ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన దరిమిలా.. ఆ పార్టీకి ప్రాధాన్యం తగ్గిపోయింది. ముఖ్యంగా కొందరు నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం.. వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోయినా.. మండలిలో ఉంది.
35 మంది వరకు వైసీపీకి ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరి బలంతోనే వైసీపీ వచ్చే ఐదేళ్లు నెట్టుకురావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వాయిస్ వినిపించే పరిస్థితి లేకపోయినా.. మండలిలో అయినా.. వాయిస్ వినిపించేందుకు వీరే అండగా ఉన్నారు.
అయితే.. గత రెండు రోజుల నుంచి కొందరు ఎమ్మెల్సీలు.. పార్టీకి అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్సీల తో సమావేశం పెట్టి.. పార్టీకి మీరే అండగా ఉండాలని.. బలమైన వాయిస్ వినిపించాలని జగన్ చెప్పారు. అయితే.. ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు.
వీరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో వీరు జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారని పార్టీ అధినేత ఒక నిర్ణయానికి వచ్చారు. చిత్రం ఏంటంటే.. గతంలో జంప్ చేసిన వారినే జగన్ మండలికి పంపించారు.
ఇప్పుడు వారు తిరికి సొంత పార్టీలకు వెళ్లే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. దీనికి కూడా కారణం ఉంది. టీడీపీ, కూటమి పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. మండలిలో మాత్రం అవిపేలవంగా ఉన్నాయి.
దీంతో మండలిలో ప్రభుత్వానికి వైసీపీ నుంచి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరిచినా ఆశ్చర్యం లేదు. అయితే.. ఇంకా అంత దూరం చంద్రబాబు వెళ్లలేదు. కానీ, ఈ పరిణామాలను ముందుగానే గుర్తించి.. కొందరు ఇప్పటి నుంచే వైసీపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలపై … నిఘా పెంచారు. నిత్యం సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లకు ఫోన్లు చేస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఈ పనిమీదే ఉన్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్నవారు.. అసంతృప్తిలో ఉన్నవారిని ఆయన టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on June 15, 2024 11:15 am
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…