Political News

ఏపీ టీడీపీ ప‌గ్గాలు మారాయి.. మ‌రోసారి బీసీకే జై కొట్టిన బాబు!

ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌రాంద్ర‌కు చెందిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు.. ఆ ప‌ద‌విని వ‌దులుకున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా అచ్చెన్న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అవ‌కాశం కల్పించా రు. దీంతో అటు ప్ర‌భుత్వం, ఇటు పార్టీ బాధ్య‌త‌ల‌ను రెండింటినీ స‌మ‌న్వ‌యం చేయ‌డం ఇబ్బంది అవుతుంద‌ని భావించిన చంద్ర బాబు.. అచ్చెన్నాయుడిని పార్టీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. 2020లో పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అచ్చెన్నాయుడు స‌మ‌ర్థ‌వంతంగా పార్టీని ముందుకు న‌డిపించారు.

పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు .. స్వ‌యంగా రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు చేసిన అచ్చెన్నాయుడు పార్టీని గాడిలో పెట్టారు. వివాదాలకు దూరంగా చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఆయ‌న పార్టీని న‌డిపించ‌డంలో స‌క్సెస అయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు తెలంగాణ‌, ఏపీల‌కు ప్ర‌త్యేక అధ్య‌క్షుల‌ను ఎంపిక చేశారు. తొలినాళ్ల‌లో ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌నగ‌రం జిల్లాకు చెందిన క‌ళా వెంక‌ట్రావుకు ఈ ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. 2019లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీ ప‌గ్గాలు వ‌దులుకున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడును ఎంపిక చేశారు.

ఇక‌, ఇప్పుడు అచ్చెన్న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఏపీ టీడీపీ రాష్ట్ర ప‌గ్గాల‌ను సీనియ‌ర్ నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ పల్లా శ్రీనివాస రావుకు చంద్ర‌బాబు అప్ప‌గించారు. తాజా ఎన్నిక్ల‌లో ప‌ల్లా విశాఖ‌లోని గాజువాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా ఆయ‌న ఉన్నారు. వివాద ర‌హితుడిగాను పేరు తెచ్చుకున్నారు. యాద‌వ సామాజిక వ‌ర్గంలోనూ మంచి పేరు ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి బీసీల‌కే చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. గాజువాక నియోజకవర్గం నుండి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 91 వేల ఓట్ల మెజారిటీతో ప‌ల్లా విజయం సాధించారు.

Satya

Recent Posts

తెలంగాణ ప్రభుత్వానికి పవన్ సవాల్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్‌పల్లి…

39 seconds ago

హైద‌రాబాద్‌లో ఐమాక్స్… ఒక‌టి కాదు

దేశంలో అత్య‌ధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. గ‌తంలో…

50 minutes ago

తెలంగాణ మీ అయ్య జాగీరా?.. పవన్ ఫైర్

ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…

1 hour ago

ఒక్కడు పోలికకు సైనికుడే దొరికిందా

దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…

2 hours ago

“పాపం… పవన్ కల్యాణ్ ను బలి చేయొద్దు”

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…

3 hours ago

అస్సలు తగ్గనంటున్న గుణశేఖర్

సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…

3 hours ago