ఏపీలోని ప్రఖ్యాత ఆలయం.. తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) కార్యనిర్వహణాధికారి(ఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామల రావును ప్రభుత్వం నియమించింది. తక్షణం ఆయన బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. శుక్రవారం సాయంతం అత్యవసరంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ ఈవో విషయంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతస్థాయి వర్గాలతో జరిపిన చర్చల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, 1997 బ్యాచ్ కు చెందిన వివాద రహితుడు.. జే. శ్యామలరావును ఈవో పోస్టుకు ఎంపిక చేశారు.
ధర్మారెడ్డిపై వేటు!
వైసీపీ సర్కారు పాలనలో 2021లో టీటీడీ ఈవోగా నియమితులైన ధర్మారెడ్డిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ధర్మారెడ్డి ఐఏఎస్ అధికారి కాదు. ఐఆర్ఎస్ అధికారి. కేంద్ర రెవెన్యూ శాఖలో ఆయన పనిచేసేవారు. అయితే.. డెప్యుటేషన్పై ఏపీకి వచ్చిన ఆయన.. వైసీపీ సర్కారుతో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టీటీడీ ఈవో పోస్టును అప్పగించారు. అయితే..ఆయన హయాంలో టీటీడీ పవిత్ర దెబ్బతిందని.. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అన్యమత ప్రచారం.. టీటీడీ ఉద్యోగుల్లో కొందరు తిరుమల కొండపైనే ఆంగ్ల సంప్రదాయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వంటివి వివాదానికి దారి తీశాయి.
దీనికి తోడు.. తిరుమలలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అనేక సందర్భాల్లో కేసులు నమోదు కావడం.. కోర్టులకు కూడా వెళ్లడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా రెండు కేసుల్లో తిరుమల తిరుపతి దేవస్థా నం అధికారులను హెచ్చరించింది. ముఖ్యంగా ప్రొటోకాల్ దర్శనాల విషయంలో ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. అధికార పక్షం నేతలకు ఎక్కువగా అవకాశం ఇవ్వడం.. అప్పటి మంత్రులు రోజా, నారాయణ స్వామి వంటి వారు వందల సంఖ్యలో భక్తులను తీసుకువచ్చినా అనుమతించడం.. వంటివి ధర్మారెడ్డి పనితీరుపై విమర్శలు వచ్చేలా చేశాయి.
ఇదిలావుంటే..వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత.. ధర్మారెడ్డి కూడా అలెర్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న సంకేతాలు స్పష్టం కావడంతో ధర్మారెడ్డి తనంతట తనే.. సెలవు పెట్టారు. ముందు ఈ సెలవుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించలేదు. కానీ, చంద్రబాబు సూచనలతో ఆయనకు సుదీర్ఘ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఆయనను తొలగిస్తూ.. మరో ఉత్తర్వు జారీ చేశారు. జేఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. సెలవుల అనంతరం.. ధర్మారెడ్డి జేఏడీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
This post was last modified on June 15, 2024 10:10 am
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…