌పోయినా.. మండ‌లిలో ఉంది.

35 మంది వ‌ర‌కు వైసీపీకి ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరి బ‌లంతోనే వైసీపీ వ‌చ్చే ఐదేళ్లు నెట్టుకురావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వాయిస్ వినిపించే ప‌రిస్థితి లేక‌పోయినా.. మండ‌లిలో అయినా.. వాయిస్ వినిపించేందుకు వీరే అండ‌గా ఉన్నారు.

అయితే.. గ‌త రెండు రోజుల నుంచి కొంద‌రు ఎమ్మెల్సీలు.. పార్టీకి అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్సీల తో స‌మావేశం పెట్టి.. పార్టీకి మీరే అండ‌గా ఉండాల‌ని.. బ‌ల‌మైన వాయిస్ వినిపించాల‌ని జ‌గ‌న్ చెప్పారు. అయితే.. ఈ స‌మావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు.

వీరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో వీరు జంప్ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని పార్టీ అధినేత ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. చిత్రం ఏంటంటే.. గ‌తంలో జంప్ చేసిన వారినే జ‌గ‌న్ మండ‌లికి పంపించారు.

ఇప్పుడు వారు తిరికి సొంత పార్టీల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది. దీనికి కూడా కార‌ణం ఉంది. టీడీపీ, కూట‌మి పార్టీలు ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లిలో మాత్రం అవిపేల‌వంగా ఉన్నాయి.

దీంతో మండ‌లిలో ప్ర‌భుత్వానికి వైసీపీ నుంచి అడ్డంకులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నుంచి వ‌చ్చే వారికి రెడ్ కార్పెట్ ప‌రిచినా ఆశ్చ‌ర్యం లేదు. అయితే.. ఇంకా అంత దూరం చంద్ర‌బాబు వెళ్ల‌లేదు. కానీ, ఈ ప‌రిణామాల‌ను ముందుగానే గుర్తించి.. కొంద‌రు ఇప్ప‌టి నుంచే వైసీపీకి దూరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ నేత‌లపై … నిఘా పెంచారు. నిత్యం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ ల‌కు ఫోన్లు చేస్తూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న ఈ ప‌నిమీదే ఉన్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్న‌వారు.. అసంతృప్తిలో ఉన్న‌వారిని ఆయ‌న టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఆయన ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

This post was last modified on June 15, 2024 11:15 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

13 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago