Political News

వైసీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ మార్క్‌ నిఘా.. ఎందుకు?

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన ద‌రిమిలా.. ఆ పార్టీకి ప్రాధాన్యం త‌గ్గిపోయింది. ముఖ్యంగా కొంద‌రు నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం అంచ‌నాల ప్ర‌కారం.. వైసీపీకి అసెంబ్లీలో బ‌లం లేక‌పోయినా.. మండ‌లిలో ఉంది.

35 మంది వ‌ర‌కు వైసీపీకి ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరి బ‌లంతోనే వైసీపీ వ‌చ్చే ఐదేళ్లు నెట్టుకురావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో వాయిస్ వినిపించే ప‌రిస్థితి లేక‌పోయినా.. మండ‌లిలో అయినా.. వాయిస్ వినిపించేందుకు వీరే అండ‌గా ఉన్నారు.

అయితే.. గ‌త రెండు రోజుల నుంచి కొంద‌రు ఎమ్మెల్సీలు.. పార్టీకి అందుబాటులోకి రాలేదు. ఎమ్మెల్సీల తో స‌మావేశం పెట్టి.. పార్టీకి మీరే అండ‌గా ఉండాల‌ని.. బ‌ల‌మైన వాయిస్ వినిపించాల‌ని జ‌గ‌న్ చెప్పారు. అయితే.. ఈ స‌మావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు.

వీరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో వీరు జంప్ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని పార్టీ అధినేత ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. చిత్రం ఏంటంటే.. గ‌తంలో జంప్ చేసిన వారినే జ‌గ‌న్ మండ‌లికి పంపించారు.

ఇప్పుడు వారు తిరికి సొంత పార్టీల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది. దీనికి కూడా కార‌ణం ఉంది. టీడీపీ, కూట‌మి పార్టీలు ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లిలో మాత్రం అవిపేల‌వంగా ఉన్నాయి.

దీంతో మండ‌లిలో ప్ర‌భుత్వానికి వైసీపీ నుంచి అడ్డంకులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నుంచి వ‌చ్చే వారికి రెడ్ కార్పెట్ ప‌రిచినా ఆశ్చ‌ర్యం లేదు. అయితే.. ఇంకా అంత దూరం చంద్ర‌బాబు వెళ్ల‌లేదు. కానీ, ఈ ప‌రిణామాల‌ను ముందుగానే గుర్తించి.. కొంద‌రు ఇప్ప‌టి నుంచే వైసీపీకి దూరంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ నేత‌లపై … నిఘా పెంచారు. నిత్యం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ ల‌కు ఫోన్లు చేస్తూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న ఈ ప‌నిమీదే ఉన్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్న‌వారు.. అసంతృప్తిలో ఉన్న‌వారిని ఆయ‌న టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఆయన ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

This post was last modified on June 15, 2024 11:15 am

Share

Recent Posts

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…

14 minutes ago

సల్మాన్‌ను ఎలా ఒప్పించారబ్బా?

మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…

35 minutes ago

అమ్మాయిల ప్రైవేటు పార్ట్స్ మీద కొడితే సారి చెప్పరా

జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…

1 hour ago

హ్యాట్రిక్ ముద్ర కోసం ఫ్లాపుని మర్చిపోవాలా

చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…

2 hours ago

నాగార్జున అసలు పాయింట్ మిస్సయ్యారు

ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…

2 hours ago

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

7 hours ago