Political News

టీటీడీ ఈవోగా శ్యామ‌ల‌రావు.. చంద్ర‌బాబు నియామ‌కం!

ఏపీలోని ప్ర‌ఖ్యాత ఆల‌యం.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం( టీటీడీ) కార్య‌నిర్వ‌హణాధికారి(ఈవో)గా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామ‌ల రావును ప్ర‌భుత్వం నియ‌మించింది. త‌క్ష‌ణం ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. శుక్ర‌వారం సాయంతం అత్యవ‌స‌రంగా భేటీ అయిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టీటీడీ ఈవో విష‌యంపై చ‌ర్చించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యద‌ర్శి, ఇత‌ర ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, 1997 బ్యాచ్ కు చెందిన వివాద ర‌హితుడు.. జే. శ్యామ‌ల‌రావును ఈవో పోస్టుకు ఎంపిక చేశారు.

ధ‌ర్మారెడ్డిపై వేటు!

వైసీపీ స‌ర్కారు పాల‌న‌లో 2021లో టీటీడీ ఈవోగా నియ‌మితులైన ధ‌ర్మారెడ్డిని ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం తొల‌గించింది. ఈ మేర‌కు కూడా ఉత్త‌ర్వులు జారీ చేసింది. వాస్త‌వానికి ధ‌ర్మారెడ్డి ఐఏఎస్ అధికారి కాదు. ఐఆర్ఎస్ అధికారి. కేంద్ర రెవెన్యూ శాఖ‌లో ఆయ‌న పనిచేసేవారు. అయితే.. డెప్యుటేష‌న్‌పై ఏపీకి వ‌చ్చిన ఆయ‌న‌.. వైసీపీ స‌ర్కారుతో క‌లిసి ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు టీటీడీ ఈవో పోస్టును అప్ప‌గించారు. అయితే..ఆయ‌న హ‌యాంలో టీటీడీ ప‌విత్ర దెబ్బ‌తింద‌ని.. పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అన్య‌మ‌త ప్ర‌చారం.. టీటీడీ ఉద్యోగుల్లో కొంద‌రు తిరుమ‌ల కొండ‌పైనే ఆంగ్ల సంప్ర‌దాయంలో పుట్టిన‌రోజు వేడుక‌లు నిర్వ‌హించ‌డం వంటివి వివాదానికి దారి తీశాయి.

దీనికి తోడు.. తిరుమ‌ల‌లో వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అనేక సంద‌ర్భాల్లో కేసులు న‌మోదు కావ‌డం.. కోర్టుల‌కు కూడా వెళ్ల‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైకోర్టు కూడా రెండు కేసుల్లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థా నం అధికారులను హెచ్చ‌రించింది. ముఖ్యంగా ప్రొటోకాల్ ద‌ర్శ‌నాల విష‌యంలో ధ‌ర్మారెడ్డి తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర దుమారం రేపింది. అధికార ప‌క్షం నేత‌ల‌కు ఎక్కువ‌గా అవ‌కాశం ఇవ్వ‌డం.. అప్ప‌టి మంత్రులు రోజా, నారాయ‌ణ స్వామి వంటి వారు వంద‌ల సంఖ్య‌లో భ‌క్తులను తీసుకువ‌చ్చినా అనుమ‌తించ‌డం.. వంటివి ధ‌ర్మారెడ్డి ప‌నితీరుపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేశాయి.

ఇదిలావుంటే..వైసీపీ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిన త‌ర్వాత‌.. ధ‌ర్మారెడ్డి కూడా అలెర్ట్ అయ్యారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌న్న సంకేతాలు స్ప‌ష్టం కావ‌డంతో ధ‌ర్మారెడ్డి త‌నంత‌ట త‌నే.. సెల‌వు పెట్టారు. ముందు ఈ సెల‌వుకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనుమ‌తించ‌లేదు. కానీ, చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో ఆయ‌న‌కు సుదీర్ఘ సెల‌వు ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. తాజాగా ఆయ‌న‌ను తొల‌గిస్తూ.. మ‌రో ఉత్త‌ర్వు జారీ చేశారు. జేఏడీలో రిపోర్టు చేయాల‌ని సూచించారు. సెల‌వుల అనంత‌రం.. ధ‌ర్మారెడ్డి జేఏడీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

4 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

6 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

8 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

9 hours ago