Political News

ఏపీ టీడీపీ ప‌గ్గాలు మారాయి.. మ‌రోసారి బీసీకే జై కొట్టిన బాబు!

ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌రాంద్ర‌కు చెందిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు.. ఆ ప‌ద‌విని వ‌దులుకున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా అచ్చెన్న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అవ‌కాశం కల్పించా రు. దీంతో అటు ప్ర‌భుత్వం, ఇటు పార్టీ బాధ్య‌త‌ల‌ను రెండింటినీ స‌మ‌న్వ‌యం చేయ‌డం ఇబ్బంది అవుతుంద‌ని భావించిన చంద్ర బాబు.. అచ్చెన్నాయుడిని పార్టీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. 2020లో పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అచ్చెన్నాయుడు స‌మ‌ర్థ‌వంతంగా పార్టీని ముందుకు న‌డిపించారు.

పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు .. స్వ‌యంగా రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు చేసిన అచ్చెన్నాయుడు పార్టీని గాడిలో పెట్టారు. వివాదాలకు దూరంగా చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఆయ‌న పార్టీని న‌డిపించ‌డంలో స‌క్సెస అయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు తెలంగాణ‌, ఏపీల‌కు ప్ర‌త్యేక అధ్య‌క్షుల‌ను ఎంపిక చేశారు. తొలినాళ్ల‌లో ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌నగ‌రం జిల్లాకు చెందిన క‌ళా వెంక‌ట్రావుకు ఈ ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. 2019లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీ ప‌గ్గాలు వ‌దులుకున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడును ఎంపిక చేశారు.

ఇక‌, ఇప్పుడు అచ్చెన్న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఏపీ టీడీపీ రాష్ట్ర ప‌గ్గాల‌ను సీనియ‌ర్ నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ పల్లా శ్రీనివాస రావుకు చంద్ర‌బాబు అప్ప‌గించారు. తాజా ఎన్నిక్ల‌లో ప‌ల్లా విశాఖ‌లోని గాజువాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా ఆయ‌న ఉన్నారు. వివాద ర‌హితుడిగాను పేరు తెచ్చుకున్నారు. యాద‌వ సామాజిక వ‌ర్గంలోనూ మంచి పేరు ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి బీసీల‌కే చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. గాజువాక నియోజకవర్గం నుండి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 91 వేల ఓట్ల మెజారిటీతో ప‌ల్లా విజయం సాధించారు.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

1 hour ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

1 hour ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

3 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

6 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

7 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

7 hours ago