Political News

ఏపీ టీడీపీ ప‌గ్గాలు మారాయి.. మ‌రోసారి బీసీకే జై కొట్టిన బాబు!

ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌రాంద్ర‌కు చెందిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు.. ఆ ప‌ద‌విని వ‌దులుకున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా అచ్చెన్న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అవ‌కాశం కల్పించా రు. దీంతో అటు ప్ర‌భుత్వం, ఇటు పార్టీ బాధ్య‌త‌ల‌ను రెండింటినీ స‌మ‌న్వ‌యం చేయ‌డం ఇబ్బంది అవుతుంద‌ని భావించిన చంద్ర బాబు.. అచ్చెన్నాయుడిని పార్టీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. 2020లో పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అచ్చెన్నాయుడు స‌మ‌ర్థ‌వంతంగా పార్టీని ముందుకు న‌డిపించారు.

పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు .. స్వ‌యంగా రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు చేసిన అచ్చెన్నాయుడు పార్టీని గాడిలో పెట్టారు. వివాదాలకు దూరంగా చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఆయ‌న పార్టీని న‌డిపించ‌డంలో స‌క్సెస అయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు తెలంగాణ‌, ఏపీల‌కు ప్ర‌త్యేక అధ్య‌క్షుల‌ను ఎంపిక చేశారు. తొలినాళ్ల‌లో ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌నగ‌రం జిల్లాకు చెందిన క‌ళా వెంక‌ట్రావుకు ఈ ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. 2019లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీ ప‌గ్గాలు వ‌దులుకున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడును ఎంపిక చేశారు.

ఇక‌, ఇప్పుడు అచ్చెన్న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఏపీ టీడీపీ రాష్ట్ర ప‌గ్గాల‌ను సీనియ‌ర్ నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ పల్లా శ్రీనివాస రావుకు చంద్ర‌బాబు అప్ప‌గించారు. తాజా ఎన్నిక్ల‌లో ప‌ల్లా విశాఖ‌లోని గాజువాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా ఆయ‌న ఉన్నారు. వివాద ర‌హితుడిగాను పేరు తెచ్చుకున్నారు. యాద‌వ సామాజిక వ‌ర్గంలోనూ మంచి పేరు ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి బీసీల‌కే చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. గాజువాక నియోజకవర్గం నుండి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 91 వేల ఓట్ల మెజారిటీతో ప‌ల్లా విజయం సాధించారు.

This post was last modified on June 15, 2024 8:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

27 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

5 hours ago