Political News

ఏపీ టీడీపీ ప‌గ్గాలు మారాయి.. మ‌రోసారి బీసీకే జై కొట్టిన బాబు!

ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌రాంద్ర‌కు చెందిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు.. ఆ ప‌ద‌విని వ‌దులుకున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా అచ్చెన్న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అవ‌కాశం కల్పించా రు. దీంతో అటు ప్ర‌భుత్వం, ఇటు పార్టీ బాధ్య‌త‌ల‌ను రెండింటినీ స‌మ‌న్వ‌యం చేయ‌డం ఇబ్బంది అవుతుంద‌ని భావించిన చంద్ర బాబు.. అచ్చెన్నాయుడిని పార్టీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. 2020లో పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అచ్చెన్నాయుడు స‌మ‌ర్థ‌వంతంగా పార్టీని ముందుకు న‌డిపించారు.

పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు .. స్వ‌యంగా రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు చేసిన అచ్చెన్నాయుడు పార్టీని గాడిలో పెట్టారు. వివాదాలకు దూరంగా చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఆయ‌న పార్టీని న‌డిపించ‌డంలో స‌క్సెస అయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు తెలంగాణ‌, ఏపీల‌కు ప్ర‌త్యేక అధ్య‌క్షుల‌ను ఎంపిక చేశారు. తొలినాళ్ల‌లో ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌నగ‌రం జిల్లాకు చెందిన క‌ళా వెంక‌ట్రావుకు ఈ ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. 2019లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీ ప‌గ్గాలు వ‌దులుకున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడును ఎంపిక చేశారు.

ఇక‌, ఇప్పుడు అచ్చెన్న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఏపీ టీడీపీ రాష్ట్ర ప‌గ్గాల‌ను సీనియ‌ర్ నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ పల్లా శ్రీనివాస రావుకు చంద్ర‌బాబు అప్ప‌గించారు. తాజా ఎన్నిక్ల‌లో ప‌ల్లా విశాఖ‌లోని గాజువాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా ఆయ‌న ఉన్నారు. వివాద ర‌హితుడిగాను పేరు తెచ్చుకున్నారు. యాద‌వ సామాజిక వ‌ర్గంలోనూ మంచి పేరు ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి బీసీల‌కే చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. గాజువాక నియోజకవర్గం నుండి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 91 వేల ఓట్ల మెజారిటీతో ప‌ల్లా విజయం సాధించారు.

This post was last modified on June 15, 2024 8:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago